అంగరంగ వైభవంగా .. రాజా వీధి శ్రీ వరసిద్ధి గణనాధుణి నిమజ్జనం

శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామిజి కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి సమక్షంలో .. అంగరంగ వైభవంగా గణనాధుణి నిమజ్జనం, భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ నంద్యాల జిల్లా,నందికొట్కూరు పట్టణంలోని రాజావిధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా చేపట్టారు.ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు భాస్కర స్వామి మాట్లాడుతూ రాజావిధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మొదటి దినం నుండి 5వ రోజు నాడు వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. అదేవిదంగా నిమజ్జనం కార్యక్రమానికి సైతం వందలాది భక్తులకు అన్న ప్రసాదాలు ఎటువంటి లోటు లేకుండా చేయించామన్నారు.అలాగే అనేక పూజలు నిర్వహించి,స్వామివారి కృప దయను భక్తాదులకు అందించడంల శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామీజీ కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి అందించడం జరిగిందన్నారు.అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ మండపం వద్ద హోమం నిర్వహించి పూర్ణ ఆహుతి చేయించడం జరిగింది. దానితో నిమజ్జనం ఉత్సవం భక్తాదుల మధ్య నిమజ్జనానికి బయలుదేరిన రాజా వీధి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నిమజ్జనం చేసినట్లు శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామీజీ కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి తెలిపారు.