ఆంధ్రప్రదేశ్ లో… ఘనంగా ” శ్రీ సేవాలాల్ మహారాజ్ ” జయంతిని  అధికారికంగా  జరిపించాలి …

LHPS రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్    V POWER NEWS  :  లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం విలేకరుల సమావేశంలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్  మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా 15 కోట్ల జనాభా కలిగిన లంబాడి బంజారా తెగలకు సంబంధించిన వారు దేశవ్యాప్తంగా ఒకే సంస్కృతి ఒకె సాంప్రదాయాలు పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకే భాషని మాట్లాడుతూ జీవిస్తున్న బంజారా జాతి కులదైవం ఆరాధ్యుడు జాతి ప్రజలు అందరూ మంచి మార్గంలో నడవాలని భారతదేశమంతా కూడా నడిచి తన సందేశాన్ని బంజారా జాతి తో పాటు ఇతర జాతుల వారిని కూడా చైతన్యపరిచినటువంటి మార్గదర్శకుడు శాంతి స్వరూపుడు అహింస వాది నేటికీ ప్రతి రాష్ట్రంలో ఫిబ్రవరి 14,15 తేదీలలో శ్రీ సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు అధికారికంగా జరుపుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా జరపకపోవడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల పైబడి జనాభా గలిగిన లంబాడీల మనోభావాలు దెబ్బతీయడమే నని అన్నారు ఈ సందర్భంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న, త్రిపురనేని రామస్వామి చౌదరి,  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి , పుట్టపర్తి నారాయణచార్యుల,  బాబు జగజీవన్ రామ్,  మహాత్మ జ్యోతిరావు పూలే , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,  అల్లూరి సీతారామరాజు,  మహర్షి వాల్మీకి జయంతి ఇలా ప్రముఖుల జయంతుల్ని వర్ధంతులను ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ యువజన సర్వీసులు దేవాదాయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో 12 లక్షల పైబడిన జనాభా కలిగి 40 నియోజకవర్గాలలో ఓటు శాతం ఉన్న గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ని కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ  కార్య్రమంలో  ఎస్ నాగరాజు నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవావత్ శంకర్ నాయక్ మరియు తదితరులు ఉన్నారు.

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. V POWER  NEWS  : ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు సంయుక్తంగా ఆదేశాలు జారీ చేశారు.వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా,ఓవర్ స్పీడ్,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా,డ్రంకెన్ డ్రైవ్ వంటి తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.(మార్చి 30 నుండి ఏప్రిల్ 4 వరకు)గత వారంలో కర్నూలు జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల కేసులు 12 నమోదు కాగా,5 మంది మృతి చెందారని,12 మంది గాయపడినట్లు తెలిపారు.మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 136 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి,కోర్టుకి హజరు పరిచామన్నారు.

ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ నియామకం.

 V POWER NEWS  : రాష్ట్రంలో అవినీతి నిరోధక మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సంస్థకు ఆదోని నియోజకవర్గానికి చెందిన హెచ్ కె శ్రీకాంత్ (రావు)ని కర్నూలు జిల్లా సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీగా నియమిస్తూ ఫౌండర్ దేవానంద నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్ రావు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచిన ఫౌండర్ దేవానందనాయుడు కి అలాగే బోర్డ్ ఆఫ్ మెంబర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమస్త నిబంధనలు పాటిస్తూ నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడంలో నా సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు.

ప్రైవేటు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం ఇవ్వాలి — రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీPDSU

V POWER NEWS: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలలో పని చేస్తున్న అధ్యాపకులకు 12 నెలల వేతనం చెల్లించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ తెలిపారు.ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులతో వెట్టిచాకిరి చేస్తించుకుంటున్నారని అన్నారు.శ్రమకు తగ్గ వేతనం లేక ప్రైవేటు ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారని అన్నారు.యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తూ ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలల వేతనం ఇచ్చి సరిపెడులుతున్నారని.పాఠశాలలు,కళాశాలల విద్యార్థులకు ర్యాంకులు రావాలన్న,స్కూల్స్,కాలేజీలలో అడ్మిషన్ లు పెరగాలన్న కీలక భూమిక అందులో పని చేస్తున్న సిబ్బందిదే అన్నారు.కనీస సౌకర్యాలకు నోచుకోని జీవితాలు ప్రైవేటు విద్యాసంస్థల పనిచేస్తున్న ఉపాధ్యాయులు ది అన్నారు. కనీసం పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అంటివి ఏవి లేకుండా ఉద్యోగ భద్రత కూడా లేకుండా సంవత్సరాల తరబడి పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్న వాళ్లకు గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వాలు సైతం ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన వారిని ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వమైన ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల ఆలకించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

జిల్లా ఎస్పీని ఆశ్రయించినా … నా సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు… బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన

సప్తపదుల సూత్రాలలో … భర్త బలవంతముగా దౌర్జన్యంగా తీసుకొనివెళ్లి సంసారం చేయించుకోవడం ఒక సూత్రం అన్న సీఐ చంద్రబాబునాయుడు. నాకూ జరిగినా అన్యాయం  ఇంకోవరికి జరుగకుండా  చూడాలని  జిల్లా sp  ని కోరినా బాధితురాలు  భర్త,కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి, న్యాయం చేయండి మహాప్రభో. .. బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన.  V POWER NEWS  : news ప్రేమించానన్నాడు.అంగీకరించకపోతే బాధితురాలి అక్కతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇరువురు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అనంతరం అసలు సైకోరూపం బహిర్గతం అయింది. అతని బుద్ది దారి తప్పింది. మానసికంగా,శారీరకంగా హింసించడం, ప్రశ్నించిన వారిపై అక్రమసంబంధాల పేరుతో దుర్భషలాడడం ఇది తంతుగా తాళి కట్టిన భార్యను వేధింపులకు గురిచేయడంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఘటన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,నన్నూరు గ్రామానికి చెందిన మహిళా కె.యశోదకు జరిగింది. ఈ నేపథ్యంలో బాధితురాలు కె.యశోద, కుటంబ సభ్యులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేసింది. నందికొట్కూరుకు చెందిన ఆవుల సురేష్ అనే వ్యక్తికి ఇరువురు పెద్దల అంగీకారంతో 2019,మార్చి,13న వివాహం చేశారని అన్నారు.అయితే కొంతకాలం సజావుగా సాగిన కుటుంబం,గత ఆరు సంవత్సరాలుగా సురేష్ వేధింపులకు తాళలేక తల్లి వద్ద జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.ఇది సాగించలేక తనను,తన కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా దాడులు చేయడం, గాయపరచడం జరుగుతుంది.  అంతేకాకుండా 2025, మార్చి,15వ తేదీన భర్త సురేష్,వారి కుటంబ సభ్యులు రెండు ఆటోలతో వచ్చి,బలవంతంగా తనను, కుమార్తెను తీసుకెళ్లి దాడి చేయడం జరిగిందని ఆవేదన చెందారు.  ఈ సందర్బంగా తన కుటుంబ సభ్యులు నందికొట్కూరు, ఓర్వకల్,కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన కూడా కనీసం స్పందించకపోవడం బాధాకరం అని కన్నీటిపర్యంతమైంది. చివరకు 112 కాల్ సెంటర్ కు ఫోన్ ద్వారా పిర్యాదుచేయడంతో స్పందించిన అధికారులు ఇద్దరు కానిస్టేబుల్ లు ఘటన స్థలానికి చేరుకొని, రక్షణ కల్పించి, నందికొట్కూరు అర్బన్ స్టేషన్ కు అప్పగించారని పేర్కొన్నారు. అనంతరం కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు వారిని కలిసి నాపై నాకు ఇష్టం లేకున్నా నన్ను నా కూతుర్ని దౌర్జన్యంగా దాడి చేస్తూ బలవంతముగా తీసుకువెళ్లడం జరిగిందని తెలియపరచి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోమని కోరగా ” సప్తపదుల సూత్రాలలో ” భర్త భార్యను బలవంతంగా తీసుకొని వెళ్లి కాపురం చేయించుకోవడం ఒక సూత్రం అని తెలయ చెప్పిన సీఐ చంద్రబాబు నాయుడు, దౌర్జన్యం బలవంతముగా తీసుకువెళ్లిన కేసు నేను కట్టను అని ఇదే నా “లా” ఇదే నా “రూల్” అంటూ నాకు తెలియపరచి పంపివేయడం జరిగింది.  నీ ఇష్టం ఉంటే ఓర్వకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి 498a కేసు కడతారు కట్టించుకో “లేదా” నీ ఇష్టం వచ్చిన వారికి తెలియపరుచుకో అని పంపించడం జరిగిందన్ని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం నాకు ఓర్వకల్లో గాని రూరల్ సిఐ సర్కిల్ ఆఫీసులో గాని న్యాయం జరగదని తెలుసుకొని జిల్లా ఎస్పీ దొరవారికి ఫిర్యాదు చేసు కొంటె ,మహిళ పీఎస్ వారికి సిఫార్సు చేసి న్యాయం చేయమని తెలపరిచారని, అయినా అక్కడ నాకు న్యాయం జరగకపోవడంతో మీడియా మిత్రుల ద్వారా నా ఆవేదన వ్యక్తపరచుకొని ఫై అధికారులకు తెలపరిచి నా భర్త సురేషు మరియు వారి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని రక్షణ కల్పించమని మీడియా ప్రతినిధుల ద్వారా పై అధికారులకు తెలపరుచుకుంటూన్నా అని ఆవేదన వ్యక్తం చేసింది.  అయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీని ఆశ్రయించిన సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భర్త సురేష్ మరియు వారి కుటుంబ సభ్యుల నుండి తనకు, తన కుమార్తెకు ప్రాణహాని ఉందని, కనీసం తమకు రక్షణ కల్పించాలని,లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన చెందారు.

భూ సమస్యలను ….సామరస్యంగా పరిష్కరించుకోవాలి – పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్

V POWER NEWS : సామరస్యంగా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం హలహర్వి మండలం కామినహల్ గ్రామంలో పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంలో ఏమైనా కొలతలు తేడాలు, భూసమస్యలు ఉంటే నేరుగా అధికార సమక్షంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. మండల రెవెన్యూ అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కామినహల్ గ్రామానికి చెందిన రైతు మహిళ ఆర్ లక్ష్మి దేవి మాట్లాడుతూ సర్వేనెంబర్ 277,278 నాలుగు ఎకరాల పొలంలో సాగులో ఉన్నాం ఆన్లైన్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నజ్మభాను, డిప్యూటీ తాహాశీల్దార్ జి.లక్ష్మి, ఆర్ ఐ మహేష్ గౌడ్, సర్వేర్ దేవేంద్ర స్వామి, వీరాంజనేయులు, జనార్ధన, విఆర్ఓలు, విఆర్ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు బాసటగా సిఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్న .. శ్రీశైలం ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డి

 V POWER NEWS  : శ్రీశైలం నియోజకవర్గంలోని వేల్పనూరు స్వగ్రామం నందు మంగళవారం నియోజకవర్గానికి చెందిన 58 మంది వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కులు, అలాగే CM AJY పథకం క్రింద ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 3లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నారన్నారు. ఈసందర్భంగా చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

UJF ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా విస్తృత సమావేశం… ముఖ్య అతిథులుగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ వై.జయరాజు. స్వేచ్ఛలో భారత్ అధమస్థానం … రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీడియాదే. …మతతత్వ శక్తుల కుతంత్రాలను ఎండగట్టాలి —

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం  ఎలక్ట్రానిక్ విభాగం నూతన జిల్లా కమిటీ . అధ్యక్షులు : విజయ్ కుమార్, కార్యదర్శి : మెట్రో మధు, ఉపాధ్యక్షులు : జి.వి.ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు : రవిశంకర్ గౌడ్. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రింట్ విభాగం నూతన జిల్లా కమిటీ . జిల్లా గౌరవ అధ్యక్షులు : యూసఫ్ ఖాన్, అధ్యక్షులు : విద్యాసాగర్, కార్యదర్శి : చంద్రమోహన్, కోశాధికారి : సంధ్య ప్రసాద్, ఉపాధ్యక్షులు : పరమేష్, సహాయ కార్యదర్షులు :ఎం.సీ.వెంకటేష్,లక్ష్మణ్, ఈసీ మెంబర్స్ : వరప్రసాద్,వడ్డేమాన్ విజయ్ కుమార్,వారణాసి ప్రసాద్. V POWER NEWS  : మీడియా స్వేచ్ఛను కాపాడడంలో భారతదేశం ప్రపంచంలో అధమస్థానంలో ఉందని ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు అన్నారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని, ఎంపీపీ సమావేశ మందిరంలో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం (యుజెఎఫ్) జిల్లావిస్తృత సమావేశం అత్యంత ఉత్సాహ వాతావరణంలో సాగింది. ఈ సందర్బంగా జర్నలిస్టులు కిసాన్ ఘాట్ నుంచి రాజవిహార్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎంపీపీ హాలులో జర్నలిస్ట్ లకు రక్తం గ్రూప్ పరీక్షలు,హెచ్ పరీక్షలు జరిపారు. తదనంతరం జిల్లా విస్తృత సమావేశం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కార్యదర్శి జి.మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు, జెవివి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బీ.డీ.సుధీర్ రాజు,డాక్టర్ బడేసాహెబ్, సీనియర్ జర్నలిస్టు చంద్రయ్య,అడ్వకేట్ లక్ష్మీనారాయణ యాదవ్,యుజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్ష,కార్యదర్శులు సత్యనారాయణ, చిన్న రామాంజ నేయులు హాజరై మాట్లాడారు. దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిదిగా మీడియా పనిచేస్తుందన్నారు. అలాంటి మీడియాను ముందుకు నడిపించే ఇంధనంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు. రోజురోజుకు మీడియా శక్తి విస్తరిస్తోందన్నారు. కాగా మీడియా పట్ల జరుగుతున్న దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. ప్రపంచంలో మీడియా స్వేచ్ఛ అత్యంత అదమస్థానంలో ఉన్న దేశంగా భారత్ నమోదయిందన్నారు. అందులో భారత్ 161వ స్థానంలో నిలిచిందని అన్నారు. దేశంలో కార్పొరేట్ ల చేతుల్లో మీడియాకు ఉందన్నారు.దేశంలో సాగుతున్న మూడ విశ్వాసాలను ప్రశ్నించే మీడియా సంస్థలపై,మతతత్వ శక్తులు దాడులకు తెగబడుతున్నాయి అన్నారు.రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ సమాజం లౌకిక భావనలను కాపాడాల్సిన పాలకులు వాటిని నిర్వీర్యం చేసే దిశగా కృషి చేస్తున్నాయని చెప్పారు. తెరచాటున మతతత్వయజండాను అమలు చేసే కుట్రలను బయటికి జర్నలిస్టులు తీయాలని,దాని ప్రమాదానాలను ఎండగట్టాలన్నారు. సమాజ సంపదపై అందరికీ సమానహక్కు ఉన్నప్పటికీ అది కేవలం 10శాతం మందికే దక్కిందని,90శాతం మందికి దూరమైందన్నారు.90శాతం మంది ప్రజల కళ్ళు,చెవులుగా మీడియా నిలవాలన్నారు.ప్రతి వార్తా ప్రజల కోసం సామాజిక బాధ్యతో ఉండాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తులు జర్నలిస్టులు అన్నారు. అలాంటి ఆశయాలతో ముందుకు వచ్చిన యునైటెడ్ జర్నలిస్టు ఫోరం కృషి అభినందనీయం అని వారు తెలిపారు. అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు విజయ్ కుమార్,నాయకులు ఆసిఫ్, కిషోర్,గంగాధర్,నగర అధ్యక్షులు నాగేంద్రుడు,కోశాధికారి రాజశేఖర్, కల్లూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు లోకేష్, మధుసూదన్,యూజెఎఫ్ నాయకులు కరణ్, వజ్రరాజు, రాజశేఖర్, ఓర్వకల్లు మండల కమిటీ నాయకులు చిన్న స్వాములు, మద్దిలేటి, జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల జర్నలిస్ట్ లు,శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ సొమ్ము ఇంటి పన్నుకుజమ.

వైద్యం కోసండబ్బులు లేక వితంతువు మృతి. .. బతిమలాడిన కనికరించని అధికారి.– గ్రామ పెద్దలు చెప్పిన వినని వైనం. — వైద్యం కోసం డబ్బులు లేకుంటే వడ్డీకి తీసుకోమని చెప్పిన అధికారి. — కన్నీరు కార్చిన కుమారుడు. –మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో మృతి చెందిన వితంతు మహిళ. — తన కన్నతల్లి మృతి పై అధికారుల నిర్లక్ష్యాన్ని చెబుతున్న కొడుకు. V POWER  NEWS  : రుద్రవరం మండలంలో..కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుతున్న నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, వంటరి మహిళలకు , కుల వృత్తుల వారికి మీ కష్టానికి తోడుగా మేమున్నామంటూ ప్రభుత్వాలు కొంత డబ్బులు పింఛన్ రూపంలో అందిస్తుంది. ప్రభుత్వం అందించే ఈ సహాయంతో వారి జీవనానికి, వారి ఆరోగ్య స్థితి గతులకు , వ్యక్తిగత అవసరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశతో వారి అవసరాలను తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా కొందరు అధికారులు ఇంటి పన్ను ,నీటి పన్నులు కట్టాలంటూ మీ అవసరాలతో మాకేంటి మీ బాధలతో మాకేంటి అంటూ ముక్కు పిండి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల సొమ్మును వసూలు చేయడంతో తమకు కనీస అవసరమైన మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో ఓ వితంతు మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న లక్ష్మీదేవి 45 సంవత్సరాలు ప్రభుత్వం అందించే వితంతు పింఛన్ తీసుకుంటూ తన ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ జీవనం సాగిస్తుంది. స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారి మార్చి మాసానికి చెందిన వితంతు పింఛన్ 4 వేల రూపాయలను లక్ష్మీదేవికి ఇవ్వలేదు. తన వితంతు పింఛను నాకు ఎందుకు ఇవ్వలేదని తన కొడుకుతో సహా వచ్చి అధికారిని అడగగా మీరు ఇంటి పన్ను కట్టలేదంటూ అందుకు బదులుగా మీ పింఛను సొమ్మును జమ చేస్తున్నామని జవాబు ఇవ్వడంతో కృంగిపోయిన ఆ మహిళ అయ్యా నాకు గత కొంతకాలంగా నేను షుగరు ఆయాసంతో నానా ఇబ్బందులు పడుతూ మందులను కొనుక్కొని వాటిని మింగుతూ బ్రతుకుతున్నాను నా మీద కనికరం ఉంచి నా పింఛను డబ్బులు ఇవ్వమని ప్రాధేయపడిన కనికరించని ఆయన మీకు మందులకు డబ్బులు లేకపోతే నేను ఏమి చేయాలి మీరు ఇంటి పన్ను కట్టలేదు కాబట్టి నేను జమ చేసుకున్నాను. మీకు మందులకు లేకపోతే డబ్బులను వడ్డీకి తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచక గత 15 రోజులుగా నంద్యాలకు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటూ ఉంది. తన పింఛను ఇప్పించమని లక్ష్మీదేవి గ్రామ పెద్దలతో చెప్పింది. గ్రామ పెద్దలు స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారికి పలుమార్లు చెప్పిన ఆయన వినలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి శనివారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. తన పింఛను డబ్బులు పన్నుల పేరిట జమ చేసుకోవడంతోనే సరైన సమయానికి మందులకు డబ్బులు లేకనే లక్ష్మి దేవి మృతి చెందిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బుతో మందులను కొని వాటిని మింగుతూ బ్రతుకుతుందని తన కొడుకు రామ మోహన్ తెలిపారు. మా అమ్మకు వచ్చే పింఛను డబ్బును ఎగ్జిక్యూటివ్ అధికారి సుబ్బారావు పన్ను కట్టాలంటూ ప్రభుత్వం ఇచ్చే 4000 రూపాయలను మాకు ఇవ్వకుండా జమ చేసుకున్నానని చెప్పాడు. మా అమ్మకు బాగాలేదు డబ్బు లేకపోతే మందులను నేను కొనలేను మందులు కొనకపోతే మా అమ్మ చనిపోతుంది సార్ అని గత 15 రోజులుగా బ్రతిమాలుతూనే ఉన్నాను. మీ బాధలతో మాకేంటి పని మీకు డబ్బు లేకపోతే వడ్డీకి తీసుకొని మందులను కొనుక్కొని మీ అమ్మను బ్రతికించుకుపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్నారు. ఇవాళ కేవలం మా అమ్మకు మందులు కొనలేక మా అమ్మ మృతి చెందిందని ఒక్కగా నొక్క కొడుకు కన్నీరు కార్చాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు కన్నీరు కార్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్మును పన్నుల పేరట వసూలు చేస్తూ ప్రజల చావులకు కారణమవుతున్న ఇలాంటి అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

error: Content is protected !!