తాజా వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ … కష్టాల్లో ఉన్న ప్రజలకు కొండంత అండగా నిలుస్తోంది  : నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్దిదారులకు రూ. 609,644 /- లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య . ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని, ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.   సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారుల వివరాలు : వీపనగండ్ల గ్రామం:- (1) జి వెంకటేశ్వర్ రెడ్డి, 86,870/-రూపాయలు, మిడుతూరు గ్రామం:-  (2) కె సత్యనారాయణ 48,333/- రూపాయలు (3) విద్యపోగు రవి  36,337/- రూపాయలు మరియు (4) కటకం సత్యనారాయణ గారికి 1,40000/- రూపాయలు సున్నం పల్లె గ్రామం:- (5) కమతం వెంకటేశ్వరమ్మ గారికి 44,223/-రూపాయలు, తలముడిపి గ్రామం:- (6) కె పెద్ద తిరుపతి  98,470/- రూపాయలు, రోల్లపాడు గ్రామం:- (7) ఉప్పరి బాల గుర్రప్ప కి 30,756/- రూపాయలు, చెరుకు చెర్ల గ్రామం:- (8) గద్దల మణెమ్మ కి 1,24,655/- రూపాయలు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను, గ్రామాలలో ఉన్న లబ్ధిదారులకు ఇంటి దగ్గరికే వెళ్లి పంపిణీ చేసిన. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య .  ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, వంగాల శివరామరెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, వడ్డే జయరాముడు, స్వామి రెడ్డి, నాగేంద్ర, సర్వోత్తమ్ రెడ్డి, పల్చని మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

మిషన్ శక్తి లో భాగంగా .. బేటి బచావో – బేటి పడావో అవగాహన కార్యక్రమం

రవీంద్ర ఇంగ్లీష్ మీడియo స్కూల్ విద్యార్థులకు మరియు సిబ్బందికి అవగాహన V POWER NEWS  KURNOOL  TOWN  : కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి పి విజయ గారి ఆధ్వర్యంలో 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో మిషన్ శక్తి లో భాగమైన బేటి బచావో బేటి పడావో అనే అంశం పైన రవీంద్ర ఇంగ్లీష్ మీడియo స్కూల్ విద్యార్థులకు మరియు సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది ఐ విజయ కుమారి వి జోష్ణ కిస్ వర్కర్స్ ఆర్ మౌన wwps,లక్ష్మి ANM  పాల్గొన్నారు.

ఆడపిల్లలను బ్రతికించు, ఆడపిల్లలను చదివించు ప్రాముఖ్యత పై అవగాహనా కార్యక్రమం

స్త్రీ శిశు సంక్షేమ శాఖ & సాధికారత అధికారిణి పి. విజయ ఆదేశాల మేరకుఓ ఎస్ సి సేవలు, 181,1098,1030,112 సైబర్ క్రైమ్ ప అవగాహన కార్యక్రమం. V POWER NEWS KURNOOL TOWN  : కర్నూలు మండలంలోని ఇందిరాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల ఏ క్యాంపు నందుస్త్రీ శిశు సంక్షేమ శాఖ సంకల్ప ప్రోగ్రాము లో పది రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు అనంతరం శనివారం నాడు ఇందిరాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల ఏ క్యాంపు నందు స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ ఆదేశాల మేరకు అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఆడపిల్లలను బ్రతికించు, ఆడపిల్లలను చదివించు అని ఆడపిల్లల పుట్టుక, చదువు యొక్క ప్రాముఖ్యతను మరియు లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం గురించి తెలియజేసారు. అలాగే ఏ క్యాంపు లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఆశ వాళ్లతో అవగాహనా కార్యక్రమంలో ఓ ఎస్ సి సేవలు, 181,1098,1030,112 సైబర్ క్రైమ్ గురించి తెలియజేసారు. కార్యక్రమం లో వన్ స్టాప్ సెంటర్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్ v. జోష్టనా, ఏ ఎస్ ఐ జి. శ్రీనివాసులు పాల్గొన్నారు.

