పేదలకు బాసటగా సిఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్న .. శ్రీశైలం ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డి

 V POWER NEWS  : శ్రీశైలం నియోజకవర్గంలోని వేల్పనూరు స్వగ్రామం నందు మంగళవారం నియోజకవర్గానికి చెందిన 58 మంది వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కులు, అలాగే CM AJY పథకం క్రింద ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 3లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నారన్నారు. ఈసందర్భంగా చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

UJF ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా విస్తృత సమావేశం… ముఖ్య అతిథులుగా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ వై.జయరాజు. స్వేచ్ఛలో భారత్ అధమస్థానం … రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీడియాదే. …మతతత్వ శక్తుల కుతంత్రాలను ఎండగట్టాలి —

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం  ఎలక్ట్రానిక్ విభాగం నూతన జిల్లా కమిటీ . అధ్యక్షులు : విజయ్ కుమార్, కార్యదర్శి : మెట్రో మధు, ఉపాధ్యక్షులు : జి.వి.ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు : రవిశంకర్ గౌడ్. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రింట్ విభాగం నూతన జిల్లా కమిటీ . జిల్లా గౌరవ అధ్యక్షులు : యూసఫ్ ఖాన్, అధ్యక్షులు : విద్యాసాగర్, కార్యదర్శి : చంద్రమోహన్, కోశాధికారి : సంధ్య ప్రసాద్, ఉపాధ్యక్షులు : పరమేష్, సహాయ కార్యదర్షులు :ఎం.సీ.వెంకటేష్,లక్ష్మణ్, ఈసీ మెంబర్స్ : వరప్రసాద్,వడ్డేమాన్ విజయ్ కుమార్,వారణాసి ప్రసాద్. V POWER NEWS  : మీడియా స్వేచ్ఛను కాపాడడంలో భారతదేశం ప్రపంచంలో అధమస్థానంలో ఉందని ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు అన్నారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు ప్రాంగణంలోని, ఎంపీపీ సమావేశ మందిరంలో యునైటెడ్ జర్నలిస్టు ఫోరం (యుజెఎఫ్) జిల్లావిస్తృత సమావేశం అత్యంత ఉత్సాహ వాతావరణంలో సాగింది. ఈ సందర్బంగా జర్నలిస్టులు కిసాన్ ఘాట్ నుంచి రాజవిహార్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎంపీపీ హాలులో జర్నలిస్ట్ లకు రక్తం గ్రూప్ పరీక్షలు,హెచ్ పరీక్షలు జరిపారు. తదనంతరం జిల్లా విస్తృత సమావేశం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కార్యదర్శి జి.మునిస్వామి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ వై.జయరాజు, జెవివి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బీ.డీ.సుధీర్ రాజు,డాక్టర్ బడేసాహెబ్, సీనియర్ జర్నలిస్టు చంద్రయ్య,అడ్వకేట్ లక్ష్మీనారాయణ యాదవ్,యుజెఎఫ్ వ్యవస్థాపక అధ్యక్ష,కార్యదర్శులు సత్యనారాయణ, చిన్న రామాంజ నేయులు హాజరై మాట్లాడారు. దేశంలో ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారిదిగా మీడియా పనిచేస్తుందన్నారు. అలాంటి మీడియాను ముందుకు నడిపించే ఇంధనంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు. రోజురోజుకు మీడియా శక్తి విస్తరిస్తోందన్నారు. కాగా మీడియా పట్ల జరుగుతున్న దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. ప్రపంచంలో మీడియా స్వేచ్ఛ అత్యంత అదమస్థానంలో ఉన్న దేశంగా భారత్ నమోదయిందన్నారు. అందులో భారత్ 161వ స్థానంలో నిలిచిందని అన్నారు. దేశంలో కార్పొరేట్ ల చేతుల్లో మీడియాకు ఉందన్నారు.దేశంలో సాగుతున్న మూడ విశ్వాసాలను ప్రశ్నించే మీడియా సంస్థలపై,మతతత్వ శక్తులు దాడులకు తెగబడుతున్నాయి అన్నారు.రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ సమాజం లౌకిక భావనలను కాపాడాల్సిన పాలకులు వాటిని నిర్వీర్యం చేసే దిశగా కృషి చేస్తున్నాయని చెప్పారు. తెరచాటున మతతత్వయజండాను అమలు చేసే కుట్రలను బయటికి జర్నలిస్టులు తీయాలని,దాని ప్రమాదానాలను ఎండగట్టాలన్నారు. సమాజ సంపదపై అందరికీ సమానహక్కు ఉన్నప్పటికీ అది కేవలం 10శాతం మందికే దక్కిందని,90శాతం మందికి దూరమైందన్నారు.90శాతం మంది ప్రజల కళ్ళు,చెవులుగా మీడియా నిలవాలన్నారు.ప్రతి వార్తా ప్రజల కోసం సామాజిక బాధ్యతో ఉండాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తులు జర్నలిస్టులు అన్నారు. అలాంటి ఆశయాలతో ముందుకు వచ్చిన యునైటెడ్ జర్నలిస్టు ఫోరం కృషి అభినందనీయం అని వారు తెలిపారు. అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు విజయ్ కుమార్,నాయకులు ఆసిఫ్, కిషోర్,గంగాధర్,నగర అధ్యక్షులు నాగేంద్రుడు,కోశాధికారి రాజశేఖర్, కల్లూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు లోకేష్, మధుసూదన్,యూజెఎఫ్ నాయకులు కరణ్, వజ్రరాజు, రాజశేఖర్, ఓర్వకల్లు మండల కమిటీ నాయకులు చిన్న స్వాములు, మద్దిలేటి, జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల జర్నలిస్ట్ లు,శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ సొమ్ము ఇంటి పన్నుకుజమ.

వైద్యం కోసండబ్బులు లేక వితంతువు మృతి. .. బతిమలాడిన కనికరించని అధికారి.– గ్రామ పెద్దలు చెప్పిన వినని వైనం. — వైద్యం కోసం డబ్బులు లేకుంటే వడ్డీకి తీసుకోమని చెప్పిన అధికారి. — కన్నీరు కార్చిన కుమారుడు. –మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో మృతి చెందిన వితంతు మహిళ. — తన కన్నతల్లి మృతి పై అధికారుల నిర్లక్ష్యాన్ని చెబుతున్న కొడుకు. V POWER  NEWS  : రుద్రవరం మండలంలో..కాయ కష్టం చేసుకుంటూ బ్రతుకుతున్న నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, వంటరి మహిళలకు , కుల వృత్తుల వారికి మీ కష్టానికి తోడుగా మేమున్నామంటూ ప్రభుత్వాలు కొంత డబ్బులు పింఛన్ రూపంలో అందిస్తుంది. ప్రభుత్వం అందించే ఈ సహాయంతో వారి జీవనానికి, వారి ఆరోగ్య స్థితి గతులకు , వ్యక్తిగత అవసరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశతో వారి అవసరాలను తీర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా కొందరు అధికారులు ఇంటి పన్ను ,నీటి పన్నులు కట్టాలంటూ మీ అవసరాలతో మాకేంటి మీ బాధలతో మాకేంటి అంటూ ముక్కు పిండి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల సొమ్మును వసూలు చేయడంతో తమకు కనీస అవసరమైన మందులకు డబ్బులు లేక అనారోగ్యంతో ఓ వితంతు మహిళ మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న లక్ష్మీదేవి 45 సంవత్సరాలు ప్రభుత్వం అందించే వితంతు పింఛన్ తీసుకుంటూ తన ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ జీవనం సాగిస్తుంది. స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారి మార్చి మాసానికి చెందిన వితంతు పింఛన్ 4 వేల రూపాయలను లక్ష్మీదేవికి ఇవ్వలేదు. తన వితంతు పింఛను నాకు ఎందుకు ఇవ్వలేదని తన కొడుకుతో సహా వచ్చి అధికారిని అడగగా మీరు ఇంటి పన్ను కట్టలేదంటూ అందుకు బదులుగా మీ పింఛను సొమ్మును జమ చేస్తున్నామని జవాబు ఇవ్వడంతో కృంగిపోయిన ఆ మహిళ అయ్యా నాకు గత కొంతకాలంగా నేను షుగరు ఆయాసంతో నానా ఇబ్బందులు పడుతూ మందులను కొనుక్కొని వాటిని మింగుతూ బ్రతుకుతున్నాను నా మీద కనికరం ఉంచి నా పింఛను డబ్బులు ఇవ్వమని ప్రాధేయపడిన కనికరించని ఆయన మీకు మందులకు డబ్బులు లేకపోతే నేను ఏమి చేయాలి మీరు ఇంటి పన్ను కట్టలేదు కాబట్టి నేను జమ చేసుకున్నాను. మీకు మందులకు లేకపోతే డబ్బులను వడ్డీకి తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచక గత 15 రోజులుగా నంద్యాలకు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటూ ఉంది. తన పింఛను ఇప్పించమని లక్ష్మీదేవి గ్రామ పెద్దలతో చెప్పింది. గ్రామ పెద్దలు స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారికి పలుమార్లు చెప్పిన ఆయన వినలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవి శనివారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. తన పింఛను డబ్బులు పన్నుల పేరిట జమ చేసుకోవడంతోనే సరైన సమయానికి మందులకు డబ్బులు లేకనే లక్ష్మి దేవి మృతి చెందిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ కేవలం ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బుతో మందులను కొని వాటిని మింగుతూ బ్రతుకుతుందని తన కొడుకు రామ మోహన్ తెలిపారు. మా అమ్మకు వచ్చే పింఛను డబ్బును ఎగ్జిక్యూటివ్ అధికారి సుబ్బారావు పన్ను కట్టాలంటూ ప్రభుత్వం ఇచ్చే 4000 రూపాయలను మాకు ఇవ్వకుండా జమ చేసుకున్నానని చెప్పాడు. మా అమ్మకు బాగాలేదు డబ్బు లేకపోతే మందులను నేను కొనలేను మందులు కొనకపోతే మా అమ్మ చనిపోతుంది సార్ అని గత 15 రోజులుగా బ్రతిమాలుతూనే ఉన్నాను. మీ బాధలతో మాకేంటి పని మీకు డబ్బు లేకపోతే వడ్డీకి తీసుకొని మందులను కొనుక్కొని మీ అమ్మను బ్రతికించుకుపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్నారు. ఇవాళ కేవలం మా అమ్మకు మందులు కొనలేక మా అమ్మ మృతి చెందిందని ఒక్కగా నొక్క కొడుకు కన్నీరు కార్చాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు కన్నీరు కార్చారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్మును పన్నుల పేరట వసూలు చేస్తూ ప్రజల చావులకు కారణమవుతున్న ఇలాంటి అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

చాగలమర్రి యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక.

V POWER  NEWS  :  నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కరుణా కటాక్షలతో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఎన్నికయ్యారు.ఆయనకి యువజన సంఘం సభ్యులందరూ పూలదండ వేసి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు.గతంలో చెప్పినట్టుగానే అయప్ప స్వామి దేవస్థాన ఆలయ ఆవరణంలో రేకుల షెడ్డుకు గాను విరాళము అందించిన తొమ్మండ్రు వినయ్ కుమార్ కు ఆర్యవైశ్య సంఘం , యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి శాలువ కప్పి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా 2025వ సంవత్సరంలో వాసవి యువజన సంఘం నూతన కమిటీ అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ , ఉపాధ్యక్షులు : కామిషెట్టి మధుసూధన్ రావు , బచ్చు సుగుణాకర్ , కార్యదర్శి : బింగుమళ్ళ హరికృష్ణ , ఉప-కార్యదర్షులు : తలుపుల సునిల్ కుమార్ , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, వందవాసీ శివసుబ్బ చక్రధర్ , కోశాధికారి : లింగం రంగనాథ్ , ఉప-కోశాధికారి : కామిషెట్టి సుబ్రమణ్యం కార్యవర్గ సభ్యులు : బైసాని వెంకటేశ్వర్లు , బింగుమళ్ళ సందీప్ , గంగిశెట్టి వాసుదేవయ్య , కామిశెట్టి ప్రసాద్ , మేడ నరేంద్ర , అయినాల శ్రీనివాసులు , మద్దాల సుబ్రమణ్యం , చాటకొండు దుర్గ ప్రసాద్ గార్లను నియమించి నూతన కార్యవర్గంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ , కమిటీ సభ్యులు , అవోపా అధ్యక్షుడు సుంకు రాజేష్ , కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

టిడిపి నేతల దౌర్జన్యం మహిళ ఆత్మహత్యాయత్నం

– దేవిబెట్ట లో స్థల వివాదం. – అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది  V POWER NEWS :  ఎమ్మిగనూరు మండల పరిధిలోని దేవి బెట్ట గ్రామంలో ఒక మహిళకు సంబంధించిన స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు సదరు మహిళలకు చెందిన మూడు సెంట్ల భూమి ని టీడీపీ నాయకులు అక్రమించుకొని బెదిరిస్తున్నారని దేవి బెట్ట గ్రామానికి సావిత్రి అనే (42) అనే మహిళ తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసింది అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చెయ్యాలని బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకుంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలని తీసుకుని విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో … ప్రతి అంశాన్నీ నమోదు చేయాలి — జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  

సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ …  ఆధునిక సాంకేతికతతో నేరస్ధుల పై నిఘా ఉంచాలి. … పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ.  పోలీసులు  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి , నేరాల నియంత్రణతో పాటు నేరస్ధులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  అన్నారు.  ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని  వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని  డిఎస్పీలు,  సిఐలు, ఎస్సైల తో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ నేర సమీక్షా సమావేశంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్న సిఐడి ఐజి వీనిత్ బ్రిజ్ లాల్  తో  జిల్లా ఎస్పీ  మాట్లాడారు. అనంతరం  సిఐడి ఐజి ,  సిసిటిఎన్ఎస్  గురించి  జిల్లా ఎస్పీ తో మాట్లాడారు… ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ   పోలీసు అధికారులతో  మాట్లాడo  జరిగింది.   కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో  దీర్ఘకాలంగా ఉన్న  పెండింగ్‌ కేసుల  గురించి  జిల్లా ఎస్పీ   సమీక్షించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకొని పలు సలహాలు,  సూచనలు చేశారు.  కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశాన్నీ సీసీటీఎన్ఎస్‌ అప్లికేషన్‌లో నమోదు చేయాలని,   పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సిసిటిఎన్ఎస్‌లో అన్ని వివరాలు నమోదు చేయడం వల్ల కేసులు, వ్యక్తుల పూర్తి సమాచారం తెలుస్తుందని అది అందరికీ ఉపయోగపడేలా దోహదం చేస్తుందన్నారు.  ప్రతి పోలీస్‌ స్టేషన్‌ సిడి పైళ్ళను ఆయా పోలీసు అధికారులు సిసిటిఎన్ఎస్‌ లో నమోదు చేసారో లేదో అని ఆరా తీశారు.   సీసీటీఎన్ఎస్‌లో ముఖ్యంగా గ్రేవ్‌ కేసులు,  నాన్‌ గ్రేవ్‌ కేసులలో పార్ట్‌ 1, పార్ట్‌ 2 సీడీలు అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు.   మర్డర్‌ కేసుల్లో, 174 సిఆర్‌పిసి కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా  కోర్టులో ధాఖలు  చేయాలని,  డిఎస్పీ స్ధాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   క్రైమ్ రికార్డు సిడి ఫైల్స్ తయారు చేయడంలో , సిసి టిఎన్ ఎస్ లో వివరాలు నమోదు అప్ డేట్ చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా  చూడాలని కోరారు. అనంతరం పోలీసుస్టేషన్ లలో  పని చేసే సిసిటిఎన్ ఎస్   పోలీసు సిబ్బందితో  మాట్లాడుతూ.. గ్రేవ్ కేసులు, యు ఐ కేసులు, మర్డర్ , సైబర్ నేరాల కేసులు,  పోక్సో కేసులు , మిస్సింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు  మరియు  డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్  ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలో  తనిఖీలు నిర్వహించాలన్నారు.  సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.   ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా,  ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్,  డిఎస్పీలు బాబు ప్రసాద్,  శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , హేమలత , భాస్కర్ రావు ,  ట్రైనీ డీఎస్పీ ఉష శ్రీ ,  సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు. 

