పంచలింగాల గ్రామంలో … ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసినా …కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు
… బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరాహితం… గత పాలకుల కంటే రెండింతలు అధికంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది.. ఎం.పి బస్తిపాటి నాగరాజు V POWER NEWS : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరాహితమని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ గత పాలకుల కంటే రెండింతలు అధికంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు.. అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ రూపొందించారన్నారు.. ఇక ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలకు కట్టుబడి ఉన్నామన్న ఎం.పి..రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కృష్ణ యాదవ్, రఫిక్, సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు..