ప్రధాన మంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయండి .. మంత్రి టీజీ భరత్

V POWER NEWS, KURNOOL : కర్నూలు జిల్లాలో ఈ నెల 16 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి  వద్ద పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ప్రధాన మంత్రి పర్యటనను ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు.హెలిప్యాడ్,సభాప్రాంగణం, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు,ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు..  

బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి…100 మంది పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతికి చెందిన ఎంపీ బస్తీపాటి నాగరాజు

V POWER NEWS: కర్నూలు జిల్లా…హొళగుంద మండలం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు చనిపోవడంతో పాటు వంద మందికి పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఈ ఘటన పై అధికారులతో మాట్లాడి , గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.అనంతరం మాలమల్లేశ్వర స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్న మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరుపున ఆధుకుంటామన్న కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగరాజు పేర్కొన్నారు.

రేషన్ షాపు డీలర్,సచివాలయ ఉద్యోగుల ద్వారా.. స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చు … జాయింట్ కలెక్టర్

నగరంలోని బుధవారపేట లో ఎఫ్.పి.షాపులను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య V POWER NEWS  : కర్నూలు జిల్లాలో అక్టోబర్ నెల 15 వ తేదీ వరకు రేషన్ షాప్ డీలర్ల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చని,16 వ తేదీ తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేయబడతాయని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు. బుధవారం నాడు నగరంలోని బుధవారపేట లో 1382073, 1382075 ఎఫ్.పి.షాపులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి రేషన్ పంపిణీ ని పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్.పి షాపుల ద్వారా వినియోగదారులకు రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయాలని, ఎవరైనా డీలర్లు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.

సెట్కూర్ సిఈఓ మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కే వేణుగోపాల్ ఆధ్వర్యంలో .. తడికనపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ మరియు సూపర్ జిఎస్టి  – సూపర్  సేవింగ్ పై అవగాహన

ప్రజల మౌలిక సదుపాయాలపై జీఎస్టీని తగ్గించి ఆర్థిక సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది కృషి చేస్తుంది … సెట్కూర్ సిఈఓ మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కే వేణుగోపాల్ V POWER NEWS : కర్నూలు జిల్లాలో.. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సెట్కూర్ సిఈఓ మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కే వేణుగోపాల్  ఆధ్వర్యం లో కల్లూరు మండలంలోని తడికనపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ మరియు సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రజల యొక్క అవసరాల మేరకు ఔషధాలు, పాలు, నిత్య అవసరాలు, ఎల్ఐసి పాలసీలు మొదలైన వాటి మీద ప్రభుత్వం వారు జీఎస్టీని తగ్గించి ప్రజలు ఆర్థిక సంక్షేమానికి కృషి చేయడానికి ప్రయత్నం చేసిందని దయచేసి ఈ విషయంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. తదుపరి గ్రామ ప్రజలందరితో కలిసి ర్యాలీ నిర్వహించటం జరిగినది. ఈ సమావేశం హాజరైనటువంటి డిసిపిఓ రామకృష్ణ  ప్రభుత్వంలో జిఎస్టి స్లాబ్ రేట్స్ గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి జిఎన్ఎస్ రెడ్డి మరియు ఉప మండల అభివృద్ధి అధికారి నగేష్, ఏపీఎం పుష్ప,సర్పంచ్ సహేరబి,పొదుపు సంఘ నాయకురాలు జుబేదాబీ  ఇతర గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగినది.

సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రి .. ఉరుసులో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు

కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నార కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు V POWER NEWS: కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రి ఉరుసులో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎంపీ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు..అంతకముందు దర్గాకు చేరుకున్న ఎంపీ కి దర్గా నిర్వహకులు ఘనంగా స్వాగతం పలికారు..ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకుడు మొహమ్మద్ రఫీ, దర్గా నిర్వాహకులు షబ్బీర్, షహీన్, మున్నా, ఖాదర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు..కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్వహించిన సయ్యద్ సైఫుల్లా షా ఖాద్రి ఉరుసులో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎంపీ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు..అంతకముందు దర్గాకు చేరుకున్న ఎంపీ కి దర్గా నిర్వహకులు ఘనంగా స్వాగతం పలికారు..ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకుడు మొహమ్మద్ రఫీ, దర్గా నిర్వాహకులు షబ్బీర్, షహీన్, మున్నా, ఖాదర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు..

