తాజా వార్తలు

ఆకస్మికంగా .. ముస్తపల్లె రైతుసేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ సి .విష్ణు చరణ్

రైతులకు యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి… నంద్యాల  జిల్లా,  ఆత్మకూరు మండలంలోని రైతులకు యూరియా సమస్య తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆత్మకూరు మండలం, ముస్తపల్లె గ్రామంలోని రైతు సేవా కేంద్రం, వసుంధర ఎరువుల దుకాణంలో నిల్వ ఉంచిన యూరియా నిల్వలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సరిపడా యూరియా అందజేయడం జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు పంటకు సరిపడా యూరియా మాత్రమే వాడాలని యూరియాను అధిక మోతాదులో వాడి పంట దిగుబడి కోల్పోరాదన్నారు. ప్రభుత్వం ఏ సీజన్ కు సంబంధించి ఆ సీజన్లో రైతులకు సరిపడా యూరియా అందజేయడం జరుగుతుందని రైతులు రబి సీజన్ కు  సంబంధించి ముందుగానే యూరియా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతుల నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా యూరియా సక్రమంగా సరఫరా చేయాలని ఆర్ఎస్కే సిబ్బందికి సూచించారు.  ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హేమలత, రైతు సేవా కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

జనసేనా అధినేత జన్మదిన సందర్భంగా.. సెప్టెంబర్ 2 వరకు తేది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినా సంధ్యా విక్రమ్ కుమార్

V POWER NEWS  :  కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గంలో సెప్టెంబర్ రెండో తేదీన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ a పుట్టినరోజు సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి. బెలగల్ మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ చెప్పారు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది కాబట్టి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన సామాజిక సేవ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి జనసేన సైనికుడు ,కార్యకర్త, ప్రజలందరూ కలిసికట్టుగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని సంధ్య విక్రమ్ కుమార్ కోరారు. అలాగే రానున్న రోజులు జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు.

కోర్టు విచారణలో ఉన్న భూములను అమ్మడానికి ప్రయత్నిస్తున్న మాచాని రమేష్ పై చర్యలు తీసుకోవాలి.. రైతుల భూములు కాపాడాలి…జిల్లా కలెక్టర్ కు రైతులు వినతిపత్రం అందచేత… V POWER NEWS : కర్నూలు జిల్లా,గోనెగండ్ల మండలం,గంజిహళ్లి గ్రామంలో కోర్టు విచారణలో ఉన్న భూ ములను అమ్మడానికి ప్రయత్నిస్తున్న మాచాని రమేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతులు కురువ వెంకటేష్, బోయ ధనుంజయులు, గోవిందు, లాజర్, కాటన్న,అరవ రాజు, ఏ.రామాంజినేయులు ఏ. అంజనేయులు సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం, ప్రజా సమస్యల పరిష్కారవేదికలో జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోనెగండ్ల మండలం, గంజిహళ్ళి గ్రామంలో పరిధి లో 2008వ సంవత్సరంలో షేక్ అస్లాం బాషా అను వ్యక్తి ఫ్యాక్టరీ నిర్మిస్తామని,ఆ ఫ్యాక్టరీ లో ప్రతి కుటుంబానికి ఒకరికి ఉద్యోగవకాశం కల్పిస్తామని, అంతవరకు భూమిలో రైతులు సాగుచేసుకునేలా హక్కులు ఉంటాయని మోస పూరిత మాటలు చెప్పి రైతుల భూముల నుండి సుమారు 200ఎకరాలు,ఎకరా రూ.13వేలకు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆవేదన చెందారు. అంతేకాకుండా 2011వ సంవ త్సరంలో షేక్ అస్లాం బాషా, మాచాని రమేష్ కు ఎకరా రూ. 1.25లక్షలకు విక్రయించి నట్లు తెలిసిందన్నారు. సమాచారం తెలుసుకున్న రైతులు సంయుక్తంగా పత్తికొండ జూని యర్ సివిల్ జడ్జి కోర్ట్ లో OS/46/2021 ప్రకారంగా పిటిషన్ వేయడం జరిగింది. కాని కోర్టులో విచారణ కొనసాగుతున్న కూడా మాచాని రమేష్ భూములను అక్రమంగా విక్రయించేందుకు కుట్రలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు విచారణలో ఉన్న భూములను విక్రయిస్తే రైతుల కుటుంబ సభ్యులు జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కావున జిల్లా ఉన్నతాధికారులు స్పందించి,కోర్ట్ తీర్పు వచ్చేవరకు మా చాని రమేష్ పై రిజిస్ట్రేషన్, ఆన్లైన్, అడంగళ్ ను పెండింగ్ లో పెట్టాలన్నారు. ఈ ప్రకారం గా రైతుల భూములను కాపాడి,న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు.

