ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలి.. జిల్లా కలెక్టర్ సిరి

ప్రజల సమస్యల పరిష్కారంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి …  జిల్లాలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించినా ..కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి .   V POWER NEWS  : కర్నూలు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో   3 రోజుల పాటు  91 శాఖల అధికారులతో    ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా శని వారం మూడవ రోజు  రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్యం, కమర్షియల్ ట్యాక్స్, ఐసిడిఎస్ తదితర  శాఖల అధికారులతో జిల్లా    కలెక్టర్ ఇంటరాక్టివ్  సెషన్ కార్యక్రమం నిర్వహించారు.వివిధ శాఖల జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ శాఖ కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందించాల్సిన సేవలన్నీ సక్రమంగా అందించాలన్నారు.. అలాగే ప్రజల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు..ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను ఓపిగ్గా వినాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని, అలాగే ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రజాభిప్రాయ సేకరణ కూడా సానుకూలంగా ఉండేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో  డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సిపిఓ భారతి, హౌసింగ్ పిడి చిరంజీవి, డిఎంహెచ్వో డా. భాస్కర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు,  ఐసిడిఎస్ పిడి విజయ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ,డిఇఓ శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ ఎం శ్రీనివాసులు, ఇతర శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.. ఈ సమావేశంలో  డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, సిపిఓ భారతి, హౌసింగ్ పిడి చిరంజీవి, డిఎంహెచ్వో డా. భాస్కర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు,  ఐసిడిఎస్ పిడి విజయ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ,డిఇఓ శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ ఎం శ్రీనివాసులు, ఇతర శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు..  

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే … జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు గుడ్ షెఫర్డ్ స్కూల్ విద్యార్థులు

 V POWER NEWS KURNOOL   కర్నూల్ నగరంలోని దేవ నగర్ గుడ్ షెఫర్డ్ స్కూలు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక, నవంబర్ నెలలో 7 తేదీ నుండి 9వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్ లో జరగబోయే జాతీయస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు సురేష్, మధుసూదన్ ఎంపిక అవడం గర్వించదగ్గ విషయమని పాఠశాల కరస్పాండెంట్ మిన్నళ్ల తెలిపారు సెప్టెంబర్ 24 ,25వ తేదీలలో కర్నూల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికవ్వడం జరిగింది. మా పాఠశాల యందు చదువుతోపాటు క్రీడలలో కూడా విద్యార్థినీ విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దు తున్నామని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోట 4% పర్సెంట్ ఉన్నందున రాష్ట్రస్థాయికర్నూల్ నగరంలోని దేవ నగర్ గుడ్ షెఫర్డ్ స్కూలు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక, నవంబర్ నెలలో 7 తేదీ నుండి 9వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్ లో జరగబోయే జాతీయస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు సురేష్, మధుసూదన్ ఎంపిక అవడం గర్వించదగ్గ విషయమని పాఠశాల కరస్పాండెంట్ మిన్నళ్ల తెలిపారు సెప్టెంబర్ 24 ,25వ తేదీలలో కర్నూల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికవ్వడం జరిగింది. మా పాఠశాల యందు చదువుతోపాటు క్రీడలలో కూడా విద్యార్థినీ విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దు తున్నామని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోట 4% పర్సెంట్ ఉన్నందున రాష్ట్రస్థాయి ,జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మెహరున్నీస,వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మెహరున్నీసా, వ్యాయామ ఉపాధ్యాయుడు మధుసూదన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మౌలిక సదుపాయాల కోసం .. ఎంపీ బస్తిపాటి నాగరాజు తో సమావేశమైన బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన

V POWER NEWS  : కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన సమావేశమయ్యారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని ఎంపీ నివాసంలో ఆయన తో సమావేశమైన ఆమె, జిల్లాలోని పలు బీసీ సంక్షేమ హాస్టల్స్ భవనాల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కోసం ఎంపీ నిధుల నుంచి నిధులు కేటాయించాలని కోరింది. ఈ సందర్భంగా ఎంపీ భవనాల మరమ్మత్తులకు తన ఎంపీ నిధులను కేటాయిస్తానని తెలిపారు…అనంతరం ఎంపీ మాట్లాడుతూ బీసీ సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయించి పలు హాస్టల్స్ లో భవనాల మరమ్మత్తులు, నూతన టాయిలెట్స్, షెడ్ల ను నిర్మించడం జరిగిందన్నారు… జిల్లాలో ని అన్ని బీసీ వసతి గృహలను అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి – డా. కె.వేణుగోపాల్, సీఈఓ సెట్కూరు  

V POWER NEWS:  ఉమ్మడి జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు ఆధ్వర్యంలో  ప్రభుత్వ జూనియర్ కళాశాల, బి.క్యాంపు, కర్నూలు  నందు మత్తుపదార్థాలు  వ్యసనం – పర్యవసానాలు, సైబర్ క్రైమ్ అనే అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో సెట్కూరు సీఈఓ డా.కె.వేణుగోపాల్  మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల పై యువత, విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన జీవితం కోల్పోవాల్సి వస్తుందన్నారు,  మన సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో మాదక ద్రవ్యాల వాడకం ఒకటని, పెరుగుతున్న ఆధునిక జీవన శైలి, ఒత్తిడితో చాలా మంది యువత డ్రగ్స్ వాడకానికి బానిసలవుతున్నారని తెలియ చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత మరియు సమాజం మీద పడుతున్న దుష్పలితాలను వివరించారు.  యువత  డ్రగ్స్ అమ్ముతున్న విషయం తమ దృష్టికి వస్తే వెంటనే సమాచారాన్ని పోలీసులకు  టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని,  డ్రగ్స్, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి,  ఆరోగ్యవంతమైన సమాజాన్ని, మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. అదేవిధంగా  ప్రిన్సిపాల్ శ్రీమతి పి సరళా దేవి  మాట్లాడుతూ, యువత చదువుకునే వయసులో చదువు ఫై మాత్రమే మనసు లగ్నం చేయాలనీ,  విరామ సమయంలో  క్రీడలలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని,  ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, మిత్రుల తో సమయం గడపాలని, చడు స్నేహాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు పర్యవేక్షకులు శ్యాంబాబు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రజలలో ” కాటికి పోయిన – కోర్టుకు పోయిన”  అనే నానుడి పదo పై మంచి అవగాహన  కొరకు కృషి చేస్తాం .. సేపూరి విజయ్ మోహన్. 

 V POWER NEWS: కర్నూలు జిల్లాలో సేపూరి లీగల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ ద్వారా  ప్రజలలో ” కాటికి పోయిన – కోర్టుకు పోయిన”  అనే నానుడి పదo పై మరియు చట్టాలపై  వారి ప్రాథమిక హక్కులను కర్నూలు జిల్లాలోని ప్రజలందరికీ  అవగాహన  కల్పించాలని మరియు ఉచిత సలహాలు, ఎటువంటి పారితోషకం తీసుకోకుండా సేవలను అందించాలని మా ముఖ్య ఉద్దేశమన్న సేపూరి విజయ్ మోహన్. అనంతరం సఫారీ గోవిందరాజు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి గో సేవకుడు సేపూరి లీగల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ అధ్యక్షుడు ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సేపూరి విజయ్ మోహన్ మాట్లాడుతూ నేను జూనియర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు సేపూరి లీగల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ ద్వారా చేస్తున్నామని సేపూరి విజయమోహన్ తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ప్రజలకు న్యాయస్థానంపై మంచి ఉద్దేశం కల్పించాలని,” కాటికి పోయిన –  కోర్టుకు పోయిన ” అనే నానుడి పదాన్ని వారి మనసులో నుంచి తొలగించే విధంగా సేపూరి లీగల్ సర్వీస్ అండ్ అసోసియేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నామన్నారు.   

