ఆంధ్ర ప్రదేశ్

ప్రజా సమస్యలను  త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలి – నందికొట్కూరు MLA గిత్త  జయసూర్య.

గ్రీవెన్సెస్ కార్యక్రమంలో  …. నందికొట్కూరు శాసనసభ్యుడు  గిత్త  జయసూర్య V POWER NEWS  :  నంద్యాల జిల్లా,  నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ ప్రజాపిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 9 నెలలు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టార‌ని, సామాన్యుడికి కూడా పరిపాలనను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు అన్నారు. ప్రజల నుంచి, అర్జీలు  స్వీకరించారు. అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, మూడవ  శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ,ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనాలని సూచించారని , ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనడం జరిగినది.  

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా .. మహిళలకు పోషకహారం, యోగ ఆసనాలు మానసిక వత్తిడి ఫై గురించి అవగాహనా కార్యక్రమం.

 V POWER NEWS  : కర్నూల్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారోత్సవాలు మార్చ్ 1 నుండి 8వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి.స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. నిర్మల ఆదేశాల మేరకు కార్యక్రమం లో భాగంగా మహిళలకు పోషకహారం గురించి అవగాహనా కల్పించారు . అన్ని చిరుదన్యాలు, ఆకుకూరలు, కూరగాయల ప్రదర్శనను ఏర్పాటు చేసి మహిళలకు వివరించడం జరిగింది. అలాగే యోగ చెయ్యడం ద్వారా మహిళలు , మానసిక వత్తిడిలకు లోను కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. మహిళలు ఇంట్లో గూడా యోగ ఆసనాలు చేసుకోవడం వలన మానసిక వత్తిడికి గురి కాకుండా ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ సునీత పారా మెడికల్ పి. రేష్మ పాల్గొన్నారు.

కౌతాళం మండలం నూతన MPDO ఇన్చార్జి గా బాధ్యతలు స్వీకరించిన సత్యన్న ..

మర్యాద పూర్వకంగా కలిసినా మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య , అడివప్ప గౌడ్ మరియు పట్టాభి… V POWER NEWS  : కౌతాళం నూతన ఇన్చార్జి ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించిన సత్యాన్న గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు.అటు ప్రభుత్వం ఇటు ప్రజలతో మమేకమై పనిచేయ్యాలని, రిటైర్డ్ అయిన సుబ్బరాజు వారిలా పనిచేసి మండల అభివృద్ధికి కృషి చెయ్యాలని సూచించారు. అన్ని అనుబంధ అధికారులతో సమన్వయం చేసుకొని స్నేహపూర్వకమైన సేవ అందించాలని,మండలానికి అభివృద్ధి సంక్షేమం అందించి ప్రజల మన్నలు పొంది,ఉన్నత అధికారుల చేత ప్రశంసలు పొందాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమాములో కూటమి పార్టీ నాయకులు రామాలింగ , చంద్రన్న ,మారెప్ప,లక్కే గోవిందు, కురువ నాగేష్,రంగస్వామి,మాకన్నా,శివ చూడి,అమ్ము వలీమహాదేవ,శ్రీరామ్ మొదలగు వారు పాల్గొనడం జరిగినది.

భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారిద్దాం’..

స్కానింగ్ కేంద్రాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతి అందించే అవకాశం. … నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేల జరిమనా నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ..లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలను ఉపేక్షించొద్దు. … రానున్న రోజుల్లో లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు. V POWER NEWS  .. ADONI :    సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు కృషిచేయాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సబ్ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో భృణ హత్యలు నివారించడం పీసీ పీఎన్డీటీ చట్టంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం డివిజన్ లోని స్కానింగ్ నిర్వాహకులు, ప్రైవేట్, ప్రభుత్వ వైద్య అధికారులకు, మరియు సంబంధిత అధికారులతో , సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… తల్లిందండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారానే భ్రూణ హత్యలను నివారించగలమన్నారు. రానున్న రోజుల్లో గర్భస్థ శిశువులపై లింగ వివక్షకు వ్యతిరేకంగా, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కలిగించాలని నిర్ణయించారు. లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. పీసీ పీఎన్డీటీ చట్టం ప్రకారం స్కానింగ్ కేంద్రాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతి అందించే అవకాశం ఉందన్నారు.ఆదోని డివిజన్ పరిధిలో 48 స్కానింగ్ కేంద్రాలు ఉండగా. డివిజన్లో ఉన్న స్కానింగ్ కేంద్రాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేసి నూతన రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్, సిబ్బంది, చిరునామా, పరికారాల్లో మార్పులు వంటి అంశాలపై తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా స్కానింగ్ సెంటర్లను అనుమతులు రద్దు చేయాలన్నారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి హేమలత మాట్లాడుతూ…భ్రూణ హత్య అనేది సమాజానికి కలిగే తీవ్ర అనర్థం మాత్రమే కాకుండా, చట్టపరంగా కూడా నేరం. గర్భంలో ఉండగానే లింగ నిర్ధారణ చేసి, ఆడ శిశువులను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం మన సమాజం ఎదుట ఉన్న సవాలుగా మారింది. భారతదేశంలో “పురుష-స్త్రీ నిష్పత్తి” అసమతుల్యతకు ప్రధాన కారణంగా భ్రూణ హత్యలు ఉన్నాయి. ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. “భ్రూణ హత్య నిషేధ చట్టం – 1994 (PCPNDT Act)” ప్రకారం, గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ చేయడం మరియు భ్రూణ హత్య చేయడం చట్టబద్ధంగా నిషేధించబడింది. ఆడ పిల్లల తల్లిదండ్రులుకు చదువు యొక్క విలువలను తెలియజేసి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని వారిని ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా వారికి అవగణ కల్పించాలని సంబంధిత అధికారులకు డి.ఎస్.పి హేమలత సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో సత్యవతి మాట్లాడుతూ…లింగ నిర్ధారణ చేయకుండా ఉండటం – వైద్యులు ఎవరూ గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించరాదన్నారు. నైతిక వైద్య సేవలు అందించడం – పేదరికం, కుటుంబ ఒత్తిళ్ల వలన భ్రూణ హత్యకు ఒత్తిడి ఎదుర్కొనే తల్లులకు మానసిక, వైద్య పరమైన సలహా అందించాలన్నారు. చట్టాన్ని కఠినంగా పాటించడం – PCPNDT చట్టాన్ని ఉల్లంఘించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.సామాజిక అవగాహన పెంచడం – భ్రూణ హత్యల హానికారక ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల ప్రాముఖ్యతను గుర్తించడం – బాలికల హక్కులను ప్రోత్సహిస్తూ, “బేటీ బచావో – బేటీ పడావో” వంటి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.ఈ సమావేశంలో డి.ఎస్.పి హేమలత, డిప్యూటీ డి.యం.హెచ్.వో డాక్టర్ సత్యవతి, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, డెమో అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ డెమో అధికారి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా మానిటరింగ్ కన్సల్టెంట్ అధికారి సుమలత, సిడిపిఓస్ సఫర్ నిషా బేగం, ఉమ మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

సైనికుల త్యాగం గొప్పది వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలి … నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

– మూగ, చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతం. – వైద్య సేవల్లో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదాం. — నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. V POWER NEWS  …NANDYAL  :   దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా  మూగ, చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.  సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్బంగా నంద్యాల మధు మణి ఆసుపత్రి ఆవరణలో నంద్యాల భారతీయుల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో  వీర సైనికునికి వందనం పేరుతో ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లలో పనిచేస్తున్న సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలోని అన్ని ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఓ పి డి చికిత్సలు, వినికిడి లోపల ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు ( వినికిడి యంత్రాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణి చేశారు.  ఈ సందర్బంగా ఎంపీ శబరి మాట్లాడుతూ దేశ సేవలో సైనికుల త్యాగం గొప్పదని వారికీ, వారి కుటుంబాలకు ప్రయివేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడం అభినందనీయం అన్నారు.  అలాగే మధు మణి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదనరావు  రూ 1000/- విలువైన వినికిడి పరీక్ష (OAE) పూర్తిగా ఉచితంగా, వినికిడి సమస్యల వారికి ఉచిత పరీక్షలు చేయడం,  పుట్టు, మూగ, చెవిటి పిల్లలు శబ్దాలు విన్నా తిరిగి చూడని పిల్లలు, రెండు అక్షరాల పదాలు అత్త, మామ, అమ్మ,అని కూడా పలుకలేకపోయిన నిరుపేదలకు  ఉచితంగా వినికిడి యంత్రాలు అందించడం,  2-3 సంవత్సరాలైనా అందరి పిల్లల మాట్లాడకపోయిన వారి రెండు చెవులకు 13 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని మధుమణి నర్సింగ్ హోమ్ నందు డా. ఎన్. టి. ఆర్ వైద్య సేవ & CMRF ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయం అన్నారు. భారతదేశంలో నంద్యాల లాంటి చిన్న జిల్లాలలో 150 ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసిన ఏకైక ఆసుపత్రి మధుమణి నర్సింగ్  గర్వాంగా ఉందన్నారు.  అందరు డాక్టర్ల సహకారంతో  నంద్యాల జిల్లాను వైద్య సేవల్లో మొదటి స్థానం నిలుపుదాం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు. నంద్యాల వైద్యుల బృందంను త్వరలో ఢిల్లీలోని డిఫెన్స్ మంత్రి వద్దకు తీసుకెళ్లుతానని ఆమె చెప్పారు. రాష్ట్రంలోనే నంద్యాల వైద్యుల ఉచిత సేవలు గొప్పవని చాటుద్దాం అన్నారు.  ఈ కార్యక్రమంలో  టీడీపీ నాయకులు ఎన్ ఎం డి ఫయాజ్, ఎంపీ శబరి గురువు లు డాక్టర్ ఫణిందర్, నంద్యాల ఐ ఎం ఏ అధ్యక్ష, కార్యదర్సులు మధుసూదనరావు, జి. రవికృష్ణ, డాక్టర్లు నాగమణి, మాధవి, మణిదీఫ్, ఎం. వెంకట మస్తానయ్య, రోహిత్, తదితర వైద్యులు ఉన్నారు.

