….
కర్నూలు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా చౌక దుకాణల్లో సరుకులను సులభతరంగా తీసుకోవచ్చని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని గ్రామ సచివాలయంలో రేషన్ కార్డుదారులకు ఆయన స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం అందులో భాగంగా స్మార్ట్ కార్డులను అందజేస్తుందన్నారు. ఇప్పటి వరకు వేలి ముద్రలు పడక రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారని, ఇప్పుడు వేలి ముద్రలు పడకపోయిన స్మార్ట్ కార్డును స్కాన్ చేసి సరుకులు తీసుకోవచన్నారు. ఏటీఏం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులో కార్డు దారుడి ఫోటోతో పాటు కుటుంబ సభ్యులు,ప్రభుత్వ గుర్తింపు ముద్ర మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణ యాదవ్, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.