APRSA ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

V power news  : కర్నూలు నగరంలో..  మంగళవారం నాడు కర్నూలు రూరల్ మండలము తహసీల్దారు టి.వి. రమేష్ బాబు  అధ్యక్షతన APRSA (Andhra Pradesh Revenue Servicess Association) కర్నూలు డివిజన్ వారు మాజీ కర్ణము (గ్రామ రెవిన్యూ మునిసిబ్) & కర్నూలు గ్రందాలయము మాజీ చైర్మన్ గంగాధర రెడ్డి సహకారముతో బుధవార పేటలోని సుశీల నేత్రాలయము డాక్టర్  సుధాకర్  వారి సిబ్బంది, కర్నూలు కొత్త బస్టాండ్ సమీపములోని మేడికోవర్ ఆసుపత్రి డాక్టర్లు మరియు వారి సిబ్బంది, కర్నూలు శకుంతల కళామందిర్ సమీపములోని ఎస్.జె హాస్పిటల్ డాక్టర్లు మరియు వారి సిబ్బంది Roja’s Speech & Rehabitation Center హాస్పిటల్ (వినికిడి సమస్యలు) డాక్టర్లు మరియు వారి సిబ్బందితో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించడము జరిగినది.  ఈ మెగా వ్యైదశిభిరం నకు ముఖ్య అతిధిగా కర్నూలు రెవిన్యూ డివిజన్ అధికారి K. సందీప్ కుమార్ వారు పాల్గొని, ప్రారంభం చేయడం జరిగినది. ఇందులో కర్నూలు రూరల్ తహసీల్దారు రమేష్ బాబు, APRSA  నాయకులు  సి.నాగరాజు, లక్ష్మి రాజు,  వి.రామాంజనేయులు,  వేణుగోపాల్ రావు, లోకేశ్వర రెడ్డి, వెంకట రాజు, కల్లూరు తహసీల్దారు కే.ఆంజనేయులు, సి.బెళగల్ తహసీల్దారు శ్రీమతి వెంకట లక్ష్మి, KRRC తహసీల్దారు కుమారస్వామి, రిటైర్డ్ తహసీల్దారు మల్లికార్జున స్వామి మరియు డిప్యూటీ తహసీల్దారు లు ఆర్. విష్ణు ప్రసాద్, పురుషోత్తముడు, జాకీర్ హుస్సేన్ తదితర అన్ని స్థాయిల రెవిన్యూ సిబ్బంది ఈ శిభిరం లో పాల్గొనడము జరిగినది. ఈ సందర్భంగా కంటి చూపుకు సంబంధించి – 170 మందికి, పంటికి (డెంటల్) సంబంధించి – 65 మందికి, ECG – 50 మందికి, వినికిడి సమస్యలు – 70 మందికి & BP, Sugar వ్యాధికి సంబంధించి -135 మందికి పరీక్షలు నిర్వహించడము జరిగినది. అలాగే ఇందులో వినికిడి సమస్యతో భాదపడుతున కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ఉద్యోగి ఐన శ్రీ అయ్యన్నకు ఉచితంగా వినికిడి యంత్రం ను కూడా Roja’s Speech & Rehabitation Hospital వారు అందజేస్తాము అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే కంటి చూపు లోపించిన 24 మంది ఉద్యోగులకు ఉచితముగా గ్రందాలయము మాజీ చైర్మన్  గంగాధర రెడ్డి కంటి అద్దాలు వచ్చే మంగళవారం నాడు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న  వ్యక్తులoదరూ రెవిన్యూ ఉద్యోగుల యొక్క వ్యయ ప్రయాసల గురించి ప్రసంగించారు. ఇలాంటి వైద్య శిబిరాలు ఇంకా ఎన్నో నిర్వహించాలని  APRSA  వి. రామాంజనేయులు అధ్యక్షులు పలువురు అభిప్రాయం వ్యక్తము చేశారు.                                                                                            

వన్ స్టాప్ సెంటర్లో .. 10 రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం

V POWER NEWS  KURNOOL  TOWN:    జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి పి. విజయ గారి ఆధ్వర్యంలో DWCW లో  భాగమైన వన్ స్టాప్ సెంటర్ ద్వారా 10 రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు   జిల్లా సూపెరవైజర్స్ మరియు రవీంద్ర డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ దగ్గర అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి లో ఉన్న హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఉమెన్స్, ఓఎస్సీ సేవలు,శక్తి నివాస్ మరియు శక్తి సదన్ మహిళ హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్ పాలసీ ల గురించి వివరించారు. కార్యక్రమం లో మిషన్ కోఆర్డినేటర్ బాలమణి, మేరీ స్వర్ణలత, సునీత, విజయకుమారి మరియు జోష్టనా ప్రియాంక పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించేలా కృషి చేయాలి..