యువజన ఉత్సవాలలో యువత ఉత్సాహంగా పాల్గొనండి .. జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. సిరి

V POWER NEWS: కర్నూలు జిల్లా యువజన సంక్షెమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎ. సిరి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ యువజన ఉత్సవాలలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.15-29 లలోపు యువ కళాకారులకు 22.10.2025 వ తేదీన కర్నూలు లోని రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల, లో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఏడు విభాగలలో జరుతాయాని, జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్రస్థాయి మొదటి స్థానంలో నిలిచిన విజేతలు జాతీయ స్థాయికి పంపబడుతారని తెలిపారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు మరియు పాల్గొన్న కళాకారులకు పార్టిసిపేషన్ సెర్టిఫికేట్లు అందజేయబడుతాయాన్నారు.సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ పోటీలలో పాల్గొనదలచిన యువతీ యువకులు, కళాకారులు తమ పేరు లేక బృందం పేరును వెబ్ లింక్ https://bit.ly/knldyf25 ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి వీలుకాని వారు నేరుగా 22.10.2025 నాడు ఉదయం 09.00 గంటల లోపు వచ్చి నమోదు చేసుకొనవచ్చునని తెలిపారు. ఇతర వివరములకు మొబైల్ నెంబర్ 92922 07601 కు ఫోన్ చేసి సంప్రదించగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంటర్ మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి లాలెప్ప, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి శివ రాముడు, సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యామ్ బాబు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా CMRF పంపిణీ…ఎంపీ బస్తిపాటి నాగరాజు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తూంది.. V POWER NEWS : కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామానికి చెందిన దుంపల నాగేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అందిన ఆర్ధిక సహాయాన్ని ఎంపీ తన కార్యాలయంలో అందజేశారు. దుంపల నాగేష్ ఆరోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.. అనంతరం వైద్య ఖర్చుల సహాయం కోసం ఎంపీ నాగరాజు ని సంప్రదించి సీఎం రీలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకోగా రూ.59,879మంజూరు అయ్యాయి.సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందేందుకు సహకారం అందించిన ఎంపీ కి లబ్దిదారుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధిని అందిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాన మంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయండి .. మంత్రి టీజీ భరత్

V POWER NEWS, KURNOOL : కర్నూలు జిల్లాలో ఈ నెల 16 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి  వద్ద పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ప్రధాన మంత్రి పర్యటనను ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు.హెలిప్యాడ్,సభాప్రాంగణం, ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు,ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు..  

బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి…100 మంది పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతికి చెందిన ఎంపీ బస్తీపాటి నాగరాజు

V POWER NEWS: కర్నూలు జిల్లా…హొళగుంద మండలం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు చనిపోవడంతో పాటు వంద మందికి పైగా గాయపడటం పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఈ ఘటన పై అధికారులతో మాట్లాడి , గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.అనంతరం మాలమల్లేశ్వర స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్న మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరుపున ఆధుకుంటామన్న కర్నూలు పార్లమెంటు సభ్యుడు నాగరాజు పేర్కొన్నారు.

రేషన్ షాపు డీలర్,సచివాలయ ఉద్యోగుల ద్వారా.. స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చు … జాయింట్ కలెక్టర్

నగరంలోని బుధవారపేట లో ఎఫ్.పి.షాపులను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య V POWER NEWS  : కర్నూలు జిల్లాలో అక్టోబర్ నెల 15 వ తేదీ వరకు రేషన్ షాప్ డీలర్ల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చని,16 వ తేదీ తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేయబడతాయని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య తెలిపారు. బుధవారం నాడు నగరంలోని బుధవారపేట లో 1382073, 1382075 ఎఫ్.పి.షాపులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి రేషన్ పంపిణీ ని పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్.పి షాపుల ద్వారా వినియోగదారులకు రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయాలని, ఎవరైనా డీలర్లు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.

error: Content is protected !!