V POWER NEWS

డ్రోన్ కెమెరాలతో… ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి

V  POWER  NEWS  :   కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తు న్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్. ఆదివారం తెలిపారు. కర్నూల్ జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాలతో కర్నూల్ పట్టణంలో పోలీసులు డ్రోన్ల తో నిఘా పటిష్టం చేశారు.అనంతరం కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ట్రాఫిక్‌ ను పరిశీలించారు. ట్రాఫిక్ సిఐ  మాట్లాడుతూ…నిబంధనలు పాటించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు. ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తామన్నారు. అలాగే ప్రధాన సర్కిళ్లతోపాటు ట్రాఫిక్‌ రద్దీ ఉన్న ప్రాంత్రాలలో డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తామన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, వివిధ కాలనీల్లోని వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రధాన దృష్టి సారిస్తున్నాని, ట్రాఫిక్ జామ్ కాకుండా డ్రోన్ల ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నామని,ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఇరుకు రోడ్లలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్. 

నిర్లక్ష్య ధోరణి లో  ..  శ్రీశైలo దేవస్థానం ప్రభుత్వ ఆసుపత్రి 

V POWER NEWS, SRISAILAM  :   శ్రీశైలo దేవస్థానం ప్రభుత్వ ఆసుపత్రి వర్కింగ్ సమయంలో హాస్పిటల్ ని తెరిచి ఉంచి, డాక్టరు మరియు ఇతర సిబ్బంది హాస్పిటల్ లో లేకపోవడం, ఎమర్జెన్సీలో వచ్చినటువంటి రోగులని పట్టించుకోకపోవడం లేదనీ, శ్రీశైల దేవస్థానం స్వామివారి దర్శనార్థం యావత్ భారతదేశం నుండి అనేక విధాలైనటువంటి ఏజ్ లిమిట్ లేనటువంటి వారు భక్తులు వస్తుంటారు. వేసవికాలం సమయంలో, ప్రయాణంలో ఇబ్బందులకు  చేస్తున్నారన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉండే వారు, వేసవికాలంలో కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ హాస్పిటల్ చేరుకున్న వారికి, ఈరోజు సాయంత్రం 2:00 గంటల నుండి 4:00 గంటల వరకు డాక్టరు మరియు ఇతర సిబ్బంది లేకపోవడం, భక్తులకు మరియు స్థానికులకు రెండు గంటలసేపు వెయిటింగ్ చేసి, వెళ్లడం జరుగుతుంది. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పై, మరియు సిబ్బందిపై, చర్యలు తీసుకోవలసినదిగా, పాత్రికేయుల సమక్షంలో పై పెద్దలకు వినతి కోరుతున్నామన్నారు.  వేసవికాలంలో ఈ రకంగా ఆసుపత్రిని తెరిచి ఉంచి రోగులను వేటింగ్ చేయించడం సరికాదని, డాక్టరు లేని సమయంలో మిగతా సిబ్బంది కూడా అక్కడ లేకపోవడం రోగులకు ఇబ్బందికరంగా ఉందన, ఎవరూ లేని సమయంలో ఆసుపత్రిని తెరిచి ఉంచడం మంచిది కాదని, ఆసుపత్రి తెరిచి ఉంచినప్పుడు సంబంధిత సిబ్బంది ఉండవలసి ఉంటుందని తెలియపరుస్తూ ఇక్కడ డాక్టర్ లేడు ఆస్పత్రికి సంబంధించిన సిబ్బంది లేదు, కావున తక్షణం వీరిపై పై అధికారులు చర్యలు తీసుకోవలసినదిగా మీడియా ముఖంగా తెలియపరుస్తూ. ఈ విషయంపై హెల్త్ మినిస్టర్  శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఫిర్యాదు చేయవలసి ఉంటుందని అంతిరెడ్డి అరవింద రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. 

శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ పైల వాసుదేవరావుకు  విప్లవ జోహార్లు ..

  V POWER NEWS,  నందికొట్కూరు :  శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాటయోధుడు అజ్ఞాత సూర్యుడు సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ  పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి 15వ వర్ధంతి సభ స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ  కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ నాటి శ్రీకాకుళ గిరిజన సాయిధ రైతాంగ పోరాటంలో పనిచేసి భూమికోసం. భుక్తి కోసం .ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక మార్గమని నమ్మి తన తుది  శ్వాస విడిచే వరకు కామ్రేడ్ పైలా వాసుదేవరావు పనిచేశారన్నారు .బడా బూర్జువ  బడా భూస్వామ్య నిరంకుశ పాలక వర్గాలను మెడలు వంచి  ఈ దేశంలో ఎర్రజెండాను ఎగరవేయాలని పట్టుదలతో ప్రతిఘటన పోరాటాలను నిర్మించేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు .శ్రీకాకుళ పోరాట వారసత్వంతో దోపిడీ  పీడనలు లేని సమ సమాజ స్థాపన కై ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. నేడు దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న భూస్వామ్య బడా కార్పొరేట్ సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమి ఈ పోరాటాలను ఒక ప్రక్క నెత్తురు  టేర్ల లో ముంచుతూ మరోపక్క ప్రజలను మతం .కులం  తెగలు పేరుతో విభజించి తమ కార్పొరేట్ కాషాయఎజెండాను అమలు చేయడానికి బ్రాహ్మణీయ హిందుత్వను ప్రజలపై ప్రయోగిస్తున్నది .కుహనా దేశభక్తి జాతీయ తల పేరు చెప్పి లౌకికవాదంపై దాడి చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కూటమి సూపర్ సిక్స్  పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి నాలిక మడత పె బెడుతున్నది .మోడీ అమిత్ షా కూటమిలో భాగంగా ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపడానికి పూనుకుంటుంది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా భూస్వాములకు ఆదాని .అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు సామ్రాజవాదుల యొక్క బహుళ జాతి సంస్థలకు సేవ చేయడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు అందువలన అన్ని వర్గాల ప్రజలని సమరశీల పోరాటాలకు సమహిత్యం చేసినప్పుడే పైల గారికి నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారతా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం గోపాల్ . ఐ ఎఫ్ టి యు  డివిజన్ అధ్యక్షులు పి తిక్కయ్య .మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే గోవిందు .తిమ్మన్న .ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు దేవన్న. భాస్కర్ .రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

ఆంధ్రప్రదేశ్ లో… ఘనంగా ” శ్రీ సేవాలాల్ మహారాజ్ ” జయంతిని  అధికారికంగా  జరిపించాలి …

LHPS రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్    V POWER NEWS  :  లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం విలేకరుల సమావేశంలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్  మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా 15 కోట్ల జనాభా కలిగిన లంబాడి బంజారా తెగలకు సంబంధించిన వారు దేశవ్యాప్తంగా ఒకే సంస్కృతి ఒకె సాంప్రదాయాలు పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకే భాషని మాట్లాడుతూ జీవిస్తున్న బంజారా జాతి కులదైవం ఆరాధ్యుడు జాతి ప్రజలు అందరూ మంచి మార్గంలో నడవాలని భారతదేశమంతా కూడా నడిచి తన సందేశాన్ని బంజారా జాతి తో పాటు ఇతర జాతుల వారిని కూడా చైతన్యపరిచినటువంటి మార్గదర్శకుడు శాంతి స్వరూపుడు అహింస వాది నేటికీ ప్రతి రాష్ట్రంలో ఫిబ్రవరి 14,15 తేదీలలో శ్రీ సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు అధికారికంగా జరుపుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా జరపకపోవడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల పైబడి జనాభా గలిగిన లంబాడీల మనోభావాలు దెబ్బతీయడమే నని అన్నారు ఈ సందర్భంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న, త్రిపురనేని రామస్వామి చౌదరి,  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి , పుట్టపర్తి నారాయణచార్యుల,  బాబు జగజీవన్ రామ్,  మహాత్మ జ్యోతిరావు పూలే , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,  అల్లూరి సీతారామరాజు,  మహర్షి వాల్మీకి జయంతి ఇలా ప్రముఖుల జయంతుల్ని వర్ధంతులను ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ యువజన సర్వీసులు దేవాదాయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో 12 లక్షల పైబడిన జనాభా కలిగి 40 నియోజకవర్గాలలో ఓటు శాతం ఉన్న గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ని కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ  కార్య్రమంలో  ఎస్ నాగరాజు నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవావత్ శంకర్ నాయక్ మరియు తదితరులు ఉన్నారు.

