చాగలమర్రి యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక.

V POWER  NEWS  :  నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కరుణా కటాక్షలతో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఎన్నికయ్యారు.ఆయనకి యువజన సంఘం సభ్యులందరూ పూలదండ వేసి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు.గతంలో చెప్పినట్టుగానే అయప్ప స్వామి దేవస్థాన ఆలయ ఆవరణంలో రేకుల షెడ్డుకు గాను విరాళము అందించిన తొమ్మండ్రు వినయ్ కుమార్ కు ఆర్యవైశ్య సంఘం , యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి శాలువ కప్పి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా 2025వ సంవత్సరంలో వాసవి యువజన సంఘం నూతన కమిటీ అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ , ఉపాధ్యక్షులు : కామిషెట్టి మధుసూధన్ రావు , బచ్చు సుగుణాకర్ , కార్యదర్శి : బింగుమళ్ళ హరికృష్ణ , ఉప-కార్యదర్షులు : తలుపుల సునిల్ కుమార్ , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, వందవాసీ శివసుబ్బ చక్రధర్ , కోశాధికారి : లింగం రంగనాథ్ , ఉప-కోశాధికారి : కామిషెట్టి సుబ్రమణ్యం కార్యవర్గ సభ్యులు : బైసాని వెంకటేశ్వర్లు , బింగుమళ్ళ సందీప్ , గంగిశెట్టి వాసుదేవయ్య , కామిశెట్టి ప్రసాద్ , మేడ నరేంద్ర , అయినాల శ్రీనివాసులు , మద్దాల సుబ్రమణ్యం , చాటకొండు దుర్గ ప్రసాద్ గార్లను నియమించి నూతన కార్యవర్గంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ , కమిటీ సభ్యులు , అవోపా అధ్యక్షుడు సుంకు రాజేష్ , కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

టిడిపి నేతల దౌర్జన్యం మహిళ ఆత్మహత్యాయత్నం

– దేవిబెట్ట లో స్థల వివాదం. – అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది  V POWER NEWS :  ఎమ్మిగనూరు మండల పరిధిలోని దేవి బెట్ట గ్రామంలో ఒక మహిళకు సంబంధించిన స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు సదరు మహిళలకు చెందిన మూడు సెంట్ల భూమి ని టీడీపీ నాయకులు అక్రమించుకొని బెదిరిస్తున్నారని దేవి బెట్ట గ్రామానికి సావిత్రి అనే (42) అనే మహిళ తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసింది అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చెయ్యాలని బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకుంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలని తీసుకుని విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌లో … ప్రతి అంశాన్నీ నమోదు చేయాలి — జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  

సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాల నియంత్రణ …  ఆధునిక సాంకేతికతతో నేరస్ధుల పై నిఘా ఉంచాలి. … పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ.  పోలీసులు  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి , నేరాల నియంత్రణతో పాటు నేరస్ధులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  అన్నారు.  ఈ సంధర్బంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని  వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని  డిఎస్పీలు,  సిఐలు, ఎస్సైల తో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ నేర సమీక్షా సమావేశంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్న సిఐడి ఐజి వీనిత్ బ్రిజ్ లాల్  తో  జిల్లా ఎస్పీ  మాట్లాడారు. అనంతరం  సిఐడి ఐజి ,  సిసిటిఎన్ఎస్  గురించి  జిల్లా ఎస్పీ తో మాట్లాడారు… ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ   పోలీసు అధికారులతో  మాట్లాడo  జరిగింది.   కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో  దీర్ఘకాలంగా ఉన్న  పెండింగ్‌ కేసుల  గురించి  జిల్లా ఎస్పీ   సమీక్షించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకొని పలు సలహాలు,  సూచనలు చేశారు.  కేసు నమోదు నుంచి అభియోగ పత్రాలు దాఖలు వరకు ప్రతి అంశాన్నీ సీసీటీఎన్ఎస్‌ అప్లికేషన్‌లో నమోదు చేయాలని,   పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సిసిటిఎన్ఎస్‌లో అన్ని వివరాలు నమోదు చేయడం వల్ల కేసులు, వ్యక్తుల పూర్తి సమాచారం తెలుస్తుందని అది అందరికీ ఉపయోగపడేలా దోహదం చేస్తుందన్నారు.  ప్రతి పోలీస్‌ స్టేషన్‌ సిడి పైళ్ళను ఆయా పోలీసు అధికారులు సిసిటిఎన్ఎస్‌ లో నమోదు చేసారో లేదో అని ఆరా తీశారు.   సీసీటీఎన్ఎస్‌లో ముఖ్యంగా గ్రేవ్‌ కేసులు,  నాన్‌ గ్రేవ్‌ కేసులలో పార్ట్‌ 1, పార్ట్‌ 2 సీడీలు అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు.   మర్డర్‌ కేసుల్లో, 174 సిఆర్‌పిసి కేసుల్లో త్వరితగతిన పురోగతి పొందేలా చూసుకుంటూ అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా  కోర్టులో ధాఖలు  చేయాలని,  డిఎస్పీ స్ధాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   క్రైమ్ రికార్డు సిడి ఫైల్స్ తయారు చేయడంలో , సిసి టిఎన్ ఎస్ లో వివరాలు నమోదు అప్ డేట్ చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా  చూడాలని కోరారు. అనంతరం పోలీసుస్టేషన్ లలో  పని చేసే సిసిటిఎన్ ఎస్   పోలీసు సిబ్బందితో  మాట్లాడుతూ.. గ్రేవ్ కేసులు, యు ఐ కేసులు, మర్డర్ , సైబర్ నేరాల కేసులు,  పోక్సో కేసులు , మిస్సింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు  మరియు  డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్  ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలో  తనిఖీలు నిర్వహించాలన్నారు.  సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.   ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా,  ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్,  డిఎస్పీలు బాబు ప్రసాద్,  శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , హేమలత , భాస్కర్ రావు ,  ట్రైనీ డీఎస్పీ ఉష శ్రీ ,  సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు. 

