యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలి – సీఈఓ సెట్కూరు డాక్టర్ కె.వేణుగోపాల్

నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలో  యుువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జ్యోతిభాపూలే గురుకుల పాఠశాల, డోన్ నందు  ‘హర్ ఘర్ తిరంగా’  (ప్రతి ఇంటి ఫై మువ్వన్నెల జండా) ప్రచార కార్యక్రమం లో భాగంగా సీఈఓ, సెట్కూరు డా!! కె. వేణుగోపాల్ గారు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా* ప్రతి భారతీయుడిని తమ ఇళ్లలోకి తిరంగను తీసుకువచ్చి, మన దేశ స్వాతంత్ర్య వేడుకలలో గర్వంగా ఎగురవేయమని, భారత జాతీయ జెండా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, మన దేశ ఐక్యతకు చిహ్నం అని తెలిపారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు అనుగుణంగా.  హర్ ఘర్ తిరంగా  ఆగష్టు 2 నుంచి 15 వ తేదీ వరకు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి దేశ రాజధాని వరకు నిర్వహిస్తున్నారని ,భారత జాతీయ జెండాతో ప్రతి పౌరుడు గౌరవ భావంతో ఉండాలని,  ఈ ప్రచారం ద్వారా లోతైన వ్యక్తిగత మరియు హృదయపూర్వక సంబంధంగా మార్చడానికి ప్రయత్నిస్తుందని, ప్రతి పౌరుడిలో లోతైన దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేస్తుందని మరియు యువత స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదని వారి ఆశయాలకు అనుగుగుణగా మహనీయుల అడుగుజాడల్లో నడవాలి అని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత పౌరులందరు కుల, జాతి, మతాలకు అతీతంగా సోదర భావనతో మెలగాలని, ఐక్యతతో దేశభివృద్ధికి తోడ్పాడాలని ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి అరుణ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులందరూ స్వాతంత్ర దినోత్సవాన్నీ పురస్కరించుకొని తమ ఇళ్లపై జాతీయ జండా ఎగురవేసి హారఘర్ తిరంగా కార్యక్రమంను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు  సూపరింటెండెంట్ శ్యాంబాబు, పాఠశాల అధ్యాపకులు  విద్యార్థినులు పాల్గొన్నారు https://youtu.be/mXOgl_1LmOk?si=hPtsxA0f4UuXlZS1

దండాలు దోరో… నాకు న్యాయం చేయండి ..

