మెట్రో నగరాలకు ధీటుగా నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ.…ఈ నెల 14 న ప్రారంభం.

… నెరవాటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సక్సెస్ సాధించింది…ఈ.ఎన్.టి గైనకాలని ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో.…నా చిరకాల కోరికను కొడుకు,కోడలు నెరవేర్చారు. నంద్యాల జిల్లా కావడంతో మెట్రో నగరాలకు పరమితమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నారు.కనిపించని దేవిడి కంటే కనిపించే దేవుళ్ళు వైద్యులు…నంద్యాల పట్టణంమెట్రో నగరాలకు ధీటుగా నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ. ఈ నెల 14 న ప్రారంభం.లో ప్రజలు వైద్య పరంగా కొన్ని సేవలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ ,చెన్నై,బెంగళూరు ప్రాంతాల్లో వైద్య చికిత్సలు చేయించుకునేవారు.అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడంలో నంద్యాల వైద్యులు ముందుకు వస్తున్నారు.కార్పొరేట్ వైద్యాన్ని నంద్యాల ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ నెరవాటి అరుణ కుమారి లు నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ నెల 14 న ప్రారంభిస్తున్నారు.ఈ ఆసుపత్రిలో చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్య సేవలతో పేస్టు ఆర్థోపెడిక్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా వైద్యులు వినోద్ కుమార్,అరుణ కుమారి లు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ లో 2004 లో నెరవాటి ఆసుపత్రిని ప్రారంభించి చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్యసేవలు అందించామని అన్నారు.2014 లో డాక్టర్ అరుణ కుమారి సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేశారని అన్నారు.10 ఏళ్లలో సంతానం లేనివారికి వైద్య సేవలు చేశారన్నారు. నెరవాటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏర్పాటు చేసి35 శాతం విజయం సాధించారని పేర్కొన్నారు.మెట్రో నగరాలకు దీటుగా వృద్ధి సాధించామని అన్నారు.2024 లో 100 పడకలు ఏర్పాటుచేసి నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంది అన్నారు.ఈ నేపథ్యంలోనే రైతుబజార్ సమీపంలో ఈ నెల 14 న నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నీ ప్రారంభిస్తున్నామని అన్నారు.గతంలో చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్య సేవలు ,టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్లు ఉండేవని ఇప్పుడు ఆర్థోపెడిక్ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.డాక్టర్లు సుమన్,ఫతిమాలు వైద్య సేవలు అందిస్తారని అన్నారు.ఆక్సిడెంట్ కేసులు,జాయింట్ రీ ప్లేస్ మెంట్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.డాక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ సాదారణ కాన్పులు,డెలివరీ సమయంలో మహిళలు ఇబ్బందులు పడకుండా కాస్మొటిక్ గైనకాలజీ వింగ్ ను ఏర్పాటుచేశామన్నారు.డెలివరీ సమయంలో కుట్లు పడడం,గర్భసంచి జారిపోవడం,యోని లూజు కావడం,కొందరికి మూత్రం పడిపోవడం జరుగుతుందని అన్నారు.ఈ సమస్యలకు ఆపరేషన్ లేకుండా వైద్య సేవలు( కాస్మొటిక్ గైనకాలజి ట్రీట్మెంట్)అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు.గర్భసంచి సమస్యలకు పొట్టమీద కుట్లులేకుండా లాప్రోసిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సంతానం లేనివారు ఎందరో మా ఆసుపత్రిలో వైద్య సేవలు తీసుకున్నారని అన్నారు.ప్రముఖ వ్యాపారవేత్త,ఆర్యవైశ్య ప్రముఖులు నెరవాటి సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఆశయం ఉండేదన్నారు.మెట్రో నగరాల్లో వైద్య సేవలు ఖర్చుతో కూడుకున్నవి అన్నారు.హైదరాబాద్ కు ధీటుగా నంద్యాలలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మించాలనే నా చిరకాల కోరికను కొడుకు,కోడలు తీర్చడం సంతోషంగా ఉందన్నారు.కృషి,పట్టుదలతో ప్రజలకు మంచి వైద్య సేవలు చేసి మంచిపేరు తెచ్చుకున్నారని ఒక తండ్రిగా,మామగా ఇంతకన్నా నాకు ఏమి కావాలన్నారు.హైదారాబాద్ ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలు అందిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గగన్,ప్రముఖ వ్యాపారవేత్త నెరవాటి రవి కుమార్ పాల్గొన్నారు.

