V POWER NEWS: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలలో పని చేస్తున్న అధ్యాపకులకు 12 నెలల వేతనం చెల్లించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ తెలిపారు.ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు,కార్పొరేటు విద్యా సంస్థల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులతో వెట్టిచాకిరి చేస్తించుకుంటున్నారని అన్నారు.శ్రమకు తగ్గ వేతనం లేక ప్రైవేటు ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారని అన్నారు.యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తూ ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలల వేతనం ఇచ్చి సరిపెడులుతున్నారని.పాఠశాలలు,కళాశాలల విద్యార్థులకు ర్యాంకులు రావాలన్న,స్కూల్స్,కాలేజీలలో అడ్మిషన్ లు పెరగాలన్న కీలక భూమిక అందులో పని చేస్తున్న సిబ్బందిదే అన్నారు.కనీస సౌకర్యాలకు నోచుకోని జీవితాలు ప్రైవేటు విద్యాసంస్థల పనిచేస్తున్న ఉపాధ్యాయులు ది అన్నారు. కనీసం పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అంటివి ఏవి లేకుండా ఉద్యోగ భద్రత కూడా లేకుండా సంవత్సరాల తరబడి పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్న వాళ్లకు గుర్తింపు లేదన్నారు. ప్రభుత్వాలు సైతం ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన వారిని ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వమైన ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల ఆలకించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.