మానసిక ఒత్తిడి, దురాలవాట్ల కారణంగా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి…ఎంపీ బస్తిపాటి నాగరాజు

వ్యాయామాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగస్వామి చేసుకోవాలని సూచించిన .. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు   కర్నూలు నగరంలోని ఏ.క్యాంపులో గలకర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో నిర్వహించిన ప్రపంచం హృద్రోగ దినోత్సవ వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జీ వెంకటేష్, హార్ట్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ వీ.సీ డాక్టర్.చంద్రశేఖర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మానసిక ఒత్తిడ, దురాలవాట్ల కారణంగా రోజు రోజుకూ గుండె జబ్బులు పెరిగిపోతున్నాయన్నారు.50శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తుండటం బాధాకరమన్నారు. ప్రతి రోజూ 40 నిముషాల పాటు నడవడం, యోగా చేయడం తో పాటు సరైన ఆహార నియమాలు పాటిస్తే హృద్రోగ సమస్యలు తలెత్తవని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్. ప్రతాప్ శరత్,హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కల్కూర చంద్రశేఖర్,ఉపాధ్యక్షుడు డాక్టర్.భవాని ప్రసాద్ మరియు వైద్యులు పాల్గొన్నారు..

గ్రామాలలో..జనసేన వైపు గ్రామస్తుల చూపు .. సంధ్య విక్రమ్ కుమార్

V power news : కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు మండలం అనుగొండ, ముడుమాలకుర్తి ,వెంకటగిరి కొత్తూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో సంధ్య విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన కండువా వేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడుమూరు నియోజవర్గంలో జనసేన పార్టీ రోజురోజుకీ బలపడుతుందని ప్రతి ఒక్కరూ పార్టీకి పనిచేయడానికి ముందుకు రావడం శుభ పరిణామం అని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మనమంతా కలిసి పార్టీని మరింత బలోపేతం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను చింత సురేష్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ప్రతి గడపకు చేరుద్దామని ఆయన చేస్తున్న మంచిని వివరిద్దామని కూటమి ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సైనికుల్లా కదులుదామని ఆయన పిలుపునిచ్చారు.

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

…. కర్నూలు జిల్లాలో  స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా చౌక దుకాణల్లో సరుకులను సులభతరంగా తీసుకోవచ్చని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని గ్రామ సచివాలయంలో రేషన్ కార్డుదారులకు ఆయన స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం అందులో భాగంగా స్మార్ట్ కార్డులను అందజేస్తుందన్నారు. ఇప్పటి వరకు వేలి ముద్రలు పడక రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారని, ఇప్పుడు వేలి ముద్రలు పడకపోయిన స్మార్ట్ కార్డును స్కాన్ చేసి సరుకులు తీసుకోవచన్నారు. ఏటీఏం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులో కార్డు దారుడి ఫోటోతో పాటు కుటుంబ సభ్యులు,ప్రభుత్వ గుర్తింపు ముద్ర మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణ యాదవ్, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటూ… జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుందాం …కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

