మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం చెక్ పోస్ట్ వద్ద శనివారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా కొందరు టాటా సుమోలో అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు సిఐ రమేష్ రెడ్డి తెలిపారు..వాహనంలో 30 బాక్సుల మద్యం 2080 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులు వెంకటేష్, తిమ్మయ్య, నాగయ్య గౌడ్ ను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.