విద్య అభివృద్ధికి అధికార్లు కృషి చేయాలి …

కూటమి ప్రభుత్వం విద్య అబివృద్దికి పెద్దపీట వేస్తోంది.. ఆలూరు టీడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ V POWER NEWS  :  కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గంమునకు సోమవారం నాడు  ప్రత్యేక అధికారిగా నియామకం అయిన అజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పాఠశాలల విలీనం జీవో ను అందజేశారు. మంత్రి నార లోకేష్ అసెంబ్లీ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తానని ప్రకటించడం హర్షణీయమన్నారు. విద్య వ్యవస్థను గత వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వం విద్య అబివృద్దికి పెద్ద పీట వేస్తుడన్నారు..తల్లికి వందనం కూడా ప్రతి విద్యార్థికి అందిస్తామని సిఎం ప్రకటించి బడ్జెట్ కూడా కేటాయించారన్నారు.  ఆయన వెంట ఆలూరు ఎంఈఓ- 2 చిరంజీవి రెడ్డి, విద్య శాఖ అధికార్లు అన్నారు.

మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా ” అడవి బిడ్డల సేవలో – రెడ్ క్రాస్ వైద్య సేవలు “

నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి రాజకుమార్ గణియ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల ఆదేశాలతో .. మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించిన శ్రీశైలం రెడ్ క్రాస్ బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య ఆధ్వర్యంలో నల్లమల అడవులలో నివసిస్తున్న అడవి బిడ్డలైన చెంచు గిరిజనులకు ఉచిత వైద్య సేవలను అందించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలోని హటకేశ్వరం వద్దగల చెంచుగూడెం లో నివసిస్తున్న చెంచు బిడ్డలకు రెడ్ క్రాస్ సొసైటీ వారి మొబైల్ హెల్త్ వ్యాన్ ను అందుబాటులో పెట్టి వారి ఆరోగ్య సమస్యలపై చర్చించి వారికి అవసరమైన మందులు టానికులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నివసిస్తున్న చెంచు గిరిజనులు అందరికీ కూడా బిపి షుగర్ అలాగే పల్స్ ఆక్సి మీటర్ ద్వారా ఆరోగ్యమును పరీక్షించి వారికి అవసరమైన సిరప్ లను, టాబ్లెట్లను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయడం జరిగిందని శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న చెంచు గిరిజనులు నల్లమల అడవుల్లోకి వెళ్లి అటవీ ఉత్పత్తులను సేకరించి వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తుంటారు కనుక ఎక్కువగా వీరి జీవనం అడవులలో సాగుచున్నందున చెంచులకు ఎక్కువగా చర్మ సంబంధిత వ్యాధులు దగ్గు ఆయాసం ఆస్తమా గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, కర్నూల్ జిల్లా చైర్మన్ శ్రీ KG గోవింద రెడ్డి, గార్ల సహకారంతో మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా అడవి బిడ్డలకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు. అలాగే ఈ సంవత్సరం శివరాత్రికి మొబైల్ హెల్త్ వ్యాన్ ద్వారా ఈసీజీ, ఆక్సిజన్ సిలిండర్, పల్స్ అక్సిమీటర్ బీపీ చెకింగ్ వంటి అత్యవసరమైన వైద్య పరికరాలను కైలాస ద్వారం వద్ద 24/7 అందుబాటులో ఉంచి ఎంతోమంది భక్తులకు వైద్య సేవ అందించడం జరిగింది తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామీణ వైద్యులు డాక్టర్ కే ప్రసాద్, విజయలక్ష్మి తో పాటుగా సభ్యులు ఎస్ భాస్కర్, దమయంతి, ఫారెస్ట్ అధికారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ టాగోర్ గారు అంబులెన్స్ డ్రైవర్ వరుణ్ కౌశిక్ మొదలవారి పాల్గొన్నారని శ్రీశైలం బ్రాంచ్ చైర్మన్ నాగ శేషయ్య తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉంటాం – బిజెపి

ప్రతి బిజెపి కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారంలో మమేకమవుదామని పిలుపునిచ్చిన .. బిజెపి సీనియర్ నాయకులు, జిల్లా ఎన్నికల సహాధికారి దేశాయి చంద్రన్న. V POWER NEWS . ADONI  ఆదివారం స్థానిక అసెంబ్లీ కార్యాలయంలో ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షుడు తోవి నాగార్జున అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు, కో – కన్వీనర్ నాగరాజు గౌడ్ లు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు అందేవిధంగా కృషి చేయాలన్నారు. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులంతా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులందరికీ నియామక పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు న్యాయవాది లోకేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ సింహం నాగేంద్ర, కౌన్సిలర్ వాషిమ్, ప్రధాన కార్యదర్శులు రమేష్ ఆచారి, వినోద్ కుమార్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థి శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్

అంత్యక్రియలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినా .. జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ V POWER  NEWS :   కర్నూలు జిల్లా  సీ. బెలగల్ మండల పరిధిలోని పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక శ్రీలేఖ మృతి చెందింది. ఫిబ్రవరి 28వ తేదీన పోలకల్ పాఠశాల మైదానంలో వున్న చెట్టు ఈదురు గాలులకు మీద పడటం తో తీవ్రగాయాల పాలయ్యింది. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. ప్రమాదం జరిగిన రోజు నుండి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా డిఇఓ తో పాటు మండల విద్య శాఖ అధికారి ఆదమ్ బాషా గారు , హెడ్మాస్టర్ అసోసియేషన్ , ఆ పోలకల్ హెడ్మాస్టర్ మరియు టీచర్స్ ఆవిరామంగా కృషి చేశారు. డీఈఓ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే కాకుండా మండల విద్యాధికారులు అక్కడే వుంచి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం శ్రీలేఖ తుదిశ్వాస వదలడంతో జిల్లా విద్యాధికారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధను దిగమింగి పోస్టుమార్టం వద్ద తనే దగ్గర వుండి బాలిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మేమున్నామంటూ భరోసాను కుటుంబ సభ్యులకు అందించారు. స్వగ్రామం గోనెగండ్ల మండలపరిధిలోని పెద్దనెలటూరుకు వెళ్లిన జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసి నివాళులు అర్పించారు. వెంటనే అంత్యక్రియలకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో “అంతర్జాతీయ మహిళా దినోత్సవ” వారోత్సవాలు …

V POWER NEWS :   కర్నూల్ పట్టణంలో, స్త్రీ శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సాధికారత ఆదేశాల మేరకు, అంతర్జాతీయ మహిళా దిన వారోత్సవాల సందర్బంగా, మార్చ్ 1 నుండి 8 వరకు మహిళా హక్కులు ,మానవ హక్కులు, సమాన వేతనం, పనిలో గౌరవం, మహిళకు, బాలికలకు ,రక్షణలో భాగంగా, ప్రజలు ప్రజాస్వామ్యకవాదులు, కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.  అందులో భాగంగా నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, స్కూలు విద్యార్థులు, మెప్మా పొదుపు సంఘాల మహిళలు మరియు కలెక్టర్ కార్యాలయం నుండి మెడికల్ కాలేజ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మహిళలు మరియు బాలికలందరికి హక్కులు, సమానత్వం, సాధికారత ఉండాలని సమాజానికి ప్లే కార్డు ద్వారా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగి ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని పి. నిర్మల, ACDPO రేవతి జోష్ట్న, మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీనివాస్ ఆచారి, DCPO శారదా, ఇండ్ల విజయలక్ష్మి ,వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి. మేరీ, స్వర్ణలత, మరియు ఫేవోర్డ్ నెట్వర్క్ ఏవి రమణయ్య ,కొమ్ము పాలెం శ్రీనివాస్ , మధు, శకుంతల, ఎలీషాబాబు పాల్గొన్నారు.

error: Content is protected !!