సర్పంచ్ ఆగ్రహం…

వాటర్ షెడ్ అధికారితో వాగ్వాదం చేస్తున్న సర్పంచ్.  సర్పంచి తీర్మానం లేకుండా పనులు ఎలా చేస్తారని యాపదిన్నె గ్రామ సర్పంచ్ రామ్ రెడ్డి ఆగ్రహ వ్యక్తంం చేశారు. మంగళవారం ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి వాటర్ షెడ్ అధికారిని విజేతమ్మ తో వాగ్వాదం దిగారు. తెలుగుదేశం పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేసామని ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ప్రాధాన్యత పెరుగుతుంది అనుకుంటే వాటికి విరుద్ధంగా నడుస్తుందని ఆయన వాపోయారు. అధికారులు ఒక ఒక వర్గానికి కొమ్ముకోయడం సరికాదన్నారుు. తమకు జరుగుతున్న అన్యాయంతమకు జరుగుతున్న అన్యాయం పై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన … ఎం.పి బస్తిపాటి నాగరాజు

V POWER NEWS  : క‌ర్నూలు జిల్లా ఆదోని మండ‌లం పాండ‌వ‌గ‌ల్లు వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్ర‌మాదం పై ఎం.పి బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన ఫోన్ ద్వారా రోడ్డు ప్రమాద ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. కర్ణాటక ఆర్టీసీ బస్సు రెండు బైకులను ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.. ఈ ప్రమాదంలో కుప్పగల్ కి చెందిన భార్య భర్తలు, కర్ణాటక లోని మాన్వికి చెందిన తల్లి తండ్రి కుమారుడు ఒకే సారి మరణించడం తన మనసును తీవ్రంగా కలచి వేసిందన్నారు.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్న  ఎం.పి నాగరాజు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు…

మహిళా శాసన సభ్యురాలు  పల్లె సింధూర రెడ్డి మాటలను ఖండిoచినా … లంబాడి హక్కుల పోరాట సమితి  రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్.

— నాడు నేడు భిక్షాటనతోనే ఎరుకల , లంబాడి ప్రజల జీవితాలు.   గిరిజనుల జోలికొస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే సత్తా  గిరిజన,లంబాడీలకు ఉంది.  — రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాల నాయకులతో కలసి ఉమ్మడికార్యచరణ కార్యక్రమాలు చేపడతాo.   V POWER NEWS  :   కర్నూలు మండలం ఎన్ఎస్ తండా లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశము లో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ గారు మాట్లాడుతూ ఈమధ్య ఆరవ తేదీన పుట్టపర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రజలు 35 లక్షల పైబడి 32 తెగలుగా ఉన్నారని వీరిలో ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థాయి ప్రాంతంలో ఏజెన్సీ గిరిజనులుగా ఇంకా కనీస రోడ్డు వైద్య సౌకర్యం లేని ప్రాంతంలో బ్రతుకుతున్నారని అలాగే మైదాన ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 20 లక్షల పైబడి జనాభా 70 నియోజకవర్గాలలో ఉన్నారని, ఈ ప్రజలను పాలకులు ఓటర్లుగా మాత్రమే వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిని ఈ రాష్ట్రం వదిలి పారిపోయేటట్లు చేసే కార్యక్రమాలు పెట్టుకున్నట్టు ఉన్నట్లు ఉన్నారని. అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మొదటిసారి పుట్టపర్తి నియోజకవర్గం లో ఎన్నిక కాబడిన పల్లె సింధూర రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో దాదాపుగా 30 వేల  లంబాడి ఓట్లతోగెలిచి అక్కడ ఉన్నటువంటి గిరిజన లంబాడి ప్రజల. జీవితాలపై కనీస అవగాహన లేకుండా. స్వాతంత్రానికి ముందు ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉన్న గిరిజన తెగల కంటే అన్ని విధాలుగా విద్య వ్యవసాయము వ్యాపార రంగాలలో ఉంటూ  హార్దికంగా రాజకీయంగా బ్రిటిష్ కాలంలోనే పాలేగాల్ల పాలన చేసినటువంటి బోయ కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ని స్వయానా అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ తో బోయలు నేటికీ దుర్భర జీవితాలు గడుపుతున్నారు లంబాడి ప్రజల ఓట్లతో గెలిచిన  ఎమ్మెల్యే  మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్నారు. నాడు నేడు గిరిజన లంబాడీల లు బ్రతుకుతెరువు లేక పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరు తమిళనాడు రాష్ట్రం చెన్నై బాంబే కలకత్తా లాంటి నగరాలకు వెళ్లి బ్రతుకుతున్న సంగతి పాలకులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా నేటికీ గిరిజనుల జీవితాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి నిర్వహించకుండా కులాల మధ్య కుంపటి  పెట్టే కార్యక్రమాలు తీసుకురావడం ఎంతవరకు న్యాయమని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నామన్నారు.  ఒకవైపు అన్ని రంగాలలో రాయలసీమ బ్రిటిష్ కాలంలోనే  పాలెగాలుగా నేడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా శాసించే స్థాయిలో ఉండి అన్ని రకాల ముందున్న బోయజాతి వారిని అతి పేదవారిగా వర్ణిస్తూ విలువైన శాసనసభ  సమయాన్ని కేటాయించిన పల్లె సింధూర రెడ్డిని స్వయానా స్పీకర్ గారే సపోర్ట్ చేయడం బాధాకరమన్నారు. గిరిజనుల జోలికొస్తే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే సత్తా మా గిరిజన లంబాడీలకు ఉందని సంగతి గుర్తు చేస్తున్నామన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన సంఘాల నాయకులతో కలసి ఉమ్మడికార్యచరణ కార్యక్రమాలు మొదలుపెడతామని కైలాస్ నాయక్  తెలిపారు.

