సైనికుల త్యాగం గొప్పది వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలి … నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

– మూగ, చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతం.

– వైద్య సేవల్లో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదాం.

— నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

V POWER NEWS  …NANDYAL  : 
 దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా  మూగ, చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.  సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్బంగా నంద్యాల మధు మణి ఆసుపత్రి ఆవరణలో నంద్యాల భారతీయుల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో  వీర సైనికునికి వందనం పేరుతో ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ లలో పనిచేస్తున్న సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలోని అన్ని ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఓ పి డి చికిత్సలు, వినికిడి లోపల ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు ( వినికిడి యంత్రాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణి చేశారు.  ఈ సందర్బంగా ఎంపీ శబరి మాట్లాడుతూ దేశ సేవలో సైనికుల త్యాగం గొప్పదని వారికీ, వారి కుటుంబాలకు ప్రయివేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడం అభినందనీయం అన్నారు. 

అలాగే మధు మణి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదనరావు  రూ 1000/- విలువైన వినికిడి పరీక్ష (OAE) పూర్తిగా ఉచితంగా, వినికిడి సమస్యల వారికి ఉచిత పరీక్షలు చేయడం,  పుట్టు, మూగ, చెవిటి పిల్లలు శబ్దాలు విన్నా తిరిగి చూడని పిల్లలు, రెండు అక్షరాల పదాలు అత్త, మామ, అమ్మ,అని కూడా పలుకలేకపోయిన నిరుపేదలకు  ఉచితంగా వినికిడి యంత్రాలు అందించడం,  2-3 సంవత్సరాలైనా అందరి పిల్లల మాట్లాడకపోయిన వారి రెండు చెవులకు 13 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని మధుమణి నర్సింగ్ హోమ్ నందు డా. ఎన్. టి. ఆర్ వైద్య సేవ & CMRF ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయం అన్నారు. భారతదేశంలో నంద్యాల లాంటి చిన్న జిల్లాలలో 150 ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసిన ఏకైక ఆసుపత్రి మధుమణి నర్సింగ్  గర్వాంగా ఉందన్నారు.  అందరు డాక్టర్ల సహకారంతో  నంద్యాల జిల్లాను వైద్య సేవల్లో మొదటి స్థానం నిలుపుదాం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు. నంద్యాల వైద్యుల బృందంను త్వరలో ఢిల్లీలోని డిఫెన్స్ మంత్రి వద్దకు తీసుకెళ్లుతానని ఆమె చెప్పారు. రాష్ట్రంలోనే నంద్యాల వైద్యుల ఉచిత సేవలు గొప్పవని చాటుద్దాం అన్నారు.  ఈ కార్యక్రమంలో  టీడీపీ నాయకులు ఎన్ ఎం డి ఫయాజ్, ఎంపీ శబరి గురువు లు డాక్టర్ ఫణిందర్, నంద్యాల ఐ ఎం ఏ అధ్యక్ష, కార్యదర్సులు మధుసూదనరావు, జి. రవికృష్ణ, డాక్టర్లు నాగమణి, మాధవి, మణిదీఫ్, ఎం. వెంకట మస్తానయ్య, రోహిత్, తదితర వైద్యులు ఉన్నారు.

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!