మత్తు పదార్థాల నియంత్రణలో భాగస్వాములవ్వాలి .. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

V POWER NEWS  :  కర్నూలు జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాaలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు ఆయా శాఖల అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన నార్కోటిక్స్ కో-ఆర్డినేషన్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా యూనివర్సిటీలు, మెడికల్ కళాశాలలు, ఇతర కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం లేకుండా చూడాలన్నారు. ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే దాచి పెట్టవద్దని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్ధాలు, టోల్ ఫ్రీ నంబర్ వివరాలతో శాశ్వతంగా ఉండే విధంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. పొలాల్లో గంజాయి సాగు గురించి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వీఆర్వోల ద్వారా సమాచారం తీసుకుని పోలీసు శాఖకు అందించాలని ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. ఎక్సైజ్, అటవీ శాఖ అధికారులు కూడా గంజాయి సాగు, మత్తు పదార్థాల వినియోగం పట్ల నిఘా ఉంచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, ప్రతిజ్ఞల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మిరప పంట మధ్యలో గంజాయి సాగు చేసే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు గంజాయి సాగు చట్ట పరంగా నేరమనే విషయాన్ని పూర్తిగా అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు. బస్సులు, రైళ్ల ద్వారా వీటి రవాణాను పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మత్తు పదార్థాల వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి, జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆదోని చందన షాపింగ్ మాల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి …

V POWER NEWS  : ఆదోని పట్టణంలో చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేసిన షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, తదితరులు సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వీరు మాట్లాడుతూ ఈరోజు చందన షాపింగ్ మాల్ ప్రారంభం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రధాన రోడ్డు మొత్తం పూర్తిగా రాకపోకలను పోలీసు వారు అధికారులు దగ్గరుండి బంద్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు తెలిపారు. మండుటెండలో సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్ సమస్యతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దగ్గర నుండి ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు రిలయన్స్ ట్రెండ్ వరకు ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు, నరకయాతన పడ్డారని వారు తెలిపారు. ఆదోని పట్టణానికి షాపింగ్ మాల్ లాంటివి రావడం మంచిదే అయినప్పటికీ ఈ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని వారు తెలిపారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను ఇబ్బందులు గురిచేసిన చందన షాపింగ్ మాల్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా … ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య

పులికనుమ రిజర్వాయర్ లో వ్యక్తి గల్లంతు..

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు. .. కొనసాగుతున్న సహాయక చర్యలు. … లభించని ఆచూకీ..! మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన పెద్దకడుబూరు మండల పరిధిలోని పులికనుమ గ్రామానికి చెందిన (60) గొర్రెల నాగేంద్ర ఇవాళ ఉదయం గ్రామ శివారులో ఉన్న పులికనుమా రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు రిజర్వాయర్ కు వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.. ఆయన కనిపించకపోవడంతో గల్లంతయారేమోననే అనుమానంతో అధికారులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు..ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మెట్రో నగరాలకు ధీటుగా నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ.…ఈ నెల 14 న ప్రారంభం.

… నెరవాటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సక్సెస్ సాధించింది…ఈ.ఎన్.టి గైనకాలని ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో.…నా చిరకాల కోరికను కొడుకు,కోడలు నెరవేర్చారు. నంద్యాల జిల్లా కావడంతో మెట్రో నగరాలకు పరమితమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నారు.కనిపించని దేవిడి కంటే కనిపించే దేవుళ్ళు వైద్యులు…నంద్యాల పట్టణంమెట్రో నగరాలకు ధీటుగా నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ. ఈ నెల 14 న ప్రారంభం.లో ప్రజలు వైద్య పరంగా కొన్ని సేవలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ ,చెన్నై,బెంగళూరు ప్రాంతాల్లో వైద్య చికిత్సలు చేయించుకునేవారు.అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడంలో నంద్యాల వైద్యులు ముందుకు వస్తున్నారు.కార్పొరేట్ వైద్యాన్ని నంద్యాల ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,డాక్టర్ నెరవాటి అరుణ కుమారి లు నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ నెల 14 న ప్రారంభిస్తున్నారు.ఈ ఆసుపత్రిలో చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్య సేవలతో పేస్టు ఆర్థోపెడిక్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా వైద్యులు వినోద్ కుమార్,అరుణ కుమారి లు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ లో 2004 లో నెరవాటి ఆసుపత్రిని ప్రారంభించి చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్యసేవలు అందించామని అన్నారు.2014 లో డాక్టర్ అరుణ కుమారి సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేశారని అన్నారు.10 ఏళ్లలో సంతానం లేనివారికి వైద్య సేవలు చేశారన్నారు. నెరవాటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏర్పాటు చేసి35 శాతం విజయం సాధించారని పేర్కొన్నారు.మెట్రో నగరాలకు దీటుగా వృద్ధి సాధించామని అన్నారు.2024 లో 100 పడకలు ఏర్పాటుచేసి నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రూపుదిద్దుకుంది అన్నారు.ఈ నేపథ్యంలోనే రైతుబజార్ సమీపంలో ఈ నెల 14 న నెరవాటి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నీ ప్రారంభిస్తున్నామని అన్నారు.గతంలో చెవి,ముక్కు,గొంతు,ప్రసూతి వైద్య సేవలు ,టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్లు ఉండేవని ఇప్పుడు ఆర్థోపెడిక్ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.డాక్టర్లు సుమన్,ఫతిమాలు వైద్య సేవలు అందిస్తారని అన్నారు.ఆక్సిడెంట్ కేసులు,జాయింట్ రీ ప్లేస్ మెంట్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.డాక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ సాదారణ కాన్పులు,డెలివరీ సమయంలో మహిళలు ఇబ్బందులు పడకుండా కాస్మొటిక్ గైనకాలజీ వింగ్ ను ఏర్పాటుచేశామన్నారు.డెలివరీ సమయంలో కుట్లు పడడం,గర్భసంచి జారిపోవడం,యోని లూజు కావడం,కొందరికి మూత్రం పడిపోవడం జరుగుతుందని అన్నారు.ఈ సమస్యలకు ఆపరేషన్ లేకుండా వైద్య సేవలు( కాస్మొటిక్ గైనకాలజి ట్రీట్మెంట్)అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు.గర్భసంచి సమస్యలకు పొట్టమీద కుట్లులేకుండా లాప్రోసిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సంతానం లేనివారు ఎందరో మా ఆసుపత్రిలో వైద్య సేవలు తీసుకున్నారని అన్నారు.ప్రముఖ వ్యాపారవేత్త,ఆర్యవైశ్య ప్రముఖులు నెరవాటి సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఆశయం ఉండేదన్నారు.మెట్రో నగరాల్లో వైద్య సేవలు ఖర్చుతో కూడుకున్నవి అన్నారు.హైదరాబాద్ కు ధీటుగా నంద్యాలలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మించాలనే నా చిరకాల కోరికను కొడుకు,కోడలు తీర్చడం సంతోషంగా ఉందన్నారు.కృషి,పట్టుదలతో ప్రజలకు మంచి వైద్య సేవలు చేసి మంచిపేరు తెచ్చుకున్నారని ఒక తండ్రిగా,మామగా ఇంతకన్నా నాకు ఏమి కావాలన్నారు.హైదారాబాద్ ఆసుపత్రులకు దీటుగా వైద్యసేవలు అందిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గగన్,ప్రముఖ వ్యాపారవేత్త నెరవాటి రవి కుమార్ పాల్గొన్నారు.

సర్పంచ్ ఆగ్రహం…

వాటర్ షెడ్ అధికారితో వాగ్వాదం చేస్తున్న సర్పంచ్.  సర్పంచి తీర్మానం లేకుండా పనులు ఎలా చేస్తారని యాపదిన్నె గ్రామ సర్పంచ్ రామ్ రెడ్డి ఆగ్రహ వ్యక్తంం చేశారు. మంగళవారం ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి వాటర్ షెడ్ అధికారిని విజేతమ్మ తో వాగ్వాదం దిగారు. తెలుగుదేశం పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేసామని ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ప్రాధాన్యత పెరుగుతుంది అనుకుంటే వాటికి విరుద్ధంగా నడుస్తుందని ఆయన వాపోయారు. అధికారులు ఒక ఒక వర్గానికి కొమ్ముకోయడం సరికాదన్నారుు. తమకు జరుగుతున్న అన్యాయంతమకు జరుగుతున్న అన్యాయం పై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన … ఎం.పి బస్తిపాటి నాగరాజు

V POWER NEWS  : క‌ర్నూలు జిల్లా ఆదోని మండ‌లం పాండ‌వ‌గ‌ల్లు వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్ర‌మాదం పై ఎం.పి బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటున్న ఆయన ఫోన్ ద్వారా రోడ్డు ప్రమాద ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. కర్ణాటక ఆర్టీసీ బస్సు రెండు బైకులను ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.. ఈ ప్రమాదంలో కుప్పగల్ కి చెందిన భార్య భర్తలు, కర్ణాటక లోని మాన్వికి చెందిన తల్లి తండ్రి కుమారుడు ఒకే సారి మరణించడం తన మనసును తీవ్రంగా కలచి వేసిందన్నారు.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్న  ఎం.పి నాగరాజు మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు…

error: Content is protected !!