స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నా … నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి.

V POWER  NEWS   :    నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నారు. అలాంటి గొప్ప మానవత్వం ఉన్న స్త్రీ మూర్తిని స్మరించుకుంటూ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. కుటుంబం కోసం ప్రేమను పంచుతూ కష్టాలను అధిగమిస్తూ కుటుంబంతో పాటు అన్ని రంగాలలో ముందడుగు వేసేది మహిళేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో ఆయా ప్రదేశాలలో దేవతలు ఉంటారన్న విషయాన్ని ఎంపీ వివరించారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన దేశం మన భారతదేశమన్నారు. పురుషులతో సమానంగా ఉండాలని అన్నింటిలో సమానత్వ అవకాశాలు చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించి ఆడపిల్లలను ఆడ పులిగా పెంచాలని ఎంపీ కోరారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. 

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ….

మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు.  …పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు.  … బ్యాంకు లింకేజీ కింద 6880 మహిళా సంఘాల సభ్యులకు 74.93 కోట్ల రూపాయలను పంపిణీ  చేశాం.  ….నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మహిళలు అభ్యున్నతి చెందాలని, స్వయం శక్తితో ఎదగాలని, సాధికారత దిశగా అడుగులు వేయాలని, సమాజాన్ని ముందుండి నడిపించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారన్నారు.  20వ శతాబ్ద ప్రధమార్ధంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. 

ప్రజా సమస్యలను  త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలి – నందికొట్కూరు MLA గిత్త  జయసూర్య.

గ్రీవెన్సెస్ కార్యక్రమంలో  …. నందికొట్కూరు శాసనసభ్యుడు  గిత్త  జయసూర్య V POWER NEWS  :  నంద్యాల జిల్లా,  నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ ప్రజాపిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 9 నెలలు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టార‌ని, సామాన్యుడికి కూడా పరిపాలనను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు అన్నారు. ప్రజల నుంచి, అర్జీలు  స్వీకరించారు. అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, మూడవ  శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ,ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనాలని సూచించారని , ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనడం జరిగినది.  

తుంగభద్ర నదిలో ఆంధ్ర గట్టు వైపు కర్ణాటక కన్ను పడింది.. అక్రమంగా ఇసుక తరలింపు … ట్రాక్టర్ల తో ఇతర ప్రాంతాలకు తరలింపు.. పథకాలకు తూట్లు పొడుస్తున్న మాఫియా..!

V POWER NEWS :  మంత్రాలయం రూరల్/కోసిగి : కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటిస్తే..కొంతమంది అక్రమార్కులు దానికి తూట్లు పొడుస్తున్నారు..కోసిగి మండల పరిధిలోని అగసనూరు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో ఆంధ్ర గడ్డ వైపు కర్ణాటక రాష్ట్రంలో తమాపూర్ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది..పదుల సంఖ్యలలో ట్రాక్టర్ లతో యదేచ్ఛగా ఇసుకను నిలువ చేస్తూ పక్క రాష్ట్రానికి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటుంది.అగసనూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఇలా అక్రమంగా ఇసుక తరలిస్తే రాబోయే తరానికి ఇసుక అనేది ఉండకుండా పోతుందని వారిని ఆపడానికి ట్రై చేస్తున్నా అవడం లేదు..అక్రమంగా ఇసుకను పట్టపగలే గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో గట్టు వద్ద గుట్టాలుగా నిల్వచేస్తున్నారు..అనంతరం రాత్రి వేళలో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఒక్క ట్రిప్పు రూ.30 వేల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం..ఇప్పటికైనా రెవెన్యూ,పోలీస్ అధికారులు ఇసుక అక్రమ నిల్వలను గుర్తించి మాఫియా పై చర్యులుa తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..

మంత్రాలయంలో అత్యంత వైభవంగా  .. రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం. 

శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించినా … సుబుధేంద్ర తీర్థ స్వామీజీ. V POWER  NEWS :   మంత్రాలయం లో శ్రీ రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ మఠంలో స్వామివారి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించి, శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ రాయర రథోత్సవాన్ని స్వామిజీ ఘనంగా ప్రారంభించారు. అనంతరం స్వామిజీ దీప ప్రజ్వలనం చేసి “నాద హారం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా, ప్రఖ్యాత సంగీత కళాకారులు తమ కళ రూపాన్ని, సేవను భక్తితో స్వామివారికి సమర్పించారు.ఈ పవిత్రమైన మరియు గొప్ప కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రాయల ఉత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.  

కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.

మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి. .. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. V POWER NEWS  …  KURNOOL  :  పోలీసు అధికారులు, పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్ ను ఎస్పీ బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీజ్ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలన్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా సమస్యల పట్ల పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు స్టేషన్ లో  రికార్డులను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ మన్మధ విజయ్ తదితరులు ఉన్నారు.

error: Content is protected !!