ప్రశ్నించడమే మనిషి హక్కు .. సమాజం అభివృద్ధికి యువత కృషి చేయాలి : స్పెషల్ పోలీస్ డిఎస్పీ మహబూబ్ బాషా

సమాజంలో జరుగుతున్న లోపాలను ప్రశ్నించడమే మనిషి హక్కు.. కర్నూలు జిల్లా,కల్లూరు మండలం శుక్రవారం నాడు ఎంపీడిఓ కార్యాలయం బిసి స్టడీ సర్కిల్ లో RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఆజాద్,జిల్లా ఉపాధ్యక్షులు పరమేష్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశా నికి స్పెషల్ పోలీస్ డిఎస్పీ మహబూబ్ బాషా,ఎపి ఇంచార్జి జి.విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయ కులు విజయ్ కుమార్ హాజరయ్యారు.   ఈ సందర్బంగా స్పెషల్ పోలీస్ డిఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న లోపాల పట్ల ప్రశ్నించే స్థాయికి యువత అవగాహన పెంచాకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నించినపుడే సమస్యకు న్యాయం జరుగుతుంది అన్నారు.ప్రస్తుతం సమాజంలో ప్రశ్నించే గొంతు లేక ప్రజలు వివిధ రకాలుగా నష్టపోతున్నా రని, హింసించబడుతున్నారని ఆవేదన చెందారు.RGN హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ వారు ప్రజల తరపున నియమ నిబంధనలతో ప్రశ్నించే గొంతుగా మారి వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ సమాజ మార్పుకు కృషి చేయాలని సూచించారు.నేడు RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి బృందం తీసుకునే కార్యక్రమాలకు ఎల్లవేళలా తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు.ప్రజా సమస్యల పట్ల నిస్పక్షపాతంగా, నిస్వార్ధంగా పని చేసినపుడే సమాజ సేవకులుగా చిరంజీవులుగా సమాజంలో మన్ననలు పొందుతారని పేర్కొన్నారు. ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ మాట్లాడుతూ RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటి నిర్ణయాలకు రాష్ట్ర కమిటీ అండగా నిలుస్తుందన్నారు. నిబద్దతతో ప్రతి ఒక్కరు RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు వి.విజయ్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శి బి. ఆజాద్ లు మాట్లాడుతూ RGN హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ సంస్థ నియమ నిబంధనలతో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ,వారి సమస్యల పరిష్కారం కోసం,ప్రజలను చైతన్యం చేయడం కోసం ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనీ చెప్పారు.  ప్రతి ఒక్కరూ అసోసియేషన్ సంస్థ నిబంధనల మేరకు ఈకార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. అనంతరం డిఎస్పీ మహబూబ్ బాషా చేతుల మీదుగా కర్నూలు జిల్లా నూతన కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి.విజయకుమార్, చిరంజీవి, పాపన్న, నాగేంద్రుడు, పాణ్యం నియోజకవర్గం అధ్యక్షులు చిన్నస్వాములు, ఓర్వకల్ మండలం అధ్యక్షులు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు 

మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి .. ఆర్ జిఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ అసోసియేషన్ కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా,ఆస్పరి మండలం, చిగిలిలో ఆరుగురు చిన్నారుల మృతి చెందడంపై ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ & అసోసియేషన్ జిల్లా కమిటీ బృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ మేరకు గురువారం ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ & అసోసియేషన్  ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి.విజయ్ కుమార్, కర్నూలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలం సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఆజాద్ లు మాట్లాడుతూ ఐదవ తరగతి చదువుతున్న శశికుమార్,కిన్నెర సాయి,సాయి కిరణ్,భీమా,వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటికుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు.ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు.ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రభుత్వం మృతి చెందిన కుటుంబాలకు భరోసా కల్పించి,అర్ధకంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు కు.. రాఖీ కట్టిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి

V POWER NEWS : – రాఖీ పౌర్ణమి పురష్కరించుకొని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రాఖీ కట్టారు ఢిల్లీలోని పార్లమెంటు లో శుక్రవారం ఎంపీ నాగరాజు కు ఆమె రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా దేవుడి ఆశీస్సులతో శబరి ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని నాగరాజు ఆకాంక్షించారు.

యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలి – సీఈఓ సెట్కూరు డాక్టర్ కె.వేణుగోపాల్

నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలో  యుువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జ్యోతిభాపూలే గురుకుల పాఠశాల, డోన్ నందు  ‘హర్ ఘర్ తిరంగా’  (ప్రతి ఇంటి ఫై మువ్వన్నెల జండా) ప్రచార కార్యక్రమం లో భాగంగా సీఈఓ, సెట్కూరు డా!! కె. వేణుగోపాల్ గారు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా* ప్రతి భారతీయుడిని తమ ఇళ్లలోకి తిరంగను తీసుకువచ్చి, మన దేశ స్వాతంత్ర్య వేడుకలలో గర్వంగా ఎగురవేయమని, భారత జాతీయ జెండా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, మన దేశ ఐక్యతకు చిహ్నం అని తెలిపారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు అనుగుణంగా.  హర్ ఘర్ తిరంగా  ఆగష్టు 2 నుంచి 15 వ తేదీ వరకు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి దేశ రాజధాని వరకు నిర్వహిస్తున్నారని ,భారత జాతీయ జెండాతో ప్రతి పౌరుడు గౌరవ భావంతో ఉండాలని,  ఈ ప్రచారం ద్వారా లోతైన వ్యక్తిగత మరియు హృదయపూర్వక సంబంధంగా మార్చడానికి ప్రయత్నిస్తుందని, ప్రతి పౌరుడిలో లోతైన దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేస్తుందని మరియు యువత స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదని వారి ఆశయాలకు అనుగుగుణగా మహనీయుల అడుగుజాడల్లో నడవాలి అని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత పౌరులందరు కుల, జాతి, మతాలకు అతీతంగా సోదర భావనతో మెలగాలని, ఐక్యతతో దేశభివృద్ధికి తోడ్పాడాలని ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి అరుణ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులందరూ స్వాతంత్ర దినోత్సవాన్నీ పురస్కరించుకొని తమ ఇళ్లపై జాతీయ జండా ఎగురవేసి హారఘర్ తిరంగా కార్యక్రమంను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు  సూపరింటెండెంట్ శ్యాంబాబు, పాఠశాల అధ్యాపకులు  విద్యార్థినులు పాల్గొన్నారు https://youtu.be/mXOgl_1LmOk?si=hPtsxA0f4UuXlZS1

దండాలు దోరో… నాకు న్యాయం చేయండి ..

