V POWER NEWS : కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తు న్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్. ఆదివారం తెలిపారు. కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాలతో కర్నూల్ పట్టణంలో పోలీసులు డ్రోన్ల తో నిఘా పటిష్టం చేశారు.అనంతరం కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ట్రాఫిక్ ను పరిశీలించారు. ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ…నిబంధనలు పాటించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు. ఓవర్ స్పీడ్, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్లను గుర్తిస్తామన్నారు. అలాగే ప్రధాన సర్కిళ్లతోపాటు ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంత్రాలలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, వివిధ కాలనీల్లోని వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రధాన దృష్టి సారిస్తున్నాని, ట్రాఫిక్ జామ్ కాకుండా డ్రోన్ల ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నామని,ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఇరుకు రోడ్లలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్.