నష్టపరిహారం కోసం భర్త,కొడుకును కోల్పోయా .. ఇప్పటికైనా కనికరించండి. నా చావును కూడా చూడాలనుకుంటున్నారా.. వృద్దురాలి ఆవేదన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం, బ్రాహ్మణ పల్లె గ్రామానికి చెందిన వృద్దురాలు షేక్ మహబూబ్ బి ఆవేదన కర్నూలు కలెక్టరేట్ లోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సహకరించని వయసులో న్యాయం తమకు అందించాల్సిన నష్టపరిహారం కోసం తహసీల్దార్,ఆర్ డి ఓ,కలెక్టర్ కార్యాలయానికి కాళ్ళకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు పట్టించుకోకపొగా నానా దుర్భాషాలాడిన ఘటనతో తీవ్ర మనస్తాపనికి గురైంది. చివరిగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,గ్రీవెన్స్ లో ఆమె న్యాయం కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందచేసిన అనంతరం కన్నీటి పర్యంతం అయింది.వివరాలు ఇలా ఉన్నాయి…కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లెకు చెందిన షేక్ మహబూబ్ బి,భర్త పేరు ఖాసీం సాహెబ్ (లేట్)కి సంబందించిన సర్వే నంబర్ 121/ B4,B5లలో ఆమె భర్త ఖాసీం సాహెబ్,చిన్న ఖాసీం సాహెబ్ ఇరువురు కలిసి సంయుక్తంగా వారికీ ఉన్న 6.14 ఎకరాలలో గత 30ఏళ్ల నుండి వివిధ రకాల పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.అయితే 2020వ సంవత్సరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎపిఐఐసి కోసం చేపట్టిన భూ సేకరణలో భాగంగా వారికీ 6.14ఎకరాలకు నష్టపరిహారం ఇస్తామని అంగీకరిస్తూ నోటీసులు జారీచేశారు.దానికి అనుగుణంగా ఖాసీం సాహెబ్,చిన్న ఖాసీం సాహెబ్ లు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను అంగీకరిస్తూ అనుభవంలో ఉన్న తమ భూమిని ఓర్వకల్ మండల రెవిన్యూ అధికారికి వ్రాత పూర్వకంగా అప్పగించడం జరిగింది.ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఆర్.శివరాముడు,అప్పటి కర్నూలు జిల్లా రెవిన్యూ డివిజన్ అధికారికి పూర్తి సమాచారం అందచేయడం జరిగింది.ఆ సందర్బంగా ఆర్ డిఓ అధికారి సైతం తమకు సంబంధిత అనుభవంలో ఉన్న సర్వే నంబర్ లు 121/ బి4,బి5లకు నష్ట పరిహారం మంజూరైనట్లు నమ్మబలుకుతూ తమకు సమాచారం తెలియచేశారని పేర్కొన్నారు. అధికారులను గుడ్డిగా నమ్మిన తన భర్త, కుమారుడులు ఆర్ డిఓ కార్యాలయానికి తనను కూడా వెంటబెట్టుకుని, ఆర్డిఓకార్యాలయంను సంప్రదించి 6.14 ఎకరాలకు నష్టపరిహారం కోరినట్లు షేక్ మహబూబ్ బి చెప్పారు.దీంతో ఆర్డిఓ ప్రస్తుతం 5ఎకరాలకు ఇస్తాము,మరల మిగిలి ఉన్న 1.14ఎకరాలకు తదుపరి విడతలో ఇస్తామని చెప్పునట్లు షేక్ మహబూబ్ బి పేర్కొన్నారు.అయితే అప్పటికే నా కుమారుడికి పూర్తి స్థాయిలో అనారోగ్యంతో ఉన్నందువలన, మరోవైపు పొలం సాగు కొరకు చేసిన అప్పుల ఒత్తిడికి తాళలేక ఆర్ డిఓ చెప్పిన విధంగా అంగీకరించామని అన్నారు.కానిమాకు ఐదు ఎకరాలకు నష్టపరిహారం చెల్లించిన తదనంతరం 10రోజులకే,ఒక రాజకీయ నాయకుడి సిఫారస్ మేరకు ప్రభుత్వ నిబంధనలు దిక్కరించి, ఇతరులకు అదనంగా నష్ట పరిహారం చెల్లించారు.ఈ విషయం తెలుసుకున్న తాము ఆర్ డిఓ అధికారిని కలిసి కార్యాలయంలో విచారించగా వారు మాపై దుర్భాషాలాడుతూ,వారు తాము సమర్పించిన వినతులను తమ ముఖంపై విసిరివేస్తూ ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వం,ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అంటూ తమను భయబ్రాంతులకు గురిచేస్తూ, అవమాన పరచినట్లు ఆవేదన చెందారు.దీంతో తాము హ్యూమన్ రైట్స్ ను 2022, ఆగస్ట్,3వ తేదీన ఆశ్రయించడం జరిగిందని చెప్పారు.ఆ సమయంలో ప్రశ్నించిన హ్యూమన్ రైట్స్ కు ఆర్ డిఓ కార్యాలయం నుండి 2023,మార్చి,06వ తేదీన బాధితులు అర్జీ పెట్టుకుంటే… గతంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించిన విధంగా తమకు 50సెంట్లకు నష్టపరిహారం ఇస్తామని కౌంటర్ దాఖలు చేశారని అన్నారు.అదే సమయంలో తమ కుమారుడు చిన్న ఖాసీం సాహెబ్ అనారోగ్యంతో మృతి చెందాడు. అయినకూడా బాధలో ఉన్న తాము కుమారుడి మరణం గురించి పూర్తి సమాచారం ఇచ్చాము.అదే సమయంలో ప్రభుత్వం ఆదేశాలు ప్రకారంగా…వారిని, మాకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంజూరైనా ఉత్త (RG. G1/317/BRAHMANAPALLI/2021), DATE: 23/03/2022 ప్రకారం 6.14 ఎకరాలకు మొత్తంగా రూ.46.05.000 లక్షలకు గాను రూ.37.50.000 చెల్లించారు.అయితే న్యాయంగా మాకు మిగిలిన 1.14ఎకరాలకుగాను రూ.8.55.000లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.ఆ సమయంలో నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే 2025,జులై,20వ తేదీన అనారోగ్యంతో తన భర్త ఖాసీం సాహెబ్ ను సైతం కోల్పోయినట్లు చెప్పారు. అయితే ఇప్పటికైనా తనకు ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాను.ఈ నేపథ్యంలో 2025,జులై,09వ తేదీన కూడా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి తన పరిస్థితిని విన్నవించారు.ఆ సమయంలో జాయింట్ కలెక్టర్ సైతం ఫోన్ ద్వారా ప్రస్తుత ఆర్ డిఓ సందీప్ కుమార్ కు సమాచారం ఇచ్చి,పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.అప్పటికి సానుకూలంగా స్పందించిన ఆర్ డిఓ నష్టపరిహారం చెల్లించే చివరి సమయంలో గత ఆర్ డిఓ ఇవ్వలేని,నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడడం తాను పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతికి గురికావాల్సి వచ్చింది.ఈ వయసులో తాను కార్యాలయాల చుట్టూ తిరగలేని పరిస్థితి ఒకవైపు…కనీసం వయసుకు సైతం కనికరం చూపలేని ప్రభుత్వ యంత్రాంగంను చూస్తుంటే తనకు నవ్వాలో…ఏడవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను.ఏదిఏమైనా చివరి సారిగా తనకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ లో పిర్యాదు చేయడం జరిగింది.ఇందులో తమకు న్యాయం జరిగితే ఒకే…లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యం అంటూ కన్నీటిపర్యంత మయ్యారు.