నష్టపరిహారం కోసం భర్త,కొడుకును కోల్పోయా .. ఇప్పటికైనా కనికరించండి. నా చావును కూడా చూడాలనుకుంటున్నారా.. వృద్దురాలి ఆవేదన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం, బ్రాహ్మణ పల్లె గ్రామానికి చెందిన వృద్దురాలు షేక్ మహబూబ్ బి ఆవేదన కర్నూలు కలెక్టరేట్ లోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సహకరించని వయసులో న్యాయం తమకు అందించాల్సిన నష్టపరిహారం కోసం తహసీల్దార్,ఆర్ డి ఓ,కలెక్టర్ కార్యాలయానికి కాళ్ళకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు పట్టించుకోకపొగా నానా దుర్భాషాలాడిన ఘటనతో తీవ్ర మనస్తాపనికి గురైంది. చివరిగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,గ్రీవెన్స్ లో ఆమె న్యాయం కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందచేసిన అనంతరం కన్నీటి పర్యంతం అయింది.వివరాలు ఇలా ఉన్నాయి…కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లెకు చెందిన షేక్ మహబూబ్ బి,భర్త పేరు ఖాసీం సాహెబ్ (లేట్)కి సంబందించిన సర్వే నంబర్ 121/ B4,B5లలో ఆమె భర్త ఖాసీం సాహెబ్,చిన్న ఖాసీం సాహెబ్ ఇరువురు కలిసి సంయుక్తంగా వారికీ ఉన్న 6.14 ఎకరాలలో గత 30ఏళ్ల నుండి వివిధ రకాల పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.అయితే 2020వ సంవత్సరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎపిఐఐసి కోసం చేపట్టిన భూ సేకరణలో భాగంగా వారికీ 6.14ఎకరాలకు నష్టపరిహారం ఇస్తామని అంగీకరిస్తూ నోటీసులు జారీచేశారు.దానికి అనుగుణంగా ఖాసీం సాహెబ్,చిన్న ఖాసీం సాహెబ్ లు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను అంగీకరిస్తూ అనుభవంలో ఉన్న తమ భూమిని ఓర్వకల్ మండల రెవిన్యూ అధికారికి వ్రాత పూర్వకంగా అప్పగించడం జరిగింది.ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఆర్.శివరాముడు,అప్పటి కర్నూలు జిల్లా రెవిన్యూ డివిజన్ అధికారికి పూర్తి సమాచారం అందచేయడం జరిగింది.ఆ సందర్బంగా ఆర్ డిఓ అధికారి సైతం తమకు సంబంధిత అనుభవంలో ఉన్న సర్వే నంబర్ లు 121/ బి4,బి5లకు నష్ట పరిహారం మంజూరైనట్లు నమ్మబలుకుతూ తమకు సమాచారం తెలియచేశారని పేర్కొన్నారు. అధికారులను గుడ్డిగా నమ్మిన తన భర్త, కుమారుడులు ఆర్ డిఓ కార్యాలయానికి తనను కూడా వెంటబెట్టుకుని, ఆర్డిఓకార్యాలయంను సంప్రదించి 6.14 ఎకరాలకు నష్టపరిహారం కోరినట్లు షేక్ మహబూబ్ బి చెప్పారు.దీంతో ఆర్డిఓ ప్రస్తుతం 5ఎకరాలకు ఇస్తాము,మరల మిగిలి ఉన్న 1.14ఎకరాలకు తదుపరి విడతలో ఇస్తామని చెప్పునట్లు షేక్ మహబూబ్ బి పేర్కొన్నారు.అయితే అప్పటికే నా కుమారుడికి పూర్తి స్థాయిలో అనారోగ్యంతో ఉన్నందువలన, మరోవైపు పొలం సాగు కొరకు చేసిన అప్పుల ఒత్తిడికి తాళలేక ఆర్ డిఓ చెప్పిన విధంగా అంగీకరించామని అన్నారు.కానిమాకు ఐదు ఎకరాలకు నష్టపరిహారం చెల్లించిన తదనంతరం 10రోజులకే,ఒక రాజకీయ నాయకుడి సిఫారస్ మేరకు ప్రభుత్వ నిబంధనలు దిక్కరించి, ఇతరులకు అదనంగా నష్ట పరిహారం చెల్లించారు.ఈ విషయం తెలుసుకున్న తాము ఆర్ డిఓ అధికారిని కలిసి కార్యాలయంలో విచారించగా వారు మాపై దుర్భాషాలాడుతూ,వారు తాము సమర్పించిన వినతులను తమ ముఖంపై విసిరివేస్తూ ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వం,ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అంటూ తమను భయబ్రాంతులకు గురిచేస్తూ, అవమాన పరచినట్లు ఆవేదన చెందారు.దీంతో తాము హ్యూమన్ రైట్స్ ను 2022, ఆగస్ట్,3వ తేదీన ఆశ్రయించడం జరిగిందని చెప్పారు.ఆ సమయంలో ప్రశ్నించిన హ్యూమన్ రైట్స్ కు ఆర్ డిఓ కార్యాలయం నుండి 2023,మార్చి,06వ తేదీన బాధితులు అర్జీ పెట్టుకుంటే… గతంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించిన విధంగా తమకు 50సెంట్లకు నష్టపరిహారం ఇస్తామని కౌంటర్ దాఖలు చేశారని అన్నారు.అదే సమయంలో తమ కుమారుడు చిన్న ఖాసీం సాహెబ్ అనారోగ్యంతో మృతి చెందాడు. అయినకూడా బాధలో ఉన్న తాము కుమారుడి మరణం గురించి పూర్తి సమాచారం ఇచ్చాము.అదే సమయంలో ప్రభుత్వం ఆదేశాలు ప్రకారంగా…వారిని, మాకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంజూరైనా ఉత్త (RG. G1/317/BRAHMANAPALLI/2021), DATE: 23/03/2022 ప్రకారం 6.14 ఎకరాలకు మొత్తంగా రూ.46.05.000 లక్షలకు గాను రూ.37.50.000 చెల్లించారు.అయితే న్యాయంగా మాకు మిగిలిన 1.14ఎకరాలకుగాను రూ.8.55.000లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.ఆ సమయంలో నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే 2025,జులై,20వ తేదీన అనారోగ్యంతో తన భర్త ఖాసీం సాహెబ్ ను సైతం కోల్పోయినట్లు చెప్పారు. అయితే ఇప్పటికైనా తనకు ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాను.ఈ నేపథ్యంలో 2025,జులై,09వ తేదీన కూడా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి తన పరిస్థితిని విన్నవించారు.ఆ సమయంలో జాయింట్ కలెక్టర్ సైతం ఫోన్ ద్వారా ప్రస్తుత ఆర్ డిఓ సందీప్ కుమార్ కు సమాచారం ఇచ్చి,పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.అప్పటికి సానుకూలంగా స్పందించిన ఆర్ డిఓ నష్టపరిహారం చెల్లించే చివరి సమయంలో గత ఆర్ డిఓ ఇవ్వలేని,నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడడం తాను పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతికి గురికావాల్సి వచ్చింది.ఈ వయసులో తాను కార్యాలయాల చుట్టూ తిరగలేని పరిస్థితి ఒకవైపు…కనీసం వయసుకు సైతం కనికరం చూపలేని ప్రభుత్వ యంత్రాంగంను చూస్తుంటే తనకు నవ్వాలో…ఏడవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను.ఏదిఏమైనా చివరి సారిగా తనకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ లో పిర్యాదు చేయడం జరిగింది.ఇందులో తమకు న్యాయం జరిగితే ఒకే…లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యం అంటూ కన్నీటిపర్యంత మయ్యారు.