సమస్యల పరిష్కారానికి ఆత్మ విశ్వాసంతో మహాదేవుణ్ణి ప్రార్టించుకోవాలి.. కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు, లక్ష్మీనారాయణ ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ V POWER NEWS’  KURNOOL TOWN :    సమస్యల పరిష్కారానికి ఆత్మ విశ్వాసంతో మహాదేవుణ్ణి ప్రార్టించుకోవాలని కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు సూచించారు.సోమవారం కర్నూలు నగరం,జిల్లా కలెక్టర్ కార్యాలయం, సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో పాత్రికేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయ వినాయకుణ్ణి ప్రతిష్టించి,నేటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆరవ రోజు పూజలకు కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.రమేష్ బాబు,ఉమ్మడి ఎపి టూరిజం అధికారి లక్ష్మి నారాయణ,సిటీ కేబుల్ మహేష్, శ్రీ చక్ర దిన పత్రిక ఎడిటర్ హరినాధ రెడ్డిలు దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా తహసీల్దార్ టి.రమేష్ బాబు మాట్లాడుతూ పాత్రికేయులు సైతం పర్యావరణం కాపాడుటలో కృషి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకున్ని ప్రతిష్టించడమే కాకుండా దాతల సహకారంతో ఉదయం, సాయంత్రం అల్పాహారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాలు జరపడం అభినందనీయం అని కొనియాడారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించేలా కృషి చేయాలనీ వారు పిలుపునిచ్చారు. అనంతరం వారికీ పాత్రికేయ ఉత్సవ కమిటీ బృందం శాలువా మోమేంటోలతో ఘనంగా సన్మానం చేశారు.తదనంతరం ఆల్ఫాహారం వడ్డించారు.ఈ కార్యక్రమం లో కమిటీ బృందం శ్రీనివాసులు, విద్యాసాగర్, మంజునాద్, రామకృష్ణ, జి.విజయ్ కుమార్,అవినాష్,మోహన్,వి. విజయ్ కుమార్, అంజి, కిషోర్, ఇతర పాత్రికేయులు,భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా .. రాజా వీధి శ్రీ వరసిద్ధి గణనాధుణి నిమజ్జనం

శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామిజి కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి సమక్షంలో .. అంగరంగ వైభవంగా గణనాధుణి నిమజ్జనం, భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ నంద్యాల జిల్లా,నందికొట్కూరు పట్టణంలోని రాజావిధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిమజ్జనం అంగరంగ వైభవంగా చేపట్టారు.ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు భాస్కర స్వామి మాట్లాడుతూ రాజావిధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మొదటి దినం నుండి 5వ రోజు నాడు వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. అదేవిదంగా నిమజ్జనం కార్యక్రమానికి సైతం వందలాది భక్తులకు అన్న ప్రసాదాలు ఎటువంటి లోటు లేకుండా చేయించామన్నారు.అలాగే అనేక పూజలు నిర్వహించి,స్వామివారి కృప దయను భక్తాదులకు అందించడంల శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామీజీ కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి అందించడం జరిగిందన్నారు.అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ్ మండపం వద్ద హోమం నిర్వహించి పూర్ణ ఆహుతి చేయించడం జరిగింది. దానితో నిమజ్జనం ఉత్సవం భక్తాదుల మధ్య నిమజ్జనానికి బయలుదేరిన రాజా వీధి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నిమజ్జనం చేసినట్లు శ్రీ దత్త ఉపాసకులు భాస్కర స్వామీజీ కపిలేశ్వరం దుర్గామాత దేవస్థానం పీఠాధిపతి తెలిపారు.

కర్నూలు ప్రజలందరూ..గణనాథుడి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలి : జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కర్నూలు సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ గణపతిని జిల్లా కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ,ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని కోరారు. అదే విధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయ ఉత్సవ గణపతి సమితి సభ్యులు కలెక్టర్ గారికి సన్మానం చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కె.జయమ్మ, దేవకాంత్, వడ్డే మోహన్ పాత్రికేయ ఉత్సవ సమితి నాయకులు మంజునాథ్ యాదవ్, రామకృష్ణ, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు, శ్రీనాథ్ రెడ్డి, అవినాష్ శెట్టి, హరి కృష్ణ, మల్లికార్జున, గంగాధర్, ఇస్మాయిల్, ఆసిఫ్, రాఘవేంద్ర, మధు, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణపల్లి .. కానుగుల రాజారావుకు న్యాయం చేయాలి :

