ఆంధ్ర ప్రదేశ్

టిడిపి నేతల దౌర్జన్యం మహిళ ఆత్మహత్యాయత్నం

– దేవిబెట్ట లో స్థల వివాదం. – అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది  V POWER NEWS :  ఎమ్మిగనూరు మండల పరిధిలోని దేవి బెట్ట గ్రామంలో ఒక మహిళకు సంబంధించిన స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు సదరు మహిళలకు చెందిన మూడు సెంట్ల భూమి ని టీడీపీ నాయకులు అక్రమించుకొని బెదిరిస్తున్నారని దేవి బెట్ట గ్రామానికి సావిత్రి అనే (42) అనే మహిళ తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని పురుగులమందు తాగి ఆత్మహత్య చేసింది అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు అంజి అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించాడని మహిళ ఆరోపణ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చెయ్యాలని బాధితురాలు పోలీసులకు మొరపెట్టుకుంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలని తీసుకుని విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని గ్రామీణ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

ఆదోని చందన షాపింగ్ మాల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి …

V POWER NEWS  : ఆదోని పట్టణంలో చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులకు గురి చేసిన షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, తదితరులు సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వీరు మాట్లాడుతూ ఈరోజు చందన షాపింగ్ మాల్ ప్రారంభం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రధాన రోడ్డు మొత్తం పూర్తిగా రాకపోకలను పోలీసు వారు అధికారులు దగ్గరుండి బంద్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు తెలిపారు. మండుటెండలో సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్ సమస్యతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దగ్గర నుండి ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు రిలయన్స్ ట్రెండ్ వరకు ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు, నరకయాతన పడ్డారని వారు తెలిపారు. ఆదోని పట్టణానికి షాపింగ్ మాల్ లాంటివి రావడం మంచిదే అయినప్పటికీ ఈ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని వారు తెలిపారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను ఇబ్బందులు గురిచేసిన చందన షాపింగ్ మాల్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

పులికనుమ రిజర్వాయర్ లో వ్యక్తి గల్లంతు..

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు. .. కొనసాగుతున్న సహాయక చర్యలు. … లభించని ఆచూకీ..! మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన పెద్దకడుబూరు మండల పరిధిలోని పులికనుమ గ్రామానికి చెందిన (60) గొర్రెల నాగేంద్ర ఇవాళ ఉదయం గ్రామ శివారులో ఉన్న పులికనుమా రిజర్వాయర్ లో చేపలు పట్టేందుకు రిజర్వాయర్ కు వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.. ఆయన కనిపించకపోవడంతో గల్లంతయారేమోననే అనుమానంతో అధికారులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు..ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నా … నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి.

V POWER  NEWS   :    నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం సృస్టే లేదన్నారు. అలాంటి గొప్ప మానవత్వం ఉన్న స్త్రీ మూర్తిని స్మరించుకుంటూ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. కుటుంబం కోసం ప్రేమను పంచుతూ కష్టాలను అధిగమిస్తూ కుటుంబంతో పాటు అన్ని రంగాలలో ముందడుగు వేసేది మహిళేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నత స్థానం కల్పించి వారికి చేయూతనిచ్చేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో ఆయా ప్రదేశాలలో దేవతలు ఉంటారన్న విషయాన్ని ఎంపీ వివరించారు. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన దేశం మన భారతదేశమన్నారు. పురుషులతో సమానంగా ఉండాలని అన్నింటిలో సమానత్వ అవకాశాలు చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించి ఆడపిల్లలను ఆడ పులిగా పెంచాలని ఎంపీ కోరారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. 

తుంగభద్ర నదిలో ఆంధ్ర గట్టు వైపు కర్ణాటక కన్ను పడింది.. అక్రమంగా ఇసుక తరలింపు … ట్రాక్టర్ల తో ఇతర ప్రాంతాలకు తరలింపు.. పథకాలకు తూట్లు పొడుస్తున్న మాఫియా..!

V POWER NEWS :  మంత్రాలయం రూరల్/కోసిగి : కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటిస్తే..కొంతమంది అక్రమార్కులు దానికి తూట్లు పొడుస్తున్నారు..కోసిగి మండల పరిధిలోని అగసనూరు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో ఆంధ్ర గడ్డ వైపు కర్ణాటక రాష్ట్రంలో తమాపూర్ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఇసుక మాఫియా రెచ్చిపోతుంది..పదుల సంఖ్యలలో ట్రాక్టర్ లతో యదేచ్ఛగా ఇసుకను నిలువ చేస్తూ పక్క రాష్ట్రానికి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటుంది.అగసనూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఇలా అక్రమంగా ఇసుక తరలిస్తే రాబోయే తరానికి ఇసుక అనేది ఉండకుండా పోతుందని వారిని ఆపడానికి ట్రై చేస్తున్నా అవడం లేదు..అక్రమంగా ఇసుకను పట్టపగలే గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో గట్టు వద్ద గుట్టాలుగా నిల్వచేస్తున్నారు..అనంతరం రాత్రి వేళలో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఒక్క ట్రిప్పు రూ.30 వేల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం..ఇప్పటికైనా రెవెన్యూ,పోలీస్ అధికారులు ఇసుక అక్రమ నిల్వలను గుర్తించి మాఫియా పై చర్యులుa తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..

మంత్రాలయంలో అత్యంత వైభవంగా  .. రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం. 

శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించినా … సుబుధేంద్ర తీర్థ స్వామీజీ. V POWER  NEWS :   మంత్రాలయం లో శ్రీ రాఘవేంద్ర స్వామి 430వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా మంత్రాలయంలోని శ్రీ మఠంలో స్వామివారి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీ రాయర బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించి, శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ రాయర రథోత్సవాన్ని స్వామిజీ ఘనంగా ప్రారంభించారు. అనంతరం స్వామిజీ దీప ప్రజ్వలనం చేసి “నాద హారం” కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా, ప్రఖ్యాత సంగీత కళాకారులు తమ కళ రూపాన్ని, సేవను భక్తితో స్వామివారికి సమర్పించారు.ఈ పవిత్రమైన మరియు గొప్ప కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రాయల ఉత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.  

కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.

మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి. .. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. V POWER NEWS  …  KURNOOL  :  పోలీసు అధికారులు, పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లా కేంద్రంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్ ను ఎస్పీ బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీజ్ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలన్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా సమస్యల పట్ల పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు స్టేషన్ లో  రికార్డులను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్, కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ మన్మధ విజయ్ తదితరులు ఉన్నారు.

గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి …. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్

V POWER NEWS .. :    నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతుల పొలాల్లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం బనగానపల్లె మండలం, నందివర్గం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలాల్లో జరుగుతున్న రీ సర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్‌ ట్రూథింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డుల్లో వున్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. చేపట్టిన సర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ కరెక్షన్స్‌, మ్యుటేషన్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌ సంబంధిత దరఖాస్తులను కూడా దరఖాస్తులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తాసిల్దార్, సర్వే అధికారులు, గ్రామ రైతులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ పాత్రికేయుడు జోసెఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం .. నంద్యాల APWJF జిల్లా నాయకుడు పరామర్శించినా మౌలాలి

V POWER NEWS  … ATMAKUR :  ఆత్మకూరు పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రజాశక్తి సీనియర్ పాత్రికేయుడు జోసఫ్ చంద్రశేఖర్ కు కాలు చిటికెన వేలు విరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే మంగళవారం జోసఫ్ చంద్రశేఖర్ కు ఆపరేషన్ విజయవంతం కొనసాగడంతో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నాయకులు మౌలాలి హాస్పిటల్ వెళ్లి ఆత్మకూరు ప్రజాశక్తి విలేఖరి జోసెఫ్ చంద్రశేఖర్ ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు

మహిళా దినోత్సవం వారోత్సవాలు విజయవంతం చేయండి – ఐసిడిఎస్ అధికారి పీ.నిర్మల

 V POWER NEWS  : కర్నూల్ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారోత్సవాలు మార్చ్ 1నుండి 8వరకు మహిళా హక్కులు,సమాన వేతనం, పనిలో గౌరవం ఉండాలని మరియు ఈరోజు కార్యక్రమం లో బాల్యవివాహలకు వ్యతిరేకంగా ఆయా మత పెద్దలతో మరియు మహిళలతో కాండిల్స్ వెలిగించుకొని సంతోషనగర్ నుండి గీతముఖర్జీ నగర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని p. నిర్మల, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ p. మేరీస్వర్ణలత, WASI G. లలితమ్మ osc సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్, మహిళలు పాల్గొన్నారు.

error: Content is protected !!