” రైతు ను ఆదుకోవాల్సిన అధికారులు .. ఆ రైతునే భక్షించడం హేయమైన చర్యగా వా ఖండించినా” ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ అసోసియేషన్

రైతు భూమి నష్టపరిహారం రూ. 10.57 లక్షలు మింగేసిన ప్రభుత్వ సిబ్బంది… రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు .. విచారించి న్యాయం చేస్తామన్న కర్నూలు RDO సందీప్ కుమార్ .. ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి జి. విజయ్ కుమార్,

యోగాతో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం

మనస్సును ప్రశాంతంగా ఉంచే శక్తి వంతమైన సాధనమే యోగా … తహశీల్దార్ లక్ష్మినారాయణ హాలహర్వి Vపవర్ న్యూస్ :- యోగా ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవిస్తారు. యోగా, యోగాంధ్ర వేడుకలో భాగంగా హాలహర్వి మండల పరిధిలోని పచ్ఛారపల్లి పాఠశాల నందు శనివారం ఉదయం పంచాయతీ సెక్రెటరీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ హాలహర్వి మండల తహాశీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొని అయన ప్రసంగించారు. యోగా అనేది మన పూర్వీకులు అందించిన గొప్ప ఆస్తి అని ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడిని తగ్గించడానికి, అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందన్నారు. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. ఇప్పుడున్న కాలంలో ఎక్కువ పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యోగా చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగ ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు, యోగాంధ్ర కార్యక్రమంలో పాటలు పాడిన, బొమ్మలు గీసిన విద్యార్థులు దీపిక , పవిత్ర,ఊహా, విద్యార్థులకు యోగ సర్టిఫికెట్, బహుమతులను తహశీల్దార్ లక్ష్మినారాయణ,మండల క్లస్టర్ ఇంచార్జ్ ప్రహ్లాద రెడ్డి, అందజేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసి ఆసనాలు వేసి. శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచే శక్తివంతమైన సాధనమే యోగ విజయవంతం చేసినందుకు పేరు పేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పచ్ఛారపల్లి జనార్ధన ఆలూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలియజేశారు.యోగా కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు,పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్, విఆర్ఓ సతీష్ కుమార్ గౌడ్,వెటర్నరీ అసిస్టెంట్ మల్లికార్జున, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, అంగన్వాడి ఆయా లక్ష్మి, ఆశా వర్కర్ రమిజాబి, పొదుపు విఓఏ సుధాకర్, పచ్ఛారపల్లి భగత్ సింగ్ యూత్ , నాగరాజు ,రంజాన్, పాండు, గాదిలింగ, ఈశ్వరప్ప, రమేష్,ఈరన్న, శివకుమార్,సురేంద్ర, మధు, బీమేష్ ,వినోద్,బాపురం బసవ, ఉపాధి హామీ పథకం వారు,పోదుపు లక్ష్మి మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు,యువతి యూవకులు, తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో .. రాష్ట్ర మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు

V POWER NEWS  : ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు సహచర టిడిపి ఎంపీలతో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించడంతో పాటు జులై 5న ఏపీలో నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి ఆహ్వానించారు. అనంతరం ఆగస్టులో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు కు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం కలిపించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…

ప్రతి ఒక్కరూ .. యోగాను అలవాటు చేసుకోవాలి … కర్నూలు పార్లమెంటు మెంబర్ బస్తిపాటి నాగరాజు

V POWER NEWS  : మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ నెల 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ప్రజలకు యోగ పై అవగాహన కలిపించేందుకు కర్నూలు రూరల్ మండలం పంచాలింగాల గ్రామంలోని తన స్వగృహం లో ఆయన యోగాసానాలు చేసారు. యోగా చేయడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుందని, యోగా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని ఎం.పి నాగరాజు తెలిపారు. 

విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో .. “జ్యోతిష్య జ్ఞాన రత్న” బిరుదు పొందిన జోతిష్య జ్ఞాన రత్న S S బాబా.

హైదరాబాద్ నగరంలో 15-06-2025 వ తేదీన విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 16వ వైదిక జ్యోతిష్య సదస్సులో, నాకు “జ్యోతిష్య జ్ఞాన రత్న” అనే గౌరవ బిరుదు ప్రదానం చేయడం నాకు గర్వకారణంగా ఉందని మరియు ఇంత గొప్ప గౌరవాన్ని అందించడానికి కారణమైన విశ్వజ్యోతి సంస్థకు, అలాగే మద్దతు ఇచ్చిన నా కుటుంబానికి, గురువులకు, మరియు నా జ్యోతిష్య విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. రెండు దశాబ్దాలుగా నా జీవితం జ్యోతిష్య సేవకు అంకితం చేశానని, అనేక మందికి జాతక విశ్లేషణ, దోష పరిహారాలు, మరియు శాస్త్రాధారిత మార్గదర్శనాన్ని అందిస్తూ వచ్చామన్నారు. తదనంతరo ఈ నిస్వార్థ సేవను గుర్తించి, నాకు “జ్యోతిష్య జ్ఞాన రత్న పురస్కారం”ను అందజేయడం గర్వకారణoగా ఉందన్నారు. ఇది నా మార్గంలో మళ్లీ ఒక ప్రేరణగా నిలుస్తుందని, ఈ ప్రయాణంలో నా మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దైవజ్ఞ రత్న బహుగ్రంధ రచయిత పుచ్చ శ్రీనివాస రావు, జోతిష్య విశారద గ్రంథ రచయిత శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ గారి చేతులమీదుగా పురస్కారం అందించడం జరిగింది.

సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం ..

అంబేద్కర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు అభినందనలు , శుభాకాంక్షలు తెలిపినా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బేవినహాల్ సుధాకర్, క్లస్టర్ ఇంచార్జ్ ప్రహ్లాద రెడ్డి.

ఆదోని పట్టణంలో .. యోగాంధ్ర 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ర్యాలీ

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపాలిటీ అధికారులు.. V POWER NEWS   : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం నుండి పాత బ్రిడ్జి వరaకు ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ అలీ, ఆదేశానుసారంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ డిఈ రామ్మూర్తి, డిఈ గోపీనాథ్, డిఈ వెంకట చలపతి, ఏఈ జనార్ధన్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాంధ్ర 2025 పై ప్రజల భాగస్వామ్యం అవ్వాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హమ్యూనిటీ సచివాలయం సెక్రెటరీ పావని, సచివాలయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మునిసిపల్ రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!