 177/C సర్వే నెంబర్ పై  .. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి .. ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ V POWER NEWS: కర్నూలు ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కానుగుల రాజారావుకు న్యాయం చేయాలనీ ఆర్జీఎన్ హ్యూమన్ aరైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ అధికారులను కోరారు. గురువారం ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్,ఉపాధ్యక్షులు పరమేష్ లతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి బాధితుడు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలనీ కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలోని 177/C సర్వే నెంబర్లులో ఐదు ఎకరాల భూమిని కానుగుల సత్యరాజు కుటుంబ సభ్యులు రెండు తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వారసత్వంగా కానుగుల రాజారావు సైతం భూమిలో అనుభవంలో ఉన్నాడు. అయితే ఎపిఐఐసి వారు సర్వే రిపోర్ట్ లో మండల రెవెన్యూ, రెవెన్యూ డివిజన్ అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారం ద్వారా బాధితుడికి అన్యాయం జరిగిందని చెప్పారు. వారి రిపోర్ట్ ఆధారంగా ఎపిఐఐసి వారు ఎలాంటి విచారణ చేపట్టకుండానే బాధితుడు సాగు చేసుకుంటున్న భూమిని స్వాదినం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతుంది అని పేర్కొన్నారు. భూమిలోకి రైతు కానుగుల రాజారావును భూమి సాగుచేయకుండా భయాందోళనకు గురిచేయడం బాధాకరమని ఆవేదన చెందారు. బాధితుడు కానుగుల రాజారావు న్యాయం కోసం జిల్లా అధికారులు, డివిజన్ మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అనేక దపాలుగా ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడం సరైందికాదన్నారు.కావున ఇప్పటికైనా బాధితుల సమస్యపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రస్తుతం APIIC ZO కి బాధితులను మానవతా దృక్పధం తో 2014-2015 సంవత్సరం భూసర్వేలో జరిగిన అవకతవకలను గుర్తించి, బాధితుడికి తగిన నష్టపరిహారం అందించడంతోపాటు,బాధితుడిని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా తగిన న్యాయం చేయాలనీ,లేనిపక్షంలో బాధితుడి తరుపున ఓర్వకల్ మండల రైతులను చైతన్యం చేసి ఆర్జియన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని వారు తెలిపారు.

నంద్యాల జిల్లాలో  .. పరిశ్రమల ఏర్పాటుకు చక్కని అవకాశాలు .. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

వర్కింగ్ క్యాపిటల్ ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం .. సులభతర ప్రభుత్వ అనుమతులకు త్వరితగతిన చర్యలు : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. అనంతరం మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై యువ పారిశ్రామికవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు చేయూతను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటుందన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే పెట్టుబడి సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి కూడా సులభతరంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం హార్టికల్చర్, పసుపు, సుగంధ ద్రవ్యాలు, పూలు, పండ్ల మొక్కల పెంపకం ఎక్కువ శాతం చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారుగా 33 శాతం అటవీ ప్రాంతం ఉండగా, 1/3 వంతూ సాగు భూమి ఉండగా, అందులో ఎక్కువ శాతం వరి, జొన్న తదితర పంటలను పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల సోనా బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. అదే విధంగా పశు సంపద కూడా జిల్లాలో సమృద్ధిగా ఉందన్నారు. జిల్లాలోని బనగానపల్లె, డోన్ ప్రాంతాల్లో 90 శాతం సున్నపు రాయి పరిశ్రమలతో పాటు 10 శాతం ఇనుప ఖనిజం లవణాలు ఉండడం వల్ల మైనింగ్ కార్యకలాపాలు నిర్వహణకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి పెరుగుదలకు గాను వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా 42 శాతం, సేవా రంగాలకు 39 శాతం, పరిశ్రమల పరంగా 19 శాతం ద్వారా సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. సదరు సంస్థల ఏర్పాటుకు బ్యాంకర్స్ వైపు నుండి కూడా పూర్తి సహకారం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిఎం ఎస్.మహబూబ్ బాషా, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, కార్మిక శాఖ సహాయక కమీషనర్ బషీర్రునిస్సా బేగం, కాలుష్య నియంత్రణ సంస్థ ఈఈ కిషోర్ రెడ్డి, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!