యోగాతో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం

మనస్సును ప్రశాంతంగా ఉంచే శక్తి వంతమైన సాధనమే యోగా … తహశీల్దార్ లక్ష్మినారాయణ హాలహర్వి Vపవర్ న్యూస్ :- యోగా ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవిస్తారు. యోగా, యోగాంధ్ర వేడుకలో భాగంగా హాలహర్వి మండల పరిధిలోని పచ్ఛారపల్లి పాఠశాల నందు శనివారం ఉదయం పంచాయతీ సెక్రెటరీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ హాలహర్వి మండల తహాశీల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొని అయన ప్రసంగించారు. యోగా అనేది మన పూర్వీకులు అందించిన గొప్ప ఆస్తి అని ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడిని తగ్గించడానికి, అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందన్నారు. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. ఇప్పుడున్న కాలంలో ఎక్కువ పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యోగా చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగ ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు, యోగాంధ్ర కార్యక్రమంలో పాటలు పాడిన, బొమ్మలు గీసిన విద్యార్థులు దీపిక , పవిత్ర,ఊహా, విద్యార్థులకు యోగ సర్టిఫికెట్, బహుమతులను తహశీల్దార్ లక్ష్మినారాయణ,మండల క్లస్టర్ ఇంచార్జ్ ప్రహ్లాద రెడ్డి, అందజేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసి ఆసనాలు వేసి. శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచే శక్తివంతమైన సాధనమే యోగ విజయవంతం చేసినందుకు పేరు పేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. పచ్ఛారపల్లి జనార్ధన ఆలూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలియజేశారు.యోగా కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు,పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్, విఆర్ఓ సతీష్ కుమార్ గౌడ్,వెటర్నరీ అసిస్టెంట్ మల్లికార్జున, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, అంగన్వాడి ఆయా లక్ష్మి, ఆశా వర్కర్ రమిజాబి, పొదుపు విఓఏ సుధాకర్, పచ్ఛారపల్లి భగత్ సింగ్ యూత్ , నాగరాజు ,రంజాన్, పాండు, గాదిలింగ, ఈశ్వరప్ప, రమేష్,ఈరన్న, శివకుమార్,సురేంద్ర, మధు, బీమేష్ ,వినోద్,బాపురం బసవ, ఉపాధి హామీ పథకం వారు,పోదుపు లక్ష్మి మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు,యువతి యూవకులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ .. యోగాను అలవాటు చేసుకోవాలి … కర్నూలు పార్లమెంటు మెంబర్ బస్తిపాటి నాగరాజు

V POWER NEWS  : మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ నెల 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ప్రజలకు యోగ పై అవగాహన కలిపించేందుకు కర్నూలు రూరల్ మండలం పంచాలింగాల గ్రామంలోని తన స్వగృహం లో ఆయన యోగాసానాలు చేసారు. యోగా చేయడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుందని, యోగా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని ఎం.పి నాగరాజు తెలిపారు. 

error: Content is protected !!