జిల్లాలో రూ.  14 కోట్లతో   5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాo .. జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు శనివారం ఉదయం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటకదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి  మాట్లాడుతూ….ఈ ఏడాది  ప్రపంచ పర్యాటక దినోత్సవం ధీమ్ స్థిరమైన పర్యాటకం మరియు పరివర్తన అని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందాం అని సూచించారు.జిల్లాలో రూ.  14కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను, కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్  సూచించారు.. మనం ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నీరు త్రాగి మన ఆరోగ్యాన్ని , పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నామని దాన్ని వెంటనే ఆపాలని, అలాగే  ఇళ్లలో, కార్యాలయాల్లో  ఏసీ , కరెంటు  వాడకాలను తగ్గించి  పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. సోలార్ పవర్ , విండ్ పవర్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి  కర్బన ఉద్గారాలు లేకుండా  పర్యావరణాన్ని కాపాడుతూ, పవర్ అందించే చర్యలు తీసుకుంటోందన్నారు.జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి గణనీయంగా పెరుగుతోందని, తద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లా టూరిజం మరియు డివిజనల్ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ …స్పెయిన్ దేశంలో ప్రపంచ పర్యావరణ ఆర్గనైజేషన్ 45 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రతి సంవత్సరం ఒక థీమ్ ప్రకారం జరుపుకోవడం జరుగుతుందని ఈ సంవత్సరం టూరిజం మరియు సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. దీని ప్రకారం పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుంటూ సుస్థిరమైన మార్గంలో పయనించడం.ఉమ్మడి జిల్లాలో ప్రకృతి పరంగా పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతికపరంగా పర్యాటక ప్రదేశాలు ఉన్నవని వాటిని పర్యావరణాన్ని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామని తద్వారా యువతకు ఉపాధి కలుగుతుందని జిల్లా అభివృద్ధి చెందుతుందని , కర్నూలు జిల్లాలో శిల్పారామంను ఏర్పాటు చేస్తున్నామని , స్థానికంగా హరిత హోటల్ ను పర్యాటకులను ఆకర్షించే విధంగా మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో చిన్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత్య ప్రదర్శనలు, మోహన్ బాబు చేసిన డాన్సింగ్ డాల్స్  ప్రదర్శనలు , గురవయ్యాల నృత్యం, కోలాటం  ఆహుతులను అలరించాయి. జిల్లా కలెక్టర్ వారికి జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా ఈ సమావేశానికి డి ఆర్ ఓ వెంకటనారాయణమ్మ, డిస్ట్రిక్ట్  టూరిజం డివిజనల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, జడ్పి సి ఈ ఓ నాసర రెడ్డి,హోసింగ్ పీడీ చిరంజీవి, సీఈవో సెట్కూర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఐఓ లాలెప్ప, డిఎస్ఓ రాజా రఘువీర్ , ఎస్ డి సి నాగ ప్రసూన లక్ష్మి,ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్డిసి కొండయ్య, డి ఆర్ డి ఏ పీడీ రమణారెడ్డి, సీపీవో భారతి, తహసీల్దారులు రమేష్, రవి , శ్రీనాథ్, టీజీవీ కళా క్షేత్రం కళారత్న పత్తి ఓబుళయ్య, టూరిజం శాఖ సిబ్బంది, ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.  

APRSA కర్నూలు రెవెన్యూ డివిజన్ ఆధ్వర్యంలో … సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ వర్ధంతి

సింహపురి సింహము కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ చిత్రపటానికి  పూల మాలలు వేసిన APRSA కర్నూలు డివిజన్ అధ్యక్షులు వి.రామాంజనేయులు & సెక్రటరీ వేణుగోపాల్ రావు, డివిజన్లోని తహసీల్దారులు  V POWER NEWS  : కర్నూలు రెవెన్యూ డివిజన్ APRSA సభ్యులoదరూ కలిసి, రెవిన్యూ డివిజన్ కార్యలయము సమావేశ మందిరములో కర్నూలు డివిజన్ అధ్యక్షులు వి.రామాంజనేయులు & సెక్రటరీ వేణుగోపాల్ రావుల అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభ జరిగింది.ఈ సభకు కర్నూలు డివిజన్ లోని రెవిన్యూ డివిజన్ సభ్యులు మరియు డివిజన్ లోని తహసీల్దారు లు హాజరై కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ ఫోటో కు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సింహపురి సింహము అయిన కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ సేవలను APRSA అధ్యక్షులు వి.రామాంజనేయులు కొనియాడారు.అలాగే APRSA ప్రతి సభ్యుడు అయన యొక్క స్ఫూర్తితో పోరాట పటిమతో యుండి ప్రతి యొక్క ఉద్యోగి కి సేవలను చేయాలనీ కొనియాడారు.అలాగే ఈ సందర్భంగా కల్లూరు తహసీల్దారు కే.ఆంజనేయులు,సి.బెళగల్ తహసీల్దారు శ్రీమతి వెంకటలక్ష్మి, కోడుమూరు తహసీల్దారు  బి.నాగరాజు మరియు విశ్రాంత తహసీల్దారు మల్లికార్జున తదితర వక్తలు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ సేవలను ప్రసంగించారు. ఈ  కార్యక్రమములో APRSA కర్నూలు డివిజన్ అసోసియేషట్ అధ్యక్షులు సతీష్,APRSA కర్నూలు డివిజన్ ట్రెజరర్ R. విష్ణు ప్రసాద్, APRSA కర్నూలు డివిజన్ E.C., మెంబర్ వెంకట సునీల్ కుమార్, పౌర సరఫరా శాఖ డిప్యూటీ తహసీల్దారు మురళీకృష్ణ, వెల్దుర్తి డిప్యూటీ తహసీల్దారు సి.గురుస్వామి రెడ్డి, EDM. జయక్రిష్ణ, RDO కార్యాలయం జూనియర్ సహాయకులు సోయబ్ అస్లాం భాష తదితర రెవిన్యూ ఉద్యోగులు అందరూ పాల్గొనడము జరిగినది

error: Content is protected !!