ఆంధ్ర ప్రదేశ్

గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి …. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్

V POWER NEWS .. :    నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాల్లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం బనగానపల్లె మండలం, నందివర్గం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డుల్లో వున్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. చేపట్టిన సర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ కరెక్షన్స్‌, మ్యుటేషన్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌ సంబంధిత దరఖాస్తులను కూడా దరఖాస్తులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తాసిల్దార్, సర్వే అధికారులు, గ్రామ రైతులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ పాత్రికేయుడు జోసెఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం .. నంద్యాల APWJF జిల్లా నాయకుడు పరామర్శించినా మౌలాలి

V POWER NEWS  … ATMAKUR :  ఆత్మకూరు పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రజాశక్తి సీనియర్ పాత్రికేయుడు జోసఫ్ చంద్రశేఖర్ కు కాలు చిటికెన వేలు విరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే మంగళవారం జోసఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం కొనసాగడంతో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నాయకులు మౌలాలి హాస్పిటల్ వెళ్లి ఆత్మకూరు ప్రజాశక్తి విలేఖరి జోసెఫ్ చంద్రశేఖర్ ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు

మహిళా దినోత్సవం వారోత్సవాలు విజయవంతం చేయండి – ఐసిడిఎస్ అధికారి పీ.నిర్మల

 V POWER NEWS  : కర్నూల్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారోత్సవాలు మార్చ్ 1నుండి 8వరకు మహిళా హక్కులు,సమాన వేతనం, పనిలో గౌరవం ఉండాలని మరియు ఈరోజు కార్యక్రమం లో బాల్యవివాహలకు వ్యతిరేకంగా ఆయా మత పెద్దలతో మరియు మహిళలతో కాండిల్స్ వెలిగించుకొని సంతోషనగర్ నుండి గీతముఖర్జీ నగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని p. నిర్మల, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ p. మేరీస్వర్ణలత, WASI G. లలితమ్మ osc సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్, మహిళలు పాల్గొన్నారు.

పసికందుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్ రాకేష్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలి — PDSU-PYL సంఘాల డిమాండ్.

డబ్బులు దండుకొని వైద్యం చేయకుండా పసికందు మృతికి కారణమైన డాక్టర్ రాకేష్ రెడ్డి తక్షణమే అరెస్టు చేయాలి. …. లేనిపక్షంలో పిడిఎస్యు-పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో మధు చిన్నపిల్ల హాస్పిటల్ ఎదుట ప్రత్యక్ష ఆందోళన సిద్ధం అవుతాయo ….   V POWER NEWS   : నంద్యాల పట్టణంలో మధు చిన్న పిల్లల ఆస్పత్రిలో వైద్యం వికటించి పసికందు మృతి కారకులైన డాక్టర్లను కఠినంగా శిక్షించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు S.M.D.రఫీ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసికందు మృతి సంఘటన పైన సమగ్ర విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈరోజు జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న హాస్పటలకు ఎటువంటి పర్మిషన్ లేకుండా డబ్బే ధ్యేయంగా నడుపుతున్న హాస్పిటల్ పైన DMHO వత్తాసుపలుకుతున్నారని వారు ఆరోపణ చేశారు. అయితే నంద్యాల పట్టణంలో మధు చిన్న పిల్లల హాస్పిటల్లో ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమని గత 21 రోజులుగా వైద్యం అందిస్తున్నామని నటిస్తూ దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఒక పసికందు మృతికి కారణమైనటువంటి మధు చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ రాకేష్ రెడ్డి ని తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే నంద్యాల పట్టణంలో రోజుకు హాస్పిటల్ పూటకు ఒక హాస్పిటల్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయంటే ప్రధాన కారణం జిల్లా వైద్యశాఖ అధికారులే అని ఆరోపించారు ఎందుకంటే కనీసం మౌలిక సదుపాయం లేకుండా పార్కింగ్ స్థలం లేకుండా ఫైర్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత కలిగినటువంటి డాక్టర్లు లేకుండా వైద్య చదువును చదువుకున్నటువంటి వాళ్ళు కాకుండా వైద్య విద్యను కొని డాక్టర్లుగా పొందినటువంటి డాక్టర్లు ఉండడం ఇటువంటి అంశాలపైన ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇష్టారాజ్యంగా జిల్లా వైద్య శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడమే ప్రధాన కారణమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి నంద్యాల పట్టణంలోని మధు చిన్నపిల్లల హాస్పిటల్ లో పసికందు మృతి పై సమగ్ర విచారణ జరిపించి డాక్టర్ రాకేష్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేసి హాస్పిటల్లో సీడ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాకాకుండా ఈ సమస్యను తప్పుదో పట్టించేందుకు డిఎంహెచ్ఓ పై స్థాయి అధికారులు ప్రయత్నం చేసి డాక్టర్ రాకేష్ దగ్గర నుండి మూడు పూలు తీసుకొని ఆ పసికందు మృతి పైన ఎటువంటి విచారణ చేయకపోతే పిడిఎస్యు పి వై ఎల్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో దందా కొనసాగుతున్నప్పటికీ, విచ్చలవిడిగా ఓ పిల్ల పేరుతో వివిధ రకాల టెస్టుల పేరుతో స్కానింగ్ లో పేరుతో డబ్బులు వసూలు చేస్తు పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ లో పైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నినెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి డిఎంహెచ్ఓ పైన జిల్లా వైద్యశాఖ అధికారుల పైన విచారణ చేపట్టి ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారి రంగ ప్రవేశం చేసి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి నిలువు దోపిడీ పైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రైవేట్ డాక్టర్లపైన ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తక్షణమే రాకేష్ రెడ్డి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి హాస్పిటల్లో సీజ్ చేయాలి రాకేష్ రెడ్డి అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా వార్షిక బడ్జెట్ ఉంది .. ఎమ్మెల్యే గిత్త జయసూర్య

V POWER NEWS :    2025 – 26 ఆర్థిక సంవత్సరానికిగాను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ఉందని, అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య. https://youtu.be/v25g61Yoj80?si=S3I-TXV5H8ZBU2kJ

కేంద్ర మంత్రులు కుమార స్వామి, సోమన్నలను కలిసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

 V POWER NEWS  : కర్నూలు జిల్లా మంత్రాలయంలో కేంద్ర భారీ పరిaశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నలను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.. రాఘవేంద్ర స్వామి గురు వైభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రులను పధ్బనాబం అతిథి గృహంలో విరి విరిగా కలిసిన ఎం.పి వారికి, శాలువాలతో సత్కరించి పూల మొక్కలను అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రులను కోరారు.. https://youtu.be/aUkaW3WEDfw?si=0sSYFJqevEgcjsVS

పోలీస్ స్టేషన్ ఆశ్రయించే .. బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

నేరా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. … రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. – డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలి – కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ V POWER NEWS .. : నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో శుక్రవారం నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసులపై ఆరా తీశారు. కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. గ్రేవ్ కేసులు, యూఐ కేసులు, మర్డర్, రోడ్డు ప్రమాదాలు, ఫోక్సో కేసులు, మిస్సింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో పాటు పోలీసు సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు లైసెన్స్ లు, హెల్మెట్ లు కలిగి ఉండాలన్నారు. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడూ పెండింగ్ కేసుల వివరాలను టెలికాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకుంటామ న్నారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఏర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు జె. బాబు ప్రసాద్, కె. శ్రీనివాసాచారి, హేమలత, భాస్కర్ రావు, శిక్షణ డీఎస్పీ ఉష శ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