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. V POWER  NEWS  : ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు సంయుక్తంగా ఆదేశాలు జారీ చేశారు.వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా,ఓవర్ స్పీడ్,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా,డ్రంకెన్ డ్రైవ్ వంటి తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.(మార్చి 30 నుండి ఏప్రిల్ 4 వరకు)గత వారంలో కర్నూలు జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల కేసులు 12 నమోదు కాగా,5 మంది మృతి చెందారని,12 మంది గాయపడినట్లు తెలిపారు.మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 136 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి,కోర్టుకి హజరు పరిచామన్నారు.

ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ నియామకం.

 V POWER NEWS  : రాష్ట్రంలో అవినీతి నిరోధక మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సంస్థకు ఆదోని నియోజకవర్గానికి చెందిన హెచ్ కె శ్రీకాంత్ (రావు)ని కర్నూలు జిల్లా సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీగా నియమిస్తూ ఫౌండర్ దేవానంద నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్ రావు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచిన ఫౌండర్ దేవానందనాయుడు కి అలాగే బోర్డ్ ఆఫ్ మెంబర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమస్త నిబంధనలు పాటిస్తూ నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడంలో నా సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు.

ప్రైవేటు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం ఇవ్వాలి — రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీPDSU

V POWER NEWS: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలలో పని చేస్తున్న అధ్యాపకులకు 12 నెలల వేతనం చెల్లించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ తెలిపారు.ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులతో వెట్టిచాకిరి చేస్తించుకుంటున్నారని అన్నారు.శ్రమకు తగ్గ వేతనం లేక ప్రైవేటు ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారని అన్నారు.యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తూ ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలల వేతనం ఇచ్చి సరిపెడులుతున్నారని.పాఠశాలలు,కళాశాలల విద్యార్థులకు ర్యాంకులు రావాలన్న,స్కూల్స్,కాలేజీలలో అడ్మిషన్ లు పెరగాలన్న కీలక భూమిక అందులో పని చేస్తున్న సిబ్బందిదే అన్నారు.కనీస సౌకర్యాలకు నోచుకోని జీవితాలు ప్రైవేటు విద్యాసంస్థల పనిచేస్తున్న ఉపాధ్యాయులు ది అన్నారు. కనీసం పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అంటివి ఏవి లేకుండా ఉద్యోగ భద్రత కూడా లేకుండా సంవత్సరాల తరబడి పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్న వాళ్లకు గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వాలు సైతం ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన వారిని ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వమైన ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల ఆలకించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

జిల్లా ఎస్పీని ఆశ్రయించినా … నా సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు… బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన

సప్తపదుల సూత్రాలలో … భర్త బలవంతముగా దౌర్జన్యంగా తీసుకొనివెళ్లి సంసారం చేయించుకోవడం ఒక సూత్రం అన్న సీఐ చంద్రబాబునాయుడు. నాకూ జరిగినా అన్యాయం  ఇంకోవరికి జరుగకుండా  చూడాలని  జిల్లా sp  ని కోరినా బాధితురాలు  భర్త,కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి, న్యాయం చేయండి మహాప్రభో. .. బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన.  V POWER NEWS  : news ప్రేమించానన్నాడు.అంగీకరించకపోతే బాధితురాలి అక్కతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇరువురు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అనంతరం అసలు సైకోరూపం బహిర్గతం అయింది. అతని బుద్ది దారి తప్పింది. మానసికంగా,శారీరకంగా హింసించడం, ప్రశ్నించిన వారిపై అక్రమసంబంధాల పేరుతో దుర్భషలాడడం ఇది తంతుగా తాళి కట్టిన భార్యను వేధింపులకు గురిచేయడంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఘటన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,నన్నూరు గ్రామానికి చెందిన మహిళా కె.యశోదకు జరిగింది. ఈ నేపథ్యంలో బాధితురాలు కె.యశోద, కుటంబ సభ్యులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేసింది. నందికొట్కూరుకు చెందిన ఆవుల సురేష్ అనే వ్యక్తికి ఇరువురు పెద్దల అంగీకారంతో 2019,మార్చి,13న వివాహం చేశారని అన్నారు.అయితే కొంతకాలం సజావుగా సాగిన కుటుంబం,గత ఆరు సంవత్సరాలుగా సురేష్ వేధింపులకు తాళలేక తల్లి వద్ద జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.ఇది సాగించలేక తనను,తన కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా దాడులు చేయడం, గాయపరచడం జరుగుతుంది.  అంతేకాకుండా 2025, మార్చి,15వ తేదీన భర్త సురేష్,వారి కుటంబ సభ్యులు రెండు ఆటోలతో వచ్చి,బలవంతంగా తనను, కుమార్తెను తీసుకెళ్లి దాడి చేయడం జరిగిందని ఆవేదన చెందారు.  ఈ సందర్బంగా తన కుటుంబ సభ్యులు నందికొట్కూరు, ఓర్వకల్,కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన కూడా కనీసం స్పందించకపోవడం బాధాకరం అని కన్నీటిపర్యంతమైంది. చివరకు 112 కాల్ సెంటర్ కు ఫోన్ ద్వారా పిర్యాదుచేయడంతో స్పందించిన అధికారులు ఇద్దరు కానిస్టేబుల్ లు ఘటన స్థలానికి చేరుకొని, రక్షణ కల్పించి, నందికొట్కూరు అర్బన్ స్టేషన్ కు అప్పగించారని పేర్కొన్నారు. అనంతరం కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు వారిని కలిసి నాపై నాకు ఇష్టం లేకున్నా నన్ను నా కూతుర్ని దౌర్జన్యంగా దాడి చేస్తూ బలవంతముగా తీసుకువెళ్లడం జరిగిందని తెలియపరచి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోమని కోరగా ” సప్తపదుల సూత్రాలలో ” భర్త భార్యను బలవంతంగా తీసుకొని వెళ్లి కాపురం చేయించుకోవడం ఒక సూత్రం అని తెలయ చెప్పిన సీఐ చంద్రబాబు నాయుడు, దౌర్జన్యం బలవంతముగా తీసుకువెళ్లిన కేసు నేను కట్టను అని ఇదే నా “లా” ఇదే నా “రూల్” అంటూ నాకు తెలియపరచి పంపివేయడం జరిగింది.  నీ ఇష్టం ఉంటే ఓర్వకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి 498a కేసు కడతారు కట్టించుకో “లేదా” నీ ఇష్టం వచ్చిన వారికి తెలియపరుచుకో అని పంపించడం జరిగిందన్ని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం నాకు ఓర్వకల్లో గాని రూరల్ సిఐ సర్కిల్ ఆఫీసులో గాని న్యాయం జరగదని తెలుసుకొని జిల్లా ఎస్పీ దొరవారికి ఫిర్యాదు చేసు కొంటె ,మహిళ పీఎస్ వారికి సిఫార్సు చేసి న్యాయం చేయమని తెలపరిచారని, అయినా అక్కడ నాకు న్యాయం జరగకపోవడంతో మీడియా మిత్రుల ద్వారా నా ఆవేదన వ్యక్తపరచుకొని ఫై అధికారులకు తెలపరిచి నా భర్త సురేషు మరియు వారి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని రక్షణ కల్పించమని మీడియా ప్రతినిధుల ద్వారా పై అధికారులకు తెలపరుచుకుంటూన్నా అని ఆవేదన వ్యక్తం చేసింది.  అయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీని ఆశ్రయించిన సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భర్త సురేష్ మరియు వారి కుటుంబ సభ్యుల నుండి తనకు, తన కుమార్తెకు ప్రాణహాని ఉందని, కనీసం తమకు రక్షణ కల్పించాలని,లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన చెందారు.

భూ సమస్యలను ….సామరస్యంగా పరిష్కరించుకోవాలి – పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్

V POWER NEWS : సామరస్యంగా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం హలహర్వి మండలం కామినహల్ గ్రామంలో పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంలో ఏమైనా కొలతలు తేడాలు, భూసమస్యలు ఉంటే నేరుగా అధికార సమక్షంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. మండల రెవెన్యూ అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కామినహల్ గ్రామానికి చెందిన రైతు మహిళ ఆర్ లక్ష్మి దేవి మాట్లాడుతూ సర్వేనెంబర్ 277,278 నాలుగు ఎకరాల పొలంలో సాగులో ఉన్నాం ఆన్లైన్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నజ్మభాను, డిప్యూటీ తాహాశీల్దార్ జి.లక్ష్మి, ఆర్ ఐ మహేష్ గౌడ్, సర్వేర్ దేవేంద్ర స్వామి, వీరాంజనేయులు, జనార్ధన, విఆర్ఓలు, విఆర్ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!