ఆంధ్ర ప్రదేశ్

చాగలమర్రి వాసులకు … ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రుద్రవరంలో అరుదైన గౌరవం

• రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు ఘన సన్మానం. V POWER NEWS :   చాగలమర్రి , రుద్రవరం గ్రామంలో దుర్వి చెంచు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు చాగలమర్రి గ్రామం నుంచి రషీద్ ఆర్ట్స్ అధినేతకు రషీద్ కు అరుదైన గౌరవ సన్మానం లభించింది.రుద్రవరం దుర్వి చెంచు లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ వేసినందుకు రషీద్ ఆర్ట్స్ అధినేత రషీద్ మరియు వారి బృందానికి శాలువ కప్పి , పూల మాల వేసి షీల్డ్ ఇచ్చి సన్మానించడం జరిగింది.రషీద్ మాట్లాడుతూ ఇంతటి గౌరవం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు.చాగలమర్రి ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు చాగలమర్రి వాసులకు మరెన్నో రావాలని మనసారా కోరుతున్నాము అని తెలిపారు.

చౌక దుకాణాల్లోని రేషన్ సరుకులు పంపిణీ ..

ఇంటింటికి రేషన్ పంపిణీ రద్దు… హలహర్వి V పవర్ న్యూస్ మే24: జూన్ 01 తేదీన నుండి రేషన్ కార్డు లబ్దిదారులకు డీలర్లు చౌక దుకాణాల్లోని నిత్యం అవసరం సరుకులు బియ్యం,చెక్కెర, కందిపపులు పంపిణీ చేయాలని డిప్యూటీ తహశీల్దార్ జీ లక్ష్మీ పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం హాలహర్వి మండలంలో తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహాశీల్దార్ జి లక్ష్మి ఎండియూ, డిల్లరతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటింటి రేషన్ బియ్యం సరఫరా ఎండీయూ వాహనం రద్దు పరచడమైనదిని తెలిపారు.జూన్ 01తేది నుండి 15 వరకు చౌక దుకాణాల్లో రేషన్ అందించాలని డీలర్లకు సూచించారు.ప్రతి నెల ఒకటవ తేదీన చౌక దుకాణాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో రేషన్ అందించాలని కోరారు.65 సంవత్సరం పైబడిన వారికి,వికలాంగులకు ఇంటి దగ్గర నిత్యం అవసరం సరుకులు అందించాలని తెలిపారు.రేషన్ కార్డు దారులు గుంపు గుంపులు లేకుండా క్రమ పద్ధతిలోనే పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.ఎండియు ఆపరేటర్లు ఈ పస్ మిషన్, ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మిషన్,తదితర వాటిని డీలర్ కు సమర్పించాలని అన్నారు.కార్డుదారులకు రేషన్ పంపిణీ చేసిన సమయంలో నీటి వసతి కల్పించాలని డీలర్లకు సూచించారు.చౌకు ధరలు దుకాణం డీలర్లు స్టాక్ రిజిస్టర్ ఖచ్చితమైన రికార్డులతో చూపించాలని పేర్కోన్నారు.స్టాక్ వెంటనే బోర్డు ప్రతి దినం చౌకుదారుల దుకాణం నందు తెలుపుతూ బోర్డు పైన డిజి ఆర్వో ఫోన్ నెంబర్ను డిస్ప్లే చేయాలన్నారు. నిత్యవసర సరుకులు సరిగా పంచలేని డీలర్లు పై ఏపీ స్టేట్ టిపిఓఎస్ ఆర్డర్ నందు 2018 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మహేష్ గౌడ్, వీఆర్వోలు తిప్పన ,రాఘవేంద్ర స్వామి, లింగప్ప,ఈరప్ప ,మస్తాన్, నాగరాజు , రమేష్, డీలర్లు , ఎండియూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాలతో “హనుమాన్ జయంతి” వేడుకలకు గట్టి పోలీసు బందోబస్తు

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ , నేరాల నియంత్రణలపై ప్రత్యేక దృష్టి పెట్టినా పోలీసులు గురువారం శ్రీ హనుమాన్ జయంతి నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి వేడుకలు, శోభయాత్ర లు నిర్వహించే ప్రదేశాలలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

నేర ప్రవృత్తికి స్వస్తి పలకి .. సత్ప్రవర్తనతో ఉండాలి

• శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుంది కఠిన చర్యలు తీసుకుంటాం … కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ V POWER  NEWS  : నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి ,చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కృషి చేస్తాం ..

• గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను 6 నెలల్లో పూర్తిచేస్తాం.. కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్  సింగ్ రాణా,  గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు మంత్రి వెంట పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయనచే విశేష పూజలను చేయించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాలను అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా కేంద్ర ఆహార పౌర సరఫరాలు, శుద్ధ ఇందన శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ అహోబిల శ్రీలక్ష్మి నరసింహ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని అహోబిలంలో స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అహోబిల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలో గల ఓర్వకల్ వద్ద గల సోలార్ ప్లాంట్ లో అత్యధిక విద్యుత్ ఉత్పాదనకు ముమ్మరంగా పనులు చేయడం జరుగు తోందని కేంద్రమంత్రి ప్రహ్లాదు జోషి తెలిపారు. ఓర్వకల్ మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను రానున్న 6 నెలల్లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని త్వరలోనే పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి జోషి హామీ ఇచ్చారు. దేశాభివృద్ధి కోసం నిత్యం శ్రమించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో సోలార్ ప్లాంట్ లో 1700 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదనకు ముమ్మారంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ పైల వాసుదేవరావుకు  విప్లవ జోహార్లు ..

  V POWER NEWS,  నందికొట్కూరు :  శ్రీకాకుళ సాయిద రైతాంగ పోరాటయోధుడు అజ్ఞాత సూర్యుడు సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ  పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి 15వ వర్ధంతి సభ స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ  కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ నాటి శ్రీకాకుళ గిరిజన సాయిధ రైతాంగ పోరాటంలో పనిచేసి భూమికోసం. భుక్తి కోసం .ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక మార్గమని నమ్మి తన తుది  శ్వాస విడిచే వరకు కామ్రేడ్ పైలా వాసుదేవరావు పనిచేశారన్నారు .బడా బూర్జువ  బడా భూస్వామ్య నిరంకుశ పాలక వర్గాలను మెడలు వంచి  ఈ దేశంలో ఎర్రజెండాను ఎగరవేయాలని పట్టుదలతో ప్రతిఘటన పోరాటాలను నిర్మించేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు .శ్రీకాకుళ పోరాట వారసత్వంతో దోపిడీ  పీడనలు లేని సమ సమాజ స్థాపన కై ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. నేడు దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న భూస్వామ్య బడా కార్పొరేట్ సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమి ఈ పోరాటాలను ఒక ప్రక్క నెత్తురు  టేర్ల లో ముంచుతూ మరోపక్క ప్రజలను మతం .కులం  తెగలు పేరుతో విభజించి తమ కార్పొరేట్ కాషాయఎజెండాను అమలు చేయడానికి బ్రాహ్మణీయ హిందుత్వను ప్రజలపై ప్రయోగిస్తున్నది .కుహనా దేశభక్తి జాతీయ తల పేరు చెప్పి లౌకికవాదంపై దాడి చేస్తుంది అన్నారు. రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కూటమి సూపర్ సిక్స్  పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి నాలిక మడత పె బెడుతున్నది .మోడీ అమిత్ షా కూటమిలో భాగంగా ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపడానికి పూనుకుంటుంది .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా భూస్వాములకు ఆదాని .అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు సామ్రాజవాదుల యొక్క బహుళ జాతి సంస్థలకు సేవ చేయడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు అందువలన అన్ని వర్గాల ప్రజలని సమరశీల పోరాటాలకు సమహిత్యం చేసినప్పుడే పైల గారికి నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారతా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎం గోపాల్ . ఐ ఎఫ్ టి యు  డివిజన్ అధ్యక్షులు పి తిక్కయ్య .మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే గోవిందు .తిమ్మన్న .ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు దేవన్న. భాస్కర్ .రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

ఆంధ్రప్రదేశ్ లో… ఘనంగా ” శ్రీ సేవాలాల్ మహారాజ్ ” జయంతిని  అధికారికంగా  జరిపించాలి …

LHPS రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్    V POWER NEWS  :  లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయం విలేకరుల సమావేశంలో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్  మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా 15 కోట్ల జనాభా కలిగిన లంబాడి బంజారా తెగలకు సంబంధించిన వారు దేశవ్యాప్తంగా ఒకే సంస్కృతి ఒకె సాంప్రదాయాలు పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకే భాషని మాట్లాడుతూ జీవిస్తున్న బంజారా జాతి కులదైవం ఆరాధ్యుడు జాతి ప్రజలు అందరూ మంచి మార్గంలో నడవాలని భారతదేశమంతా కూడా నడిచి తన సందేశాన్ని బంజారా జాతి తో పాటు ఇతర జాతుల వారిని కూడా చైతన్యపరిచినటువంటి మార్గదర్శకుడు శాంతి స్వరూపుడు అహింస వాది నేటికీ ప్రతి రాష్ట్రంలో ఫిబ్రవరి 14,15 తేదీలలో శ్రీ సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజు అధికారికంగా జరుపుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా జరపకపోవడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల పైబడి జనాభా గలిగిన లంబాడీల మనోభావాలు దెబ్బతీయడమే నని అన్నారు ఈ సందర్భంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న, త్రిపురనేని రామస్వామి చౌదరి,  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి , పుట్టపర్తి నారాయణచార్యుల,  బాబు జగజీవన్ రామ్,  మహాత్మ జ్యోతిరావు పూలే , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,  అల్లూరి సీతారామరాజు,  మహర్షి వాల్మీకి జయంతి ఇలా ప్రముఖుల జయంతుల్ని వర్ధంతులను ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ యువజన సర్వీసులు దేవాదాయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో 12 లక్షల పైబడిన జనాభా కలిగి 40 నియోజకవర్గాలలో ఓటు శాతం ఉన్న గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ని కూడా రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ  కార్య్రమంలో  ఎస్ నాగరాజు నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దేవావత్ శంకర్ నాయక్ మరియు తదితరులు ఉన్నారు.

జిల్లా ఎస్పీని ఆశ్రయించినా … నా సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు… బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన

సప్తపదుల సూత్రాలలో … భర్త బలవంతముగా దౌర్జన్యంగా తీసుకొనివెళ్లి సంసారం చేయించుకోవడం ఒక సూత్రం అన్న సీఐ చంద్రబాబునాయుడు. నాకూ జరిగినా అన్యాయం  ఇంకోవరికి జరుగకుండా  చూడాలని  జిల్లా sp  ని కోరినా బాధితురాలు  భర్త,కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించి, న్యాయం చేయండి మహాప్రభో. .. బాధితురాలు కళ్లెం యశోద ఆవేదన.  V POWER NEWS  : news ప్రేమించానన్నాడు.అంగీకరించకపోతే బాధితురాలి అక్కతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇరువురు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అనంతరం అసలు సైకోరూపం బహిర్గతం అయింది. అతని బుద్ది దారి తప్పింది. మానసికంగా,శారీరకంగా హింసించడం, ప్రశ్నించిన వారిపై అక్రమసంబంధాల పేరుతో దుర్భషలాడడం ఇది తంతుగా తాళి కట్టిన భార్యను వేధింపులకు గురిచేయడంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఘటన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,నన్నూరు గ్రామానికి చెందిన మహిళా కె.యశోదకు జరిగింది. ఈ నేపథ్యంలో బాధితురాలు కె.యశోద, కుటంబ సభ్యులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేసింది. నందికొట్కూరుకు చెందిన ఆవుల సురేష్ అనే వ్యక్తికి ఇరువురు పెద్దల అంగీకారంతో 2019,మార్చి,13న వివాహం చేశారని అన్నారు.అయితే కొంతకాలం సజావుగా సాగిన కుటుంబం,గత ఆరు సంవత్సరాలుగా సురేష్ వేధింపులకు తాళలేక తల్లి వద్ద జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.ఇది సాగించలేక తనను,తన కుటుంబ సభ్యులపై ఇష్టానుసారంగా దాడులు చేయడం, గాయపరచడం జరుగుతుంది.  అంతేకాకుండా 2025, మార్చి,15వ తేదీన భర్త సురేష్,వారి కుటంబ సభ్యులు రెండు ఆటోలతో వచ్చి,బలవంతంగా తనను, కుమార్తెను తీసుకెళ్లి దాడి చేయడం జరిగిందని ఆవేదన చెందారు.  ఈ సందర్బంగా తన కుటుంబ సభ్యులు నందికొట్కూరు, ఓర్వకల్,కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన కూడా కనీసం స్పందించకపోవడం బాధాకరం అని కన్నీటిపర్యంతమైంది. చివరకు 112 కాల్ సెంటర్ కు ఫోన్ ద్వారా పిర్యాదుచేయడంతో స్పందించిన అధికారులు ఇద్దరు కానిస్టేబుల్ లు ఘటన స్థలానికి చేరుకొని, రక్షణ కల్పించి, నందికొట్కూరు అర్బన్ స్టేషన్ కు అప్పగించారని పేర్కొన్నారు. అనంతరం కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు వారిని కలిసి నాపై నాకు ఇష్టం లేకున్నా నన్ను నా కూతుర్ని దౌర్జన్యంగా దాడి చేస్తూ బలవంతముగా తీసుకువెళ్లడం జరిగిందని తెలియపరచి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోమని కోరగా ” సప్తపదుల సూత్రాలలో ” భర్త భార్యను బలవంతంగా తీసుకొని వెళ్లి కాపురం చేయించుకోవడం ఒక సూత్రం అని తెలయ చెప్పిన సీఐ చంద్రబాబు నాయుడు, దౌర్జన్యం బలవంతముగా తీసుకువెళ్లిన కేసు నేను కట్టను అని ఇదే నా “లా” ఇదే నా “రూల్” అంటూ నాకు తెలియపరచి పంపివేయడం జరిగింది.  నీ ఇష్టం ఉంటే ఓర్వకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి 498a కేసు కడతారు కట్టించుకో “లేదా” నీ ఇష్టం వచ్చిన వారికి తెలియపరుచుకో అని పంపించడం జరిగిందన్ని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం నాకు ఓర్వకల్లో గాని రూరల్ సిఐ సర్కిల్ ఆఫీసులో గాని న్యాయం జరగదని తెలుసుకొని జిల్లా ఎస్పీ దొరవారికి ఫిర్యాదు చేసు కొంటె ,మహిళ పీఎస్ వారికి సిఫార్సు చేసి న్యాయం చేయమని తెలపరిచారని, అయినా అక్కడ నాకు న్యాయం జరగకపోవడంతో మీడియా మిత్రుల ద్వారా నా ఆవేదన వ్యక్తపరచుకొని ఫై అధికారులకు తెలపరిచి నా భర్త సురేషు మరియు వారి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని రక్షణ కల్పించమని మీడియా ప్రతినిధుల ద్వారా పై అధికారులకు తెలపరుచుకుంటూన్నా అని ఆవేదన వ్యక్తం చేసింది.  అయితే ప్రస్తుతం జిల్లా ఎస్పీని ఆశ్రయించిన సమస్యపై ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భర్త సురేష్ మరియు వారి కుటుంబ సభ్యుల నుండి తనకు, తన కుమార్తెకు ప్రాణహాని ఉందని, కనీసం తమకు రక్షణ కల్పించాలని,లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన చెందారు.

భూ సమస్యలను ….సామరస్యంగా పరిష్కరించుకోవాలి – పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్

V POWER NEWS : సామరస్యంగా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం హలహర్వి మండలం కామినహల్ గ్రామంలో పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంలో ఏమైనా కొలతలు తేడాలు, భూసమస్యలు ఉంటే నేరుగా అధికార సమక్షంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. మండల రెవెన్యూ అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కామినహల్ గ్రామానికి చెందిన రైతు మహిళ ఆర్ లక్ష్మి దేవి మాట్లాడుతూ సర్వేనెంబర్ 277,278 నాలుగు ఎకరాల పొలంలో సాగులో ఉన్నాం ఆన్లైన్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నజ్మభాను, డిప్యూటీ తాహాశీల్దార్ జి.లక్ష్మి, ఆర్ ఐ మహేష్ గౌడ్, సర్వేర్ దేవేంద్ర స్వామి, వీరాంజనేయులు, జనార్ధన, విఆర్ఓలు, విఆర్ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

చాగలమర్రి యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక.

V POWER  NEWS  :  నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కరుణా కటాక్షలతో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తొమ్మండ్రు వినోద్ కుమార్ ఎన్నికయ్యారు.ఆయనకి యువజన సంఘం సభ్యులందరూ పూలదండ వేసి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు.గతంలో చెప్పినట్టుగానే అయప్ప స్వామి దేవస్థాన ఆలయ ఆవరణంలో రేకుల షెడ్డుకు గాను విరాళము అందించిన తొమ్మండ్రు వినయ్ కుమార్ కు ఆర్యవైశ్య సంఘం , యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాల వేసి శాలువ కప్పి ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా 2025వ సంవత్సరంలో వాసవి యువజన సంఘం నూతన కమిటీ అధ్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ కుమార్ , ఉపాధ్యక్షులు : కామిషెట్టి మధుసూధన్ రావు , బచ్చు సుగుణాకర్ , కార్యదర్శి : బింగుమళ్ళ హరికృష్ణ , ఉప-కార్యదర్షులు : తలుపుల సునిల్ కుమార్ , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, వందవాసీ శివసుబ్బ చక్రధర్ , కోశాధికారి : లింగం రంగనాథ్ , ఉప-కోశాధికారి : కామిషెట్టి సుబ్రమణ్యం కార్యవర్గ సభ్యులు : బైసాని వెంకటేశ్వర్లు , బింగుమళ్ళ సందీప్ , గంగిశెట్టి వాసుదేవయ్య , కామిశెట్టి ప్రసాద్ , మేడ నరేంద్ర , అయినాల శ్రీనివాసులు , మద్దాల సుబ్రమణ్యం , చాటకొండు దుర్గ ప్రసాద్ గార్లను నియమించి నూతన కార్యవర్గంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ , కమిటీ సభ్యులు , అవోపా అధ్యక్షుడు సుంకు రాజేష్ , కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!