మహాశివరాత్రి శుభ సందర్భంగా శివ దీక్ష స్వాములకు …. అన్నపూర్ణ దేవి గృహస్థాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు … అంతిరెడ్డి అరవింద రెడ్డి (బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల) శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి శుభ సందర్భంగా శివ దీక్ష స్వాములకు మరియు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బుధవారం నాడు శ్రీశ్రీశ్రీ తిరుపతి నాయన ఆరాధన కార్యక్రమం శుభ సందర్భంగా, శివోహం టెంపుల్ ట్రస్ట్ ఈ మహత్తర కార్యక్రమానికి అదేవిధంగా స్వామి అమ్మవార్ల భక్తులకు మరియు శివ స్వాములకు సేద తీర్చుకొనుటకు వసతులు, నీటి వసతులు, అన్న ప్రసాద వితరణ పూర్తిగా ఉచితంగా సంపూర్ణంగా జరిగినది. ఈ మహత్తర కార్యక్రమం వేల మంది శివ దీక్ష స్వాములు పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి …

డిమాండ్ చేసినా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్   నంద్యాల జిల్లా “Vపవర్  న్యూస్ :  రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్.యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం నాడు మంగళగిరి లోని విద్యా భవన్ నందు పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలైన నారాయణ భాష్యం శ్రీ చైతన్య ఆక్స్ఫర్డ్ రవీంద్ర కేకేఆర్ వంటి మరియు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు 2025 -26 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించారని అన్నారు. కార్పొరేట్ సంస్థల వారు బహిరంగంగా కరపత్రాలు, ఫ్లెక్సీలు వేసి అడ్మిషన్ల కొరకు ఎలక్షన్ ప్రచారం రీతిలో కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దిక్రీడో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ,ఇంటర్నేషనల్ స్కూల్, అని ప్రచారం నిర్వహిస్తూ ఐఐటి త్రిబుల్ ఐటీ ఫౌండేషన్ లాంటి కోర్సులు ఎల్కేజీ నుండే ప్రారంభిస్తున్నామని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఆర్థికమే ధ్యేయంగా పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా సరైనటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించి, చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల పేర్లతో పిఆర్ఓ లను ,ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే ముందస్తు అక్రమ అడ్మిషన్ ఫీజులతో పాటు,స్పెషల్ ఫీజు,పుస్తకాల ఫీజులని విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పాఠశాలలో ఉదృతమైన ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులుబి.సిద్ధు, కె.నాగరాజు,రూపాశంకర్, శ్రీను,మణి, భానుప్రసాద్ పాల్గొన్నారు.

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు …… తండోపతండాలుగా శివనామ స్మరణతో కైలాసద్వారం నుంచి శ్రీశైలానికి లక్షల సంఖ్యలో పాదయాత్ర ద్వారా శివ భక్తులు

భక్తుల అడుగులన్ని శ్రీశైలం వైపే .. నల్లమల అడవుల్లో మారుమ్రోగుతున్నా శివనామ స్మరణం. .. పాదయాత్రతో వచ్చే భక్తులకు … దేవస్థానం మరియు జిల్లా అధికారులు కైలాసద్వారం, హటకేశ్వరం వద్ద వసతులు ఏర్పాట్లు. .. నంద్యాల జిల్లా శ్రీశైలం అడవులు శివనామ స్మరణతో మారు మ్రోగుతున్నాయి శివస్వాములు సాధారణ భక్తుల అడుగులన్ని శ్రీశైలం కొండలవైపు పరుగెడుతున్నాయి. తండోపతండాలుగా మహాశివరాత్రి పర్వదినానికి తరలి వెళ్లాలని భక్తులు భక్తి శ్రద్ధలతో ఎండను సైతం లెక్క చేయకుండా వృద్దులు చిన్నపిల్లల సైతం పాదయాత్రతొ శివయ్య సన్నిధికి చేరుకుంటున్నారు అడుగులన్ని శ్రీశైలం వైపే నల్లమల అడవులు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి ఎండను సైతం లెక్కచేయకుండా కొండలు కోనాలు దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు వెంకటాపురం నుంచి నల్లమల అడవులలొ పాదయాత్రతొ ఆకలి దప్పికను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు నడక మార్గంలో అక్కడక్కడ చెట్ల వద్ద చేదతీరుతూ మెట్ల మార్గంలో శ్రీశైలం సమీపంలోని కైలాస ద్వారం వద్దకు చేరుకుని శివలింగానికి తల తాకించి కొరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శివయ్యకు మొక్కలు తీర్చుకుంటున్నారు. శ్రీశైం మల్లన్న భక్తులు కిలోమీటర్ల మేర కొండా కోనలు దాటుకుంటూ శ్రీశైలం సమీపంలోని కైలాసద్వారం వద్ద సేదతీరుతూ పాదయాత్ర కష్టాలన్ని శ్రీశైల మల్లన్నపై ఉంచి చేదతీరుతున్నారు పాదయాత్రతో వచ్చే భక్తులకు దేవస్థానంతోపాటు జిల్లా అధికారులు కైలాసద్వారం, హటకేశ్వరం వద్ద వసతులు ఏర్పాట్లు చేశారు.  దట్టమైన అటవీప్రాంతంలో నడక సాగించి బారీ సెడ్లలో కొంతసేపు భక్తులు సేదతీరుతూ శివయ్యకు మొక్కులు తీర్చుకుంటున్నారు పాదయాత్ర చేసి అలసట చెందిన భక్తులకు దేవస్థానం వైద్యం కోసం అటవీప్రాంతంలో సుమారు 10 చోట్ల వైద్యశిబిరాలు అలానే స్వచ్చంద సేవకులు కాళ్ల నొప్పులకు ఒల్లు నొప్పులకు కాళ్లు బొబ్బలకు మెడిసిన్ టాబ్లెట్లు ఆయిట్ మెంట్లు ఇచ్చి భక్తుల సేవలొ తరిస్తున్నారు పాదయాత్ర చేసి అలసిపోయి వచ్చిన భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్చంద సేవా కర్తలు భక్తుల కోసం ఉచ్చిత బోజనాలు ఏర్పాటు చేశారు ఆకలితో వచ్చిన భక్తులకు బోజనాలు ఏర్పాటు చేయడంతో మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాలి బాటలో వచ్చే భక్తుల కోసం శ్రీశైల దేవస్దానం అధికారులు మార్గమధ్యంలో మంచినీటి ట్యాంక్ లు కైలాసద్వారం వద్ద ఏర్పాటు చేశారు భక్తుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి ట్యాంకర్లు నిరంతరం 10 ట్యాంకర్స్ తో నిటి సరఫర చేస్తున్నారు. శ్రీశైల మల్లన్న భక్తుల పాదయాత్ర నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురానికి చేరుకొని అక్కడినుండి అటవీ మార్గం ద్వారా కోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి నాగులుటి వీరభద్ర స్వామి ఆలయం దామర్లకుంట పెద్ద చెరువు మఠం బావి ధూమును కొలను కైలాస ద్వారం మీదుగా సుమారు 40 కిలోమీటర్లు నల్లమల్ల అడవులను దాటుకుంటూ శ్రీశైలాన్ని పాదయాత్ర భక్తులు చేరుకుంటారు అయితే పాదయాత్ర భక్తులకు నాగులుటి వద్ద ఆహారము దామర్లకుంట,పెద్ద చెరువు వద్ద నీటి వసతి,ఆహార వసతి తిరిగి మఠంభావిది,భీమునికొలను,కైలాసద్వారం వద్ద నీటి వసతి అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీశైల మల్లయ్య శంభో శంకర అంటూ శివనామ స్మరణతో కైలాసద్వారం నుంచి శ్రీశైలానికి లక్షల సంఖ్యలో శివ భక్తులు సాధారణ భక్తులు తండోపతండాలుగా రోడ్లపై పాదయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు మహాశివరాత్రి ఘడియలు దగ్గర పడడంతో లక్షలాదిగా భక్తులు శ్రీశైలం చేరుకుని స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొని దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలర్పిస్తున్నారు.

error: Content is protected !!