మత్తు పదార్థాల నియంత్రణలో భాగస్వాములవ్వాలి .. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

V POWER NEWS  :  కర్నూలు జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాaలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు ఆయా శాఖల అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా యూనివర్సిటీలు, మెడికల్ కళాశాలలు, ఇతర కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం లేకుండా చూడాలన్నారు. ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే దాచి పెట్టవద్దని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్ధాలు, టోల్ ఫ్రీ నంబర్ వివరాలతో శాశ్వతంగా ఉండే విధంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. పొలాల్లో గంజాయి సాగు గురించి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వీఆర్వోల ద్వారా సమాచారం తీసుకుని పోలీసు శాఖకు అందించాలని ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. ఎక్సైజ్, అటవీ శాఖ అధికారులు కూడా గంజాయి సాగు, మత్తు పదార్థాల వినియోగం పట్ల నిఘా ఉంచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, ప్రతిజ్ఞల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మిరప పంట మధ్యలో గంజాయి సాగు చేసే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు గంజాయి సాగు చట్ట పరంగా నేరమనే విషయాన్ని పూర్తిగా అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. బస్సులు, రైళ్ల ద్వారా వీటి రవాణాను పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మత్తు పదార్థాల వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆదోని చందన షాపింగ్ మాల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి …

V POWER NEWS  : ఆదోని పట్టణంలో చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేసిన షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, తదితరులు సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వీరు మాట్లాడుతూ ఈరోజు చందన షాపింగ్ మాల్ ప్రారంభం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రధాన రోడ్డు మొత్తం పూర్తిగా రాకపోకలను పోలీసు వారు అధికారులు దగ్గరుండి బంద్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు తెలిపారు. మండుటెండలో సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్ సమస్యతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దగ్గర నుండి ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు రిలయన్స్ ట్రెండ్ వరకు ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు, నరకయాతన పడ్డారని వారు తెలిపారు. ఆదోని పట్టణానికి షాపింగ్ మాల్ లాంటివి రావడం మంచిదే అయినప్పటికీ ఈ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని వారు తెలిపారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను ఇబ్బందులు గురిచేసిన చందన షాపింగ్ మాల్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా … ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య

పులికనుమ రిజర్వాయర్ లో వ్యక్తి గల్లంతు..

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు. .. కొనసాగుతున్న సహాయక చర్యలు. … లభించని ఆచూకీ..! మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన పెద్దకడుబూరు మండల పరిధిలోని పులికనుమ గ్రామానికి చెందిన (60) గొర్రెల నాగేంద్ర ఇవాళ ఉదయం గ్రామ శివారులో ఉన్న పులికనుమా రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు రిజర్వాయర్ కు వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.. ఆయన కనిపించకపోవడంతో గల్లంతయారేమోననే అనుమానంతో అధికారులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు..ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

error: Content is protected !!