V POWER NEWS, SRISAILAM : శ్రీశైలo దేవస్థానం ప్రభుత్వ ఆసుపత్రి వర్కింగ్ సమయంలో హాస్పిటల్ ని తెరిచి ఉంచి, డాక్టరు మరియు ఇతర సిబ్బంది హాస్పిటల్ లో లేకపోవడం, ఎమర్జెన్సీలో వచ్చినటువంటి రోగులని పట్టించుకోకపోవడం లేదనీ, శ్రీశైల దేవస్థానం స్వామివారి దర్శనార్థం యావత్ భారతదేశం నుండి అనేక విధాలైనటువంటి ఏజ్ లిమిట్ లేనటువంటి వారు భక్తులు వస్తుంటారు. వేసవికాలం సమయంలో, ప్రయాణంలో ఇబ్బందులకు చేస్తున్నారన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉండే వారు, వేసవికాలంలో కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ హాస్పిటల్ చేరుకున్న వారికి, ఈరోజు సాయంత్రం 2:00 గంటల నుండి 4:00 గంటల వరకు డాక్టరు మరియు ఇతర సిబ్బంది లేకపోవడం, భక్తులకు మరియు స్థానికులకు రెండు గంటలసేపు వెయిటింగ్ చేసి, వెళ్లడం జరుగుతుంది. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పై, మరియు సిబ్బందిపై, చర్యలు తీసుకోవలసినదిగా, పాత్రికేయుల సమక్షంలో పై పెద్దలకు వినతి కోరుతున్నామన్నారు. వేసవికాలంలో ఈ రకంగా ఆసుపత్రిని తెరిచి ఉంచి రోగులను వేటింగ్ చేయించడం సరికాదని, డాక్టరు లేని సమయంలో మిగతా సిబ్బంది కూడా అక్కడ లేకపోవడం రోగులకు ఇబ్బందికరంగా ఉందన, ఎవరూ లేని సమయంలో ఆసుపత్రిని తెరిచి ఉంచడం మంచిది కాదని, ఆసుపత్రి తెరిచి ఉంచినప్పుడు సంబంధిత సిబ్బంది ఉండవలసి ఉంటుందని తెలియపరుస్తూ ఇక్కడ డాక్టర్ లేడు ఆస్పత్రికి సంబంధించిన సిబ్బంది లేదు, కావున తక్షణం వీరిపై పై అధికారులు చర్యలు తీసుకోవలసినదిగా మీడియా ముఖంగా తెలియపరుస్తూ. ఈ విషయంపై హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఫిర్యాదు చేయవలసి ఉంటుందని అంతిరెడ్డి అరవింద రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు.