V POWER NEWS : కర్నూల్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారోత్సవాలు మార్చ్ 1 నుండి 8వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి.స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. నిర్మల ఆదేశాల మేరకు కార్యక్రమం లో భాగంగా మహిళలకు పోషకహారం గురించి అవగాహనా కల్పించారు . అన్ని చిరుదన్యాలు, ఆకుకూరలు, కూరగాయల ప్రదర్శనను ఏర్పాటు చేసి మహిళలకు వివరించడం జరిగింది. అలాగే యోగ చెయ్యడం ద్వారా మహిళలు , మానసిక వత్తిడిలకు లోను కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. మహిళలు ఇంట్లో గూడా యోగ ఆసనాలు చేసుకోవడం వలన మానసిక వత్తిడికి గురి కాకుండా ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ సునీత పారా మెడికల్ పి. రేష్